ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవటం వల్లే రైతులకు తీవ్ర నష్టం.



ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవటం వల్లే రైతులకు తీవ్ర నష్టం





పంట కాలువల్లో పూడికలు తీయలేదు, రైతులకు గోనె సంచులు ఇవ్వలేదు 


నేను పర్యటనకు వస్తున్నానని తెలిసి నేడు జగన్ బయటకొచ్చాడు 


జగన్ అహంకారానికి మరో 3 నెలల్లో మూల్యం తప్పదు 


ఉమ్మడి గుంటూరు జిల్లాలో  తుఫాన్ ప్రభావిత ప్రాంతాల్లో చంద్రబాబు పర్యటన  


ఉమ్మడి గుంటూరు జిల్లా (ప్రజా అమరావతి):- ప్రకృతి విపత్తుకు మానవ తప్పిదం తోడవటం వల్లే  రైతులు తీవ్రంగా నష్టపోయారని టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు అన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా రేవేంద్రపాడు, నందివెలుగు గ్రామాల్లో మిచౌంగ్ తుఫాన్ తో దెబ్బతిన్న పంటలను టీడీపీ నేతలతో కలిసి చంద్రబాబు పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి కష్టాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.....తుఫాన్ తో రైతులు తీవ్రంగా నష్టపోయారు, కౌలు రైతుల్ని చూస్తుంటే మనసు తరుక్కుపోతోంది.  చేతికి పంట వచ్చే సమయంలో నీళ్ల పాలైంది, ఈ ఏడాది కరువు వల్ల  సగం మంది రైతులు పంటలు సాగు చేయలేదు.  వేసిన వారు కష్టపడి పంట నిలబెట్టుకుంటే ఇప్పుడు ఈ తుఫాన్  మింగేసింది. 

వేసిన పంట నీళ్ల పాలైంది, నష్టపోయిన వారిలో ఎక్కవు మంది కౌలు రైతులే. ఎకరాకు రూ. 20 వేలు కౌలు, పెట్టుబడికి మరో రూ. 20 నుంచి రూ. 40 వేలు ఖర్చు చేశారు. మరో 15 రోజులుంటే పంట చేతికొచ్చేది కానీ తుఫాన్ తో పంట అంతా నీటి పాలైంది. ప్రకృతి విపత్తులు సాధారణంగా వస్తాయి, కానీ ఇందులో మానవ తప్పిదం కూడా కూడా ఉంది. తుఫాన్ వస్తుందని ముందస్తు సమాచారం ఉన్నా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టలేదు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వలేదు.  డ్రెయినేజీ వ్యవస్ధకు నాలుగున్నరేళ్లలో ఒక్క రూపాయి ఖర్చు చేయలేదు, మురికి కాలువలు గాలికొదిలేశారు. ఈ నీరంతా పొలాల్లోకి వెళ్లి మునిగిపోయాయి. పంటలు మునిగి రైతులు అల్లాడుతుంటే ఇంతవరకు ప్రభుత్వ యంత్రాంగం రాలేదు. పసల్ భీమా మీలో ఒక్కరికైనా వచ్చిందా?  ఖరీఫ్ కి జూలై 15 కి పసల్ భీమా ఫైనలైజ్ చేయాలి. పోర్టల్ లో చూస్తే కేవలం 16 మంది రైతులకే పసల్ భీమా ఉంది. ఇలాంటి సమయంలో ముఖ్యమంత్రి ప్రతిపక్షాల కంటే ముందే రైతుల వద్దకు వచ్చి సమస్యలు తెలుసుకోవాలి. కానీ నేను ఇవాళ పర్యటనకు వస్తున్నానని తెలిసి ఆయన నేడు చుట్టపు చూపుకోసం పర్యటనకు వెళ్లారు. తుఫాన్ బాపట్ల తీరంలో క్రాస్ అయితే జగన్ మాత్రం తిరుపతిలో తిరుగుతున్నాడు. 2014లో  ఇన్ పుట్ సబ్సీడీ ఎకరాకు రూ. 10 వేలుంటే మేము రూ. 20 పెంచాము. ఐదేళ్లలో రైతులకు జగన్ రెడ్డి ఏం చేశారు? రైతులకు ఇన్ పుట్ సబ్సిడీ ఇచ్చారా? 

45 ఏళ్ల నుంచి ఏ తప్పు చేయలేదు, అలాంటి నన్ను అక్రమ కేసు పెట్టి జైల్లో పెట్టి వేధించారు. చేయని తప్పుకు ఎంతో క్షోభ అనుభవించాను. అధికారం ఉంది కదా విర్రవీగొద్దు, 3 నెలల తర్వాత మీ పరిస్ధితి ఏంటో ఆలోచించండి. అహంకారంతో విర్రవీగిన తెలంగాణలో పరిస్ధితి ఏమైందో చూడండి. రేపు మీ పరిస్థితి  అంతే. ప్రభుత్వ వైఫల్యాల్ని ప్రశ్నించిన నాయకులు, ప్రజలపై అక్రమ కేసులు పెట్టి జైలులో వేస్తున్నారు. 

ఎక్కువ అప్పులున్న రైతులున్న రాష్ట్రాల్లో ఏపీ నెం. 1 స్ధానంలో, కౌలు రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే 2 స్దానంలో ఉంది. రైతులు ఎలా బ్రతకాలి, ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరవాలి. నష్టపోయినవారందకీ న్యాయం చేయాలి. మీకు జరిగిన అన్యాయంపై పోరాడుదాం, మీకు నేను అండగా ఉంటా...అందరం కలిసి పోరాడుదాం. ప్రభుత్వం స్పందించకపోతే మీకు పరిహారం ఇప్పించే బాధ్యత 3 నెలల తర్వాత మేమే తీసుకుంటామని చంద్రబాబు నాయుడు హామీ ఇచ్చారు. 

అంతకు ముందు  రేవేంద్రపాడులో  దెబ్బతిన్న పంటలను చంద్రబాబు పరిశీలించారు.  తుఫాన్ తో తీవ్రంగా నష్టపోయామంటూ ఉరి తాడులు వేసుకుని చంద్రబాబు ఎదుట రైతులు వాపోయారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ...చేతికొచ్చిన పంట మునిగిపోయి అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట ప్రభుత్వ వైఫల్యం వల్లే నీటి పాలైంది, తుఫాన్ వస్తుందని తెలిసినా ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపట్టడంలో విఫలమైంది. తుఫాన్ తర్వాత బాధితులను ఆదుకోవటంలోనూ  విఫలమైంది. తుఫాన్ వచ్చి ఇన్ని రోజులైనా పంటనష్టం అంచనా వేయలేదంటే ఈ ప్రభుత్వాన్ని ఏమనాలి? రైతులంటే ముఖ్యమంత్రికి లెక్కలేదు పంటనష్టపోయిన ప్రతి రైతును ఆదుకునేవరకు ప్రభుత్వాన్ని వదలిపెట్టమని చంద్రబాబు నాయుడు అన్నారు.

Comments