న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం

 

కాకినాడ‌, ఆగ‌స్టు 24 (ప్రజా అమరావతి);


*న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం


కింద‌*

జిల్లాలో 8,877 మందికి రూ. 11.44 కోట్ల ల‌బ్ధి

- కాకినాడ జిల్లా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా వెల్ల‌డి


న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం ద్వారా కాకినాడ జిల్లాలో 8,877 మందికి రూ. 11.44 కోట్ల మేర ల‌బ్ధి జ‌రుగుతోంద‌ని జిల్లా క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా తెలిపారు. వివిధ సంక్షేమ ప‌థ‌కాల‌కు అర్హ‌త ఉండి నిర్ణీత స‌మ‌యంలో ద‌ర‌ఖాస్తు చేసుకోలేక‌పోవ‌డం, బ్యాంకు ఖాతా వివ‌రాలు స‌రిగా లేక‌పోవ‌డం త‌దిత‌ర కార‌ణాల వ‌ల్ల మిగిలిపోయిన వారికి న‌వ‌ర‌త్నాలు-ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం ద్వారా ల‌బ్ధి మొత్తాన్ని ల‌బ్ధిదారుల ఖాతాల్లో జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని గురువారం ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్‌రెడ్డి.. తాడేప‌ల్లి క్యాంపు కార్యాల‌యం నుంచి ప్రారంభించారు. ఈ కార్య‌క్ర‌మానికి కాకినాడ క‌లెక్ట‌రేట్ నుంచి క‌లెక్ట‌ర్ డా. కృతికా శుక్లా, ఎమ్మెల్సీ క‌ర్రి ప‌ద్మ‌శ్రీ, కుడా ఛైర్‌ప‌ర్స‌న్ రాగిరెడ్డి చంద్ర‌క‌ళా దీప్తి, రాష్ట్ర అయ్యార‌క కార్పొరేష‌న్ ఛైర్‌ప‌ర్స‌న్ ఆవాల రాజేశ్వ‌రి.. గ్రామీణాభివృద్ధి, విద్య‌, బీసీ సంక్షేమం, సాంఘిక సంక్షేమం త‌దిత‌ర శాఖ‌ల అధికారులు, వివిధ ప్రాంతాల ల‌బ్ధిదారుల‌తో క‌లిసి వ‌ర్చువ‌ల్‌గా హాజ‌ర‌య్యారు. బ‌ట‌న్ నొక్కి ల‌బ్ధిదారుల ఖాతాల్లోకి న‌గ‌దును జ‌మ‌చేసే కార్య‌క్ర‌మాన్ని ముఖ్య‌మంత్రి ప్రారంభించిన అనంత‌రం క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా.. ప్ర‌జాప్ర‌తినిధులు, వివిధ శాఖ‌ల అధికారుల‌తో క‌లిసి ప‌థ‌కాల ల‌బ్ధిదారులు, విద్యార్థుల‌కు రూ. 11.44 కోట్ల మెగా చెక్‌ను అంద‌జేశారు. ఈ సంద‌ర్భంగా క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా మాట్లాడుతూ ల‌బ్ధిదారుల‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. ప‌థ‌కాల లబ్ధి మొత్తాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు. రాష్ట్ర ప్ర‌భుత్వం గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల స్థాయిలో అత్యంత పార‌ద‌ర్శ‌క‌త‌, జ‌వాబుదారీత‌నంతో అర్హులంద‌రికీ సంతృప్తిక‌ర స్థాయిలో ప‌థ‌కాలు అందించ‌డం జ‌రుగుతోంద‌ని తెలిపారు. అర్హ‌త ఉండి ఏ కార‌ణంచేత‌నైనా ల‌బ్ధి చేకూర‌కుండా ఉంటే వెంట‌నే గ్రామ‌, వార్డు స‌చివాల‌యాల‌ను సంప్ర‌దించి ద‌ర‌ఖాస్తు చేసుకుంటే వెరిఫికేష‌న్ చేసి ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మంలో ల‌బ్ధి చేకూర్చ‌డం జ‌రుగుతుంద‌ని క‌లెక్ట‌ర్ కృతికా శుక్లా వివ‌రించారు. కార్య‌క్ర‌మంలో డీఆర్‌డీఏ పీడీ కె.శ్రీర‌మ‌ణి, బీసీ సంక్షేమ శాఖ అధికారి ఎస్‌వీఎస్ సుబ్బ‌లక్ష్మి, సాంఘిక సంక్షేమ జేడీ డీవీ ర‌మ‌ణ‌మూర్తి, మ‌త్స్య‌శాఖ జేడీ పీవీ స‌త్య‌నారాయ‌ణ, వివిధ శాఖ‌ల అధికారులు, ప‌థ‌కాల ల‌బ్ధిదారులు త‌దిత‌రులు హాజ‌ర‌య్యారు.

