దసరా పండుగకు 5,500 ప్రత్యేక సర్వీసులు .

 విజయవాడ (ప్రజా అమరావతి);

                                                                                                                   


దసరా పండుగకు 5,500 ప్రత్యేక సర్వీసులు 

( 13.10.2023 నుండి 26.10.2023 వరకు ) 

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మరియు కర్ణాటక ప్రజలు జరుపుకునే ముఖ్య పండుగలలో దసరా ఒకటి. ఈ దసరా పండుగకు దుర్గమ్మ ఆలయాలకు వచ్చి పోయే భక్తుల తాకిడి అధికంగా ఉంటుంది. 

దసరా పర్వదినాలు 

ఈ 2023 సంవత్సరంలో దసరా పండుగ ఈ క్రింది తేదీలలో జరుపనున్నారు.

దుర్గాష్టమి        22.10.2023

నవమి / దశమి 23.10.2023 

కాబట్టి ఆంధ్ర ప్రదేశ్ లోని నలుమూలల నుండి ప్రయాణికులు ఎక్కువగా ప్రయాణం కొనసాగిస్తారు. అంతేకాకుండా తెలంగాణ, హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై వంటి అంతరాష్ట్ర నగరాల నుండి వచ్చే ప్రయాణికులకు కూడా ఎటువంటి ఆటంకం కలగకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ప్రత్యేక బస్సులు నడపబోతున్నది. అదే విధంగా విజయవాడ నుండి రాష్ట్రంలోని అన్నిఇతర ప్రాంతాలకు తిరిగే బస్సులను యధావిధిగా నడపడంతో పాటు, వివిధ జిల్లాలకు, ముఖ్య పట్టణాలకు మరియు నగరాలకు కూడా ఇబ్బంది లేకుండా ఏ.పి.ఎస్.ఆర్.టి.సి. ప్రయాణీకుల అవసరం మేరకు ఈ 2023 సంవత్సరానికి దసరా పండుగ ముందు రోజులలో మరియు తర్వాత రోజులలో రద్దీని దృష్టిలో పెట్టుకుని 13.10.2023 నుండి 26.10.2023 వరకు మొత్తం 5,500 బస్సులు నడిపేందుకు ప్రణాళికలు సిద్ధం చేసింది. 


రాష్ట్రమంతటా... అన్ని ముఖ్య పట్టణాలు , నగరాలు, ప్రాంతాలకు 


సాధారణ రోజులలో APSRTC అనేక సర్వీసులతో బస్సులను నడుపుతుంది. కాగా, ఈ పండుగ రోజులలో అదనంగా హైదరాబాద్, చెన్నై, బెంగుళూరు వంటి పొరుగు రాష్ట్రాలకు మరియు రాష్ట్రంలోని మఖ్యపట్టణాలు, నగరాలకు, ప్రాంతాలకు అనగా విశాఖపట్నం, విజయవాడ, కర్నూలు, రాజమండ్రి, బెంగుళురు, చెన్నై, తిరుపతి, అనంతపురం, విజయనగరం, కాకినాడ, భీమవరం, అమలాపురం, కడప, భద్రాచలం, శ్రీశైలం, మార్కాపురం, ఒంగోలు, తుని, శ్రీకాకుళం, నెల్లూరులకు ఈ 5,500 ప్రత్యేక బస్సులు నడపబడతాయి.


వివిధ ప్రాంతాలకు బస్సులు ఈ విధంగా నడపబడతాయి.

13.10.2023 నుండి 22.10.2023 వరకు (దసరా ముందు రోజులలో)    -2,700 బస్సులు

23.10.2023 నుండి  26.10.2023 వరకు ( దసరా తర్వాత రోజులలో )  -2,800 బస్సులు

 

ఎక్కడి నుంచి ఎక్కడకు? ఎన్నెన్ని  బస్సులు? 


హైదరాబాద్ నుండి 2,050 బస్సులు, బెంగుళూరు నుండి 440 బస్సులు, చెన్నై నుండి 153 బస్సులు వివిధ పట్టణాలకు నడపబడతాయి. విశాఖపట్నం నుండి 480 బస్సులు, రాజమండ్రి నుండి 355 బస్సులు, విజయవాడ నుండి 885 బస్సులు, అదే విధంగా రాష్ట్రంలోని ఇతర జిల్లాల నుండి వివిధ ప్రాంతాలకు/ పల్లెలకు/ నగరాలకు 1,137 ప్రత్యేక బస్సుల కేటాయింపుతో రద్దీని తట్టుకునే విధంగా ఏర్పాటు చేయబడ్డాయి.


ఈసారి ప్రత్యేకం ఏమిటి?


