ఏపీ కు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రికావాలి .

       తెనాలి (ప్రజా అమరావతి);

  ఏపీ కు జగన్ మళ్ళీ ముఖ్యమంత్రికావాలి 



సంక్షేమ పథకాల ప్రధాత వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని  తెనాలి మన్సిపల్ ఛైర్మన్ తాడిబోయిన రాథికా రమేష్ అన్నారు, మంగళవారం 18 వ వార్డు సచివాలయ పరిధిలో, ఏపీ కు జగన్ ఎందుకు కావాలి కార్యక్రమలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమెమాట్లాడుతూ 18వ వార్డులో 21.57 కోట్ల ను వివిథ సంక్షేమ పథకాలనూ అందించారన్నారు,


అన్ని రాష్ట్రాలు మన రాష్ట్రాన్ని ఆదర్శంగా తీసుకొని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నాయని అన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ఎన్నికల హామీలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 100% శాతం నెరవేర్చారని అన్నారు.


 సచివాలయ ఉద్యోగులు, వాలంటీర్లు కరోనా సమయంలో ఇంటింటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందజేశారని తెలిపారు.  మళ్ళీ సీఎం గా జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రి గా లోకల్ శివకుమర్ ను MLA గా గెలిపించాలని కోరారు.


 వైకాపా టౌన్ అద్యక్షులు మద్దాలి శేషాచలం, కౌన్సిలర్ షేక్ గౌసియా, మేనేజరు అప్పలరాజు,  సచివాలయ సిబ్బంది, స్దానిక వైకాపానాయకులు  తదితరులు పాల్గొన్నారు.



Comments