***

*ల‌బ్ధిదారుల మ‌నోగ‌తం*


1. *ఎంతో గొప్ప‌గా సంక్షేమ ప‌థ‌కాలు*

బ్యాంకు ఖాతాలో స‌మ‌స్య కార‌ణంగా వైఎస్ఆర్ ఆస‌రా మొత్తం అంద‌లేదు. వాలంటీర్ సూచ‌న‌, స‌హాయంతో స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాను. ఇప్పుడు ఆ ప‌థ‌కం ద్వారా నాకు ల‌బ్ధి చేకూరుతోంది. ఇంత గొప్ప‌గా సంక్షేమ ప‌థ‌కాలు అందిస్తున్న గౌర‌వ ముఖ్య‌మంత్రికి ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను. వాలంటీర్‌, స‌చివాల‌య వ్య‌వ‌స్థ‌లు ద్వారా మాలాంటి పేద‌ల‌కు ఎంతో మేలు జ‌రుగుతోంది. ఎవ‌రూ ఎక్క‌డికీ వెళ్లాల్సిన అవ‌స‌రం లేకుండా మా ఇళ్ల వ‌ద్దే ప్ర‌భుత్వ సేవ‌లు అందుతున్నాయి.

- కె.ర‌త్నం, పెనుమ‌ర్తి, కాకినాడ గ్రామీణం.


2. అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక‌గా ప‌థ‌కాల అమ‌లు

సంక్షేమ కేలండ‌ర్ ప్రకారం అమ్మ ఒడి ల‌బ్ధి మొత్తాన్ని రాష్ట్ర ప్ర‌భుత్వం విడుద‌ల చేసిన స‌మ‌యంలో క‌రెంట్ బిల్లు స‌మ‌స్య కార‌ణంగా మా పిల్ల‌ల‌కు అమ్మ ఒడి రాలేదు. త‌ర్వాత స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించి, మ‌ళ్లీ ద‌ర‌ఖాస్తు చేసుకున్నాం. ఇప్పుడు ద్వై వార్షిక న‌గ‌దు మంజూరు కార్య‌క్ర‌మం ద్వారా అమ్మ ఒడి ల‌బ్ధి చేకూరుతోంది. కులం, మ‌తం, వ‌ర్గం, రాజ‌కీయం ఇలా వేటి ప్ర‌మేయం లేకుండా అర్హ‌త ఒక్క‌టే ప్రాతిప‌దిక‌గా ఎంతో చిత్త‌శుద్ధితో ప్ర‌జా సంక్షేమానికి న‌వ‌ర‌త్నాలు ప‌థ‌కాల ద్వారా కృషిచేస్తున్న గౌర‌వ ముఖ్య‌మంత్రికి మాలాంటి ల‌బ్ధిదారులు అంద‌రి త‌ర‌ఫున ధ‌న్య‌వాదాలు తెలియ‌జేస్తున్నాను.

- జి.కిశోర్‌కుమార్‌, 37వ వార్డు, కాకినాడ అర్బ‌న్‌.


*****

*ద్వైవార్షిక ల‌బ్ధి కార్య‌క్ర‌మం ల‌బ్ధిదారుల వివ‌రాలు*


ప‌థ‌కం                           ల‌బ్ధిదారులు      ల‌బ్ధి మొత్తం (రూ.)

1. జ‌గ‌న‌న్న అమ్మ ఒడి     646               96,90,000

2. వైఎస్ఆర్ నేత‌న్న నేస్తం  5                 1,20,000

3. ఈబీసీ నేస్తం               251               37,65,000

4. జ‌గ‌న‌న్న చేదోడు      2,046              2,04,60,000

5. వైఎస్ఆర్ మ‌త్స్య‌కార భ‌రోసా 47        4,70,000

6. జ‌గ‌న‌న్న వ‌స‌తి దీవెన     975          84,39,200

7. జ‌గ‌న‌న్న విద్యా దీవెన     1,481      2,07,69,737

8. వైఎస్ఆర్ ఆస‌రా            1,995      3,91,59,067

9. వైఎస్ఆర్ రైతు భ‌రోసా    1,431       1,15,68,000

మొత్తం                          8,877         11,44,41,004


Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image