ప్రయాణికులపై భారం మోపకూడదనే ముఖ్య ఉద్దేశ్యంతో ఈ సారి కూడా సాధారణ ఛార్జీలతోనే ఈ ప్రత్యేక బస్సులు నడపబడతాయి. ఈ సారి కూడా APSRTC ప్రయాణికులకు ఆర్ధిక వెసులుబాటు, ఊరట  కలిగించింది. 



ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా, బస్సులు, అధికారులు, సిబ్బంది సంసిద్ధం 


ఈ పండుగ నవరాత్రులలో విజయవాడ కనక దుర్గ గుడికి ఎక్కువ మంది భవానీలు వచ్చే అవకాశం ఉన్నందున వారి రద్దీని బట్టి బస్సులు నడిపేందుకు ప్రణాళికలు చేసింది. కళాశాలలకు, పాఠశాలలకు, వరుస సెలవులు మరియు ఉద్యోగులకు వరుస సెలవులు కారణంగా ప్రయాణ అవసరాలు ఎక్కువగా ఉంటాయి. స్వస్థలాలకు రావడానికి, తిరిగి వెళ్ళడానికి APSRTC బస్సుల మీద ప్రయాణికులు ఎక్కువగా ఆధారపడతారు. ఈ కారణంగా అన్ని జిల్లాల నుండి విజయవాడకు 885 బస్సులు నడిపి రవాణా సేవలు అందించేందుకు APSRTC అధికారులు, సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు.


నూతన UTS (UnifiedTicketingSolution) - చిల్లర సమస్యలకు చెక్ 

అంతేకాకుండా APSRTC లో  కొత్తగా ప్రవేశ పెట్టిన UTS మెషీన్ల వలన ఈసారి చిల్లర సమస్య అనే ప్రస్తావనకు అవకాశం   లేదు.  ప్రయాణికులు చాలా సులభంగా ఫోన్ పే, గూగుల్ పే, QR కోడ్ స్కాన్ చేయడం, క్రెడిట్, డెబిట్ కార్డుల స్వైపింగ్ ద్వారా కూడా టిక్కెట్లు తీసుకుని ప్రయాణం సాగించే వీలుంది. మరియు ముందస్తుగా సీటు వివరాలు చెక్ చేసుకుని బస్సులను ఎంచుకునే అవకాశం కూడా ఉండడంతో ఈసారి ప్రయాణీకులకు మరింత సేవలు అందించడానికి APSRTC కృషి చేస్తుంది. ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా, ఇబ్బందులకు తావివ్వకుండా కూడా సిబ్బందికి ఆదేశాలు ఇవ్వనుంది.


ముందస్తు రిజర్వేషన్లు :


ప్రయాణికుల సౌకర్యార్ధం ఈ స్పెషల్ సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఇప్పటికే కల్పించబడింది మరియు రాను పోను అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకున్న ప్రయాణికులకు ఛార్జి లో 10% రాయితీ సౌకర్యము కలదు. ATB ఏజెంట్లు, APSRTC యాప్ మరియు ఆన్ లైన్ లలో ద్వారా కూడా టిక్కెట్లు పొందవచ్చు. 



పర్యవేక్షకులుగా ఆఫీసర్లు, సూపర్వైజర్లు 


ఈ సర్వీసుల పర్యవేక్షణకై జిల్లా ముఖ్య కేంద్రాలు మరియు హైదరాబాద్ లలో పలు పాయింట్ల వద్ద అధికారులు, సూపర్ వైజర్లు, సెక్యూరిటీ సిబ్బంది విధులు నిర్వహిస్తారు. అన్ని బస్సులకు GPS ట్రాకింగ్ మరియు 24x7 సమాచారం/ సమస్యలకై కాల్ సెంటర్ నెంబర్ 149 మరియు 0866-2570005 అందుబాటులో ఉంటాయి.


ప్రయాణీకులే పరమావధిగా సేవలు


ప్రయాణీకులే పరమావధిగా భావించి, మీ ఆదరణే మా ఆర్టీసీ లక్ష్యంగా ఎన్నో దశాబ్దాలుగా మీకు సేవలు అందిస్తున్నాము. కాబట్టి ప్రయాణికులు APSRTC బస్సులలోనే ప్రయాణించి, మమ్మల్ని, మా సేవలను వినియోగించుకోగలరని నమ్ముతున్నాము. ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా APSRTC సిబ్బంది నిత్యం మిమ్మల్ని క్షేమంగా మీ మీ గమ్యస్థానాలకు చేర్చేందుకు నిరంతరం సంసిద్ధంగా ఉంటారు. 

Comments