దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీలో ఇదివరకే తీర్మానంచేసి కేంద్రానికి పంపించాం.



అమరావతి (ప్రజా అమరావతి);

*– క్యాంపు కార్యాలయంలో క్రైస్తవ ప్రతినిధులతో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమావేశం.*


రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వివిధ సంక్షేమ కార్యక్రమాలతో నిరుపేదలకు మేలు జరుగుతోందని, పారదర్శకంగా, వివక్షలేకుండా వారికి పథకాలు అందుతున్నాయని తెలిపిన క్రై స్తవ  ప్రతినిధులు.

డీబీటీ వల్ల చివరి లబ్ధిదారునకూ పథకాలు అందుతున్నాయన్న ప్రతినిధులు.

పాస్టర్లకూ గౌరవవేతనం ఇచ్చి సహాయకారిగా నిలిచారన్న ప్రతినిధులు.

బరియల్‌ గ్రౌండ్స్‌ సమస్య ఉందని, వాటిని పరిష్కరించాలని కోరిన క్రై స్తవ సంఘాల ప్రతినిధులు.

చర్చి ఆస్తుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలనికోరిన ప్రతినిధులు.

చర్చిల ఆధ్వర్యంలోని స్కూళ్లకూ, సేవా భవనాలకు మున్సిపల్‌ పన్ను నుంచి మినహాయింపునివ్వాలన్న ప్రతినిధులు.

జిల్లాకేంద్రాల్లో కమ్యూనిటీ హాళ్లను నిర్మించాలని కోరిన ప్రతినిధులు. 

దళిత క్రై స్తవులకు రిజర్వేషన్లు కోసం న్యాయపోరాటం చేస్తున్నామని దీనికి తోడుగా నిలవాలన్న ప్రతినిధులు, మతం మారినంతమాత్రాన పేదరికం పోదన్న ప్రతినిధులు.


*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే...:*


దళిత క్రై స్తవులకు ఎస్సీ హోదా ఇవ్వాలంటూ అసెంబ్లీలో ఇదివరకే తీర్మానంచేసి కేంద్రానికి పంపించాం


:

ఈ అంశం న్యాయస్ధానం పరిధిలో ఉందన్న విషయం మీకు తెలిసిందే :

శ్మశాన వాటికలపై ఇప్పటికే ప్రభుత్వం నివేదికలు తెప్పించుకుందని, లేనిచోట ఏర్పాటుకు ఇప్పటికే ఆదేశాలు ఇచ్చిందన్న సీఎం.

సచివాలయాల వారీగా ఎస్సీలకు శ్మశానవాటికలు లేనిచోట ఇప్పించేందుకు చర్యలు కూడా తీసుకుంటున్నామని తెలిపిన సీఎం.

Comments