రాష్ట్ర ప్రజలు మా వెన్నంటే ఉన్నారు.

                                        

రాష్ట్ర ప్రజలు మా వెన్నంటే ఉన్నారు


తెనాలి (ప్రజా అమరావతి);

రాష్ట్ర ప్రజలు తాము చేసిన  సంక్షేమం తో కూడిన అభివృథ్థిని చూసి తమ వెంటే ఉన్నారని తెనాలి శాసన  సభ్యులు అన్నాబత్తుని  శివకుమార్ అన్నారు. స్డానిక తెనాలి  రామకృష్ణ కవి కళాక్షేత్రంలో  గ్రామ వాలంటీర్లు గృహసారథులు MPTC లూ సర్పంచులతో  "APకి CMజగన్ యే ఎందుకూ కావాలి" ?అన్న అంశంపై అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ గత  చంద్రబాబు ప్రభుత్వం లో నెరవేరని హామీలు తమ ప్రభుత్వం నెరవేర్చిందని  దీనిపై అక్టోబరు 11మథ్యాహ్నం నుండి గడపగడపకూ తమ  పార్టీ నాయకత్వం గడపగడపకూ తిరగుతుందని అన్నారు.



ఇందులో నెరవేర్చిన హామీలలో టిక్కులు మార్క్ చూసి  ఎక్కువ  మార్కులు ఎవరికి అంటే బాబుకా? జగన్  కా ?అనేది నిర్ఢారించి సంంబథిత ఇంటి యజమాని(Stamp )ముద్ర తీసుకోవటం జరుగుతుందన్నారు. నవంబర్ 20దాకా కొనసాగే కార్యక్రమంలో నిబథ్థతతో పాల్గొని పనిచేయాలని పైగా ఇది ఎన్నికల  సమయమని   అప్రమత్తంగా ఉండాలని అన్నారు. బాబు 2014లో  తమ ఎన్నికల ప్రణాళిక 64పేజీలు జగన్ 2019లో ఎన్నికల  ప్రణాళిక 2 పేజీలు.


ఈ  కార్యక్రమంలో  MPP శ్రీనివాసరావు, ZPTC  ఉమాప్రణతి, కాకి దేవససహాయం , మన్నవ ప్రభాకర్ (APIDC) ఫరీద్  , సర్పంచులు MPTCలు పాల్గొన్నారు.



Comments