ఎన్నికల్లో జగన్ కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోంది.



*ఎన్నికల్లో జగన్ కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోంది.*



*షెడ్యూల్ రాకతో ఉన్మాదుల నుండి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ప్రజలు*


*అధికారంలోకి రాగానే జూనియర్ న్యాయవాదులకు రూ.7 వేల గౌరవవేతనం*


*రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు.*


*ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం*


*- లీగస్ సెల్ సమ్మిట్ లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


అమరావతి (ప్రజా అమరావతి):- ఎన్నికల్లో జగన్ కు దిమ్మతిరిగే ఫలితం రాబోతోందని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఉన్మాదుల నుండి స్వాతంత్ర్యం వచ్చినంత ఆనందంగా ప్రజలు పండుగ చేసుకుంటున్నారని అన్నారు. ప్రజలు ఆనందంగా రోడ్లపైకి వస్తున్నారన్నారు. ఉమ్మడి ప్రభుత్వం రాగానే....న్యాయమిత్ర పేరుతో నెలకు రూ.7 వేలు జూనియర్ న్యాయవాదులకు గౌరవ వేతనం ఇస్తామని హామీ ఇచ్చారు. లా నేస్తం పేరుతో జగన్ కేవలం 2,670 మందికే గౌరవ వేతనం ఇచ్చారని...తమ ప్రభుత్వం వచ్చాక 3,500 మందిదాకా పెంచుతామని భరోసా ఇచ్చారు. లాయర్లకు కార్పస్ ఫండ్ కింద రూ.100 కోట్లు కేటాయిస్తామన్నారు. విజయవాడ లబ్బీపేటలొని ఎస్.ఎస్.కన్వెన్షన్ హాలులో టీడీపీ లీగస్ సెల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సార్వత్రిక ఎన్నికల సమ్మిట్ లో చంద్రబాబు నాయుడు శనివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ....‘‘రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులతో లీగల్ సెల్ వర్క్ షాప్ లు పెట్టుకోవాల్సి వస్తోంది. నా నామినేషన్ ను కార్యకర్తలు, న్యాయవాదులే వేసేవారు..కేవలం డిక్లరేషన్ పత్రంపైనే నేను సంతకం చేసేవాడిని. కానీ నేడు నాపై ఎన్నికేసులు ఎన్నాయో ముందుగానే డీజీపీని, అధికారులను లేఖల ద్వారా అడిగే పరిస్థితి. అడగకపోతే ఎప్పుడు దొంగ కేసులు పెట్టారో తెలియదు. నామినేషన్ వేయాలనుకునే ప్రతి అభ్యర్థి తనపై ఎన్ని కేసులు ఎన్నాయో చెప్పండి అని అడుక్కునే పరిస్థితి. రాజ్యాంగంలో శాసన, కార్యనిర్వహక, మీడియా ప్రధానమైనవి...ఇవి గాడి తప్పితే మళ్లీ గాడిలో పెట్టేది న్యాయ వ్యవస్థే. న్యాయ వ్యవస్థ లేకుండా మనం ఇక్కడ ఉండేవాళ్లం కాదు. నాతో పాటు మా లాయర్లు కూడా నిద్రలేని రాత్రులు గడిపారు. ప్రతి శుక్రవారం రాష్ట్రంలో ప్రొక్లెయిన్లు వస్తాయి..ఇల్లీగల్ కస్టడీకి కూడా తీసుకున్నారు.

