యువతను మెలుకొలిపేందుకు ఎన్ఆర్ఐ టిడిపి విభాగం ఆధ్వర్యంలో ‘ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్.

 మంగళగిరి (ప్రజా అమరావతి);





*యువతను మెలుకొలిపేందుకు ఎన్ఆర్ఐ టిడిపి విభాగం ఆధ్వర్యంలో ‘ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్


’*


*ఎన్నికల ప్రచార వాహనాలను ప్రారంభించిన ఎన్ఆర్ఐ టిడిపి విభాగం అధ్యక్షులు వేమూరి రవి*


రాష్ట్రంలోని యువ ఓటర్లలో చైతన్యం తీసుకొచ్చేందుకు తెలుగుదేశం పార్టీ ఎన్ఆర్ఐ విభాగం సరికొత్త విధానంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. శుక్రువారం మంగళగిరి తెలుగుదేశం జాతీయ కార్యాలయం నుంచి ‘‘ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్’’ పేరుతో 25 ఎన్నికల ప్రచార వాహనాలను ఎన్ఆరఐ టిడిపి విభాగం అధ్యక్షులు వేమూరు రవి జెండా ఊపి ప్రారంభించారు. మొత్తం 4 రీజియన్‌లలో 25 పార్లమెంట్లు వారిగా 175 నియోజకవర్గాలలో ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్ నిర్వహించనున్నారు. రాష్ట్రంలోని నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు వాగ్దానంతో యువతను మేలుకొలుపనున్నారు. నియోజకవర్గ ఎన్ఆర్ఐ విభాగం టీమ్, ఎమ్మెల్యే అభ్యర్ధులతో సమన్వయం చేసుకొని నియోజకవర్గంలో ఒక రోజు టిడిపి ఎన్ఆర్ఐ సభ్యులు క్యాంపెయిన్ చేయునున్నారు. ఐదేళ్ల చీకటి పాలనలో రాష్ట్రం ఎంత వెనుకబడిపోయిందో, రాష్ట్ర ప్రజలు ఏమి కోల్పోయారో, యువత జీవితాలు భుగ్గిపాలు అవ్వడానికి కారణమెవరో ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్ ద్వారా ప్రజలకు వివరించనున్నారు. ప్రస్తుతం రాష్ట్రం ఉన్న పరిస్థితుల్లో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తిరిగి అధికారంలోకి రావడం అవసరమో ప్రజల్లో అవగాహన తీసుకురానున్నారు. దారి తప్పిన రాష్ట్రాన్ని తిరిగి గాడిలో పెట్టాలంటే చంద్రబాబుతోనే సాధ్యమని వివరించనున్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుద్యోగులను వారి వారి అర్హతలను బట్టి సంబంధింత కోర్సులకు కోచింగ్ ఇచ్చి దేశ-విదేశాల్లో 1 లక్ష ఉద్యోగాలు కల్పిస్తామని యువతకు హామీ ఇవ్వనున్నారు. పాడుబడిపోయిన మన రాష్ట్రాన్ని బాగు చేసుకునేందుకు ఓటు అనే ఆయుధాన్ని ప్రతీ ఒక్కరూ ఉపయోగించుకునేలా చైతన్యం నింపేందుకు ఎన్ రైజ్ ఏపి క్యాంపెయిన్ యొక్క ముఖ్య ఉద్దేశం.


ఈ కార్యక్రమంలో రాధా కృష్ణ(ఎన్ఆర్ఐ టిడిపి ప్రెసిడెంట్, గల్ఫ్), టిడిపి రాష్ట్ర కార్య నిర్వాహణ కార్యదర్శి బుచ్చి రాంప్రసాద్, కానూరి శేషు బాబు (USA), కోడూరి వెంకట్ (Kuwait), మగులూరి భాను ప్రకాష్ (USA), కొల్ల అశోక్ (USA), వెంకట రామ కిషోర్ (Australia), నన్నపనేని మురళీధర్ (USA), ఓలేటి దివాకర్ (Kuwait), తుమ్మల శ్రీనివాస్ (USA), మొక్కపాటి శివ (USA), వెంకట రామ ప్రసాద్ (Australia), వెంకట చైతన్య (USA), సాదినేని శ్రీధర్ (USA), నరసింహ గుప్త (UK) తదితరులు పాల్గొన్నారు.

Comments