ప్రజలు మార్పు కోరుకొంటున్నారు.

 ప్రజలు మార్పు కోరుకొంటున్నారు




 తెనాలి (ప్రజా అమరావతి);

జగన్మోహనరెడ్డిపాలనతో రాప్ట్ర ప్రజలు విసుగెత్తి పాలనలో మార్పు కోరుకొంటూన్నారని గుంటూరు పార్లమెంటు TDP అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ అన్నారు గురువారం ఉదయం తెనాలి కొత్తపేటలో TDP ఎన్నకల కార్యాలయం ప్రారంభిన అనంతరం ఆయన మాట్లాడుతూ యువత ఉపాథి కోసం అడిగితే గంజాయి ఇస్తున్నారని ,రాష్ట్రప్రకృతి వనరులను  ఇసుక, గ్రానైటు ,బాక్సైట్ , గ్రావెల్ ను ఇష్టారీతిన తవ్వేసి రాష్ట్ర అభివృథ్థిని 40-50ఏళ్ళు వెనక్కి మళ్ళించి నారని , తాము అథికారం చేపట్టిన వెంటనే  రాష్ట్రంలోఉపాథి అవకాశాలు   మెరుగుపరచి రాష్ట్రాన్ని  అన్ని విథాల ముందుకు తీసికెళ్తామన్నారు,బాబు ముందుచూపుతో చేపట్టిన "పట్టిసీమ"తొ రైతుల కష్టాలుకొంతమేర వెసులుబాటు చేకూరుతుందన్నారు.


MLA అభ్యర్థి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ విద్యావంతుడు  మాతృదేశవృథ్థి కోసం తపించే యువకుడు MPగా దొరకటం మనందరి అదృష్టమని తాము  తెనాలికి రైల్వే ,ఇతర మౌళిక సదుపాయాలకల్పన  విషయంలో కేంద్రంతో మాట్లాడి అన్ని విథాల పట్టణాన్ని అభివృథ్థిపథంలో నడుపాతామన్నారు,



Comments