ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర హింసకు వ్యతిరేకంగా కఠిన వైఖరిని తీసుకున్న కమిషన్
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని CS & DGPకి ఆదేశం
కౌంటింగ్ తర్వాత 25 CAPF కంపెనీలను ఆంధ్రప్రదేశ్లో ఉంచుకోవాలని MHAని ఆదేశించిన ఈసీ.
న్యూఢిల్లీ (ప్రజా అమరావతి);
ఈ రోజు నిర్వచన్ సదన్లో ఆంధ్రప్రదేశ్లోని ప్రధాన కార్యదర్శి మరియు డీజీపీతో జరిగిన సమావేశంలో, సిఇసి శ్రీ రాజీవ్ కుమార్ మరియు ఈసీలు శ్రీ జ్ఞానేష్ కుమార్ మరియు శ్రీ సుఖ్బీర్ సింగ్ సంధు నేతృత్వంలోని కమిషన్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల అనంతర జరిగిన హింసపై తన అసంతృప్తిని తెలియజేసింది. ఇలాంటి హింస పునరావృతం కాకుండా చూడాలని సీఎస్, డీజీపీలకు కమీషన్ ఆదేశాలు జారీ చేసింది