*కేంద్రం, రాష్ట్రంలో ఏర్పడేది ఎన్డీయే ప్రభుత్వాలే*

నా జీవితంలో లాయర్లపై దాడులు జరగలేదు..కానీ ఇప్పుడు చూశాను. వారే కోర్టుకు వెళ్లి దాడులు జరుగుతున్నాయని చెప్పుకునే పరిస్థితి. నామినేషన్లు వేయడానికి కూడా వీల్లేని పరిస్థితిని స్థానిక సంస్థల ఎన్నికల నుండి చూస్తున్నాం. బెదిరింపులు, భయపెట్టడాలు, నామినేషన్ వేయడానికి అవసరమైన సర్టిఫికేట్లు కూడా ఇవ్వనీయరు. అన్నీ దాటుకుని నామినేషన్ వేస్తే స్క్రూటినీలో తొలగిస్తారు. దాన్ని దాటుకుని వెళ్తే ఫలితాలు వారికి అనుకూలంగా వేసుకుని గెలిచిన వాళ్లను ఓడగొడతారు. ఎన్నికల కమిషర్ కు కూడా దిక్కులేదు...రక్షణ కోసం కేంద్ర సాయాన్ని కోరే పరిస్థితి ఏర్పడింది. తిరుపతి ఉప ఎన్నికల్లో దొంగ ఓట్లు ఇష్టానుసారంగా వేసుకున్నారు. దీంతో మనమంతా ఎలాంటి పాలనలో ఉన్నామో తెలుస్తోంది. వీటికి అంతం పలకపోతే అభివృద్ధి ఉండదు. ప్రజల గెలవాలి...రాష్ట్ర నిలవాలి అన్న నినాదంతో టీడీపీ, జనసేన, బీజేపీ ముందకు వెళ్తున్నాయి. ఆదివారం ప్రధానితో ప్రజాగళం సభను చిలకలూరిపేటలో నిర్వహిస్తున్నాం. కేంద్రం, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలు రాబోతున్నయి. ఈ రోజు వరకు ఒక ఎత్తు...ఇప్పటి నుండి ఒక ఎత్తు. రోడ్ల పైకి వచ్చిన వాళ్లకు పథకాలు కట్ చేయడం కాదు...ప్రజలే జగన్ కు ఇక పవర్ కట్ చేస్తారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ, జనసేన కలిసి వెళ్తున్నాయి. నూటికి వెయ్యి శాతం ఎన్డీయే గెలవబోతోంది. కేంద్రంలో 400 లోక్ సభ సీట్లు చిలుకుతో కేంద్రంలో ఎన్డీయే, రాష్ట్రంలో ఎప్పుడూ లేని మెజారిటీతో గెలువబోన్నాం. కోల్పోయిన దాన్ని భర్తీ చేసుకునే రోజులు త్వరలో రాబోతున్నాయి. దేశం 2047 విజన్ తో దూసుకుపోతుంటే....రాష్ట్రాన్ని ఈ దుర్మార్గుడు రాతియుగం వైపు తీసుకెళ్తున్నాడు. రాష్ట్రాన్ని కాపాడటం మా మూడు పార్టీల బాధ్యతే కాదు...ప్రతి ఒక్కరి బాధ్యత. స్వాతంత్ర్యం కోసం పోరాడిన విధంగా...ఉన్మాది పాలన నుండి రాష్ట్రాన్ని కాపాడటానికి మేధావులంతా కలిసి రావాలి. ఐదేళ్లు ఒక ఎత్తు...రాబోయే 57 రోజులు ఎక ఎత్తు. రాజకీయాలు, మతం, ప్రాంతం కాదు...పిల్లల భవిష్యత్ బాగుండాలంటే దుర్మార్గ పాలనను అంతం చేయాలి. లాయర్లకు కూడా ఈ ప్రభుత్వం ఏమీ చేయలేదు. లాయర్లకు కూడా స్వయర్ణయుగం చూపించే పాలన తీసుకొస్తాం. మెడికల్ క్లెయిమ్, బీమాకు ప్రీమియం కట్టాలి...రూ.5 లక్షల దాకా మెడికల్ క్లెయిమ్, రూ.15 లక్షల ప్రమాద బీమాకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించే బాధ్యత తీసుకుంటాం. న్యాయం కోసం పోరాడే మీకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు కూడా ప్రయత్నిస్తాం. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎందుకు తెచ్చారో నాకు అర్థం కావడం లేదు. దుర్మార్గుడి చేతుల్లో టెక్నాలజీ ఉంటే ఏ విధంగా ఇబ్బందులు ఉంటాయో ఈ పాలన ఒక ఉదాహరణ. అధికారంలోకి వచ్చాక ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేస్తాం. ఏపీపీఎస్సీలో ఏ విధంగా అక్రమాలకు పాల్పడ్డారో చూశాం. చేయని తప్పునకు మా వాళ్లను స్టేషన్ లో పెట్టిన నాడు నిద్ర పట్టేది కాదు. ఎంపీ రఘురామకృష్ణరాజును టార్చర్ పెట్టారు..మనం కాపాడకపోతే చంపేసేవారు. రాష్ట్రంలో మే 13న పోలింగ్ జరుగుతుంది. రాబోయే 57 రోజుల తర్వాత చరిత్ర తిరిగరాయబోతున్నాం. ఎన్నికల కోడ్ వచ్చింది...కాలర్ ఎగరేసుకుని ఇక బటయకు రండి. రాష్ట్రంలో ఇక ప్రకంపనలే కనబడతాయి. రాష్ట్రాన్ని కాపాడటానికి అడ్వకేట్ లు కూడా బాధ్యత తీసుకోవాలి.’ అని చంద్రబాబు అన్నారు.

Comments