రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాధాన్యత తెలిపే విధంగా సినిమా రూపకల్పన.

 

విజయవాడ (ప్రజా అమరావతి);

                

                                        ఫైబర్ నెట్ లో నేడు ‘ఓటు’ సినిమా విడుదల

రానున్న ఎన్నికల నేపథ్యంలో ఓటు ప్రాధాన్యత తెలిపే విధంగా సినిమా రూపకల్పన


ఓటు చిత్రంతో హీరో, హీరోయిన్లుగా పరిచయమవుతున్న శౌర్య, తన్వీ నేగిలు..

ఫస్ట్ డే ఫస్ట్ షో కు లభిస్తున్న ఆదరణతో మరిన్ని మంచి సినిమాల విడుదలకు సన్నాహాలు

అతి త్వరలో అందుబాటులోకి ఫైబర్ నెట్ యాప్ 

నెలకు కేవలం రూ. 190 లకే ఇంటర్ నెట్ సౌకర్యం.

ఫైబర్ నెట్ కనెక్షన్ లు కోటి కి చేరుకోవటానికి ప్రణాళికలు సిద్ధం

ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా త్వరలోనే ఇంటింటికి ఉచితంగా ఇంటర్ నెట్ 


- ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి. 

              ఫైబర్ నెట్ ద్వారా ఐదో సినిమాగా ‘ఓటు‘ మూవీని శనివారం ఫస్ట్ డే ఫస్ట్ షోగా ప్రదర్శిస్తున్నట్లు ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ (ఏపీఎస్ఎఫ్ఎల్) ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ ఆవరణలోని ఎన్టీఆర్ అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ 3వ ఫ్లోర్ లోని ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ రాష్ట్ర కార్యాలయంలో శుక్రవారం ‘ఓటు’ చిత్ర బృందంతో కలిసి మీడియాతో ఆయన సినిమా విశేషాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఫైబర్ నెట్ లిమిటెడ్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ ఫస్ట్ డే ఫస్ట్ షో లో భాగంగా ఫైబర్ నెట్ లో 5వ సినిమాగా “ఓటు” సినిమాను శనివారం ప్రదర్శించనున్నామని పేర్కొన్నారు. కేవలం రూ. 39 చెల్లించి ఇంటిల్లిపాది ఇంట్లో కూర్చుని సినిమాను 24 గంటల సమయంలో ఎన్నిసార్లైనా వీక్షించవచ్చని,  ఈ అవకాశాన్ని వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. చిన్న సినిమాలకు చేయుతనివ్వాలన్న ఉద్దేశ్యంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని చెప్పారు.  ‘ఓటు’ సినిమాకు రవి దర్శకత్వం వహించగా, హ్రితిక్ శౌర్య, తన్వీ నేగీలు హీరో, హీరోయిన్లుగా పరిచయం అవుతున్నారని, సంగీతం అగస్త్య అందించగా డివోపీగా రాజశేఖర్ వ్యవహరించారని వివరించారు. సందేశాత్మకంగా రూపొందించిన ఇలాంటి సినిమాలను ప్రజలు ఆదరించాలని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి కోరారు. 

                                      ఇంటింటికి ఉచిత ఇంటర్ నెట్ ఇవ్వాలన్న గౌరవ ముఖ్యమంత్రి ఆలోచనకు అనుగుణంగా ఫైబర్ నెట్ ద్వారా చర్యలు తీసుకుంటున్నామని  గౌతమ్ రెడ్డి వెల్లడించారు.  ఫైబర్ నెట్ కనెక్షన్ లు కోటి కి చేరుకోవటానికి ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు.  ప్రతి గ్రామం చివరి ఇంటి వరకు ఇంటర్ నెట్ ఇవ్వాలన్న లక్ష్యాన్ని త్వరలోనే చేరుకుంటామన్నారు. ఇంటర్ నెట్ బాక్స్ ఉచితంగా అందించడమేగాక కేవలం రూ. 190కే నెలరోజుల ప్లాన్ అందిస్తున్నామన్నారు. వినియోదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ప్రముఖ డైరక్టర్ రామ్ గోపాల్ వర్మ సినిమాలను ఫస్ట్ డే ఫస్ట్ షో గా ఫైబర్ నెట్ లో విడుదల చేసేందుకు ఇప్పటికే ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అనివార్యకారణాల వల్ల ఆర్జీవీ నూతన సినిమా ప్రదర్శన ఆలస్యమైందని వివరించారు. ఫైబర్ నెట్ యాప్ ను కూడా అతిత్వరలో అందుబాటులోకి తీసుకురానున్నామని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పూనూరు గౌతమ్ రెడ్డి తెలిపారు. 

                    ‘ఓటు’ తన మొదటి సినిమా అని హీరో శౌర్య తెలిపారు. ఓటు ప్రాధాన్యతను వివరించే మంచి సందేశాత్మక సినిమా అని పేర్కొన్నారు. ఈ సినిమా ఎవ్వరికీ వ్యవతిరేకం కాదన్నారు. ఓటును ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్న సందేశాన్ని ఈ సినిమాలో వివరించామన్నారు. 

అనంతరం ‘ఓటు‘ సినిమా పోస్టర్ ను మూవీ టీంతో కలిసి గౌతమ్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో సినిమా నిర్మాత రామకృష్ణ, ఓటు చిత్ర బృందం, తదితరులు పాల్గొన్నారు. 


Comments