అధికారంలోకి వచ్చిన యేడాదిలో కుప్పంకు హంద్రీనీవా నీళ్లు.



*అధికారంలోకి వచ్చిన యేడాదిలో కుప్పంకు హంద్రీనీవా నీళ్లు*



*జగన్ లాంటి సెట్టింగుల సీఎం వస్తాడని సినిమా డైరెక్టర్లు కూడా ఊహించలేదు*


*ట్యాంకర్ లో నీళ్లు తెచ్చి కాలువలో పోసి...బటన్ నొక్కి జగన్ వెళ్లిపోయాడు*


*జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే*


*వైసీపీ డ్రామా కంపెనీ...త్వరలో మూతబడుతుంది*


*హెలికాప్టర్ లో వస్తే చెట్లన్నీ నరికేశాడు...రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.?*


*అధికారంలోకి వచ్చాక రెస్కోను కొనసాగిస్తాం*


*-టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


*కుప్పంలోని రాజుపేట వద్ద  హంద్రీనీవా బ్రాంచ్ కెనాల్ పరిశీలించిన చంద్రబాబు*


కుప్పం (ప్రజా అమరావతి):- ట్యాంకర్ లో నీళ్లు తెచ్చి పోసి సినిమా సెట్టింగ్ లాగా గేటు పెట్టి జగన్ బటన్ నొక్కి వెళ్లిపోయారు. బటన్ నొక్కినా నీళ్లు నీళ్లు రాలేదు. 

తెచ్చిపోసిన నీళ్లు తెల్లారేసరికి ఇంకిపోయాయి. అద్దెకు తెచ్చిన గేట్లను సాయంత్రానికే అధికారులు వచ్చి ఎత్తుకెళ్లారు. ఇలాంటి సెట్టింగుల సీఎం వస్తాడని డైరెక్టర్లు, నిర్మాతలు కూడా అనుకోలేదు. 

కుప్పం భూమిపై నడిస్తే అరిగిపోతాడని రెండు హెలిప్యాడ్ లు ఏర్పాటు చేసి తిరిగాడు. ఆర్టీసీ బస్సులు, స్కూల్ బస్సులున్నీ పెట్టి జనాన్ని తరలించారు. ఇలాంటి ఘనకార్యాలు చేసిన నువ్వు...నన్ను ఓడిస్తావా.?. 

ప్రజలు ఛీ కొడతారన్న ఇంగితజ్ణానం కూడా లేకుండా నీళ్ల తెచ్చానంటూ డ్రామాలాడారు. ఐదేళ్లుగా నడిపిన వైసీపీ డ్రామా కంపెనీని శాశ్వతంగా మూసేయబోతున్నారు. రోడ్డు మార్గం ద్వారా పర్యటనకు మళ్లీ కుప్పం వస్తానని చెప్తున్నాడు...ఏం మొహం పెట్టుకుని వస్తావు.? 

హెలికాప్టర్ లో వస్తే చెట్లు నరికించేశాడు...రోడ్ల మీద వస్తే ఇళ్లు పీకేస్తాడేమో.? నిర్లక్ష్యం ఉండవచ్చు కానీ...కక్ష కట్టి నిర్లక్ష్యం వహించడం సమంజసం కాదు. 

నీకు కొన్ని ఓట్లు వేసిన పాపానికి ఇలా చేయడం దుర్మార్గం. జరగని అరాచకం రాష్ట్రంలో ఏమన్నా ఉందా? 

ఉత్తుత్తి బటన్ నొక్కి నీళ్లు వదిలారు...కనీసం మట్టి పెళ్లలు కూడా తడవలేదు.  

రాష్ట్రంలో రికార్డులు తారుమారు చేస్తున్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు, సర్టిఫికేట్లపై జగన్ ఫోటో పెట్టుకున్నారు. 

ప్రజాకోర్టులో జగన్ ను శిక్షించాలి. ప్రజల సొమ్మును దుర్వినియోగం చేస్తున్నారు. వలంటీర్లు సేకరించిన ప్రజల వ్యక్తిగత సమాచారం వలంటీర్లు, ఐప్యాక్ వద్ద ఉంది..వలంటీర్ల వద్ద ఉన్న ఫోనులు కూడా వెనక్కి తీసుకోవాలి. 

కుప్పంలో మెడికల్ కాలేజీతో పాటు అన్నీ అభివృద్ధి చేశా...పులివెందులను కూడా అభివృద్ధి చేశాను. గతంలోనూ రాజశేఖర్ రెడ్డి ఉన్నప్పుడు కుప్పంలో ఇజ్రాయేల్ టెక్నాలజీ నిలిపిపేశారు. ఇప్పుడు జగన్ వచ్చాక మొత్తం నాశనం చేశాడు. సంపదను కొల్లగొట్టారు. 

కుప్పంలో నీతి, నిజాయితీ ఉంది. నేను ఏ ఎన్నికలకు రాకుండా వాళ్లే నామినేషన్ వేయించి గెలిపించారు. గుండిశెట్టిపల్లెలో బసవేశ్వరస్వామి మాన్యం భూమిని కొట్టేయాలని చూస్తున్నారు. 

జె.బ్రాండ్స్ వచ్చాయని చెప్పినప్పుడు కాదని నిరూపించకుండా మాపై దాడులకు దిగారు. గంజాయి వచ్చిందని చెప్తే మా కార్యాలయంపై దాడి చేశారు. డ్రగ్స్ పై కనీసం స్పందించలేదు. 

నేర సామ్రాజ్యానికి విజయసాయిరెడ్డి వరల్డ్ ఫిగర్. తప్పులు చేసి ఎదుటివారిని నిందిస్తున్నారు. ప్రజలు తిరగబాటు చేయనంత వరకూ వీళ్లు అరాచకాలు చేస్తూనే ఉంటారు. 

రాష్ట్ర బ్రాండ్ ను దెబ్బతీశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే హంద్రీనీవా పూర్తి చేసి యేడాదిలో నీళ్లు కుప్పంకు ఇస్తాం. 

జగన్ కు ఓటేస్తే ఎవరి కుటుంబానికి వారు అన్యాయం చేసినట్లే. జగన్ ఇచ్చిన జీవోలు, నొక్కిన బటన్లు అన్నీ డమ్మీలే. ఇంత విధ్వంసాన్ని నా జీవితంలో చూడలేదు..అన్నీ సరిచేస్తాం. రెస్కోను కొనసాగిస్తాం. 


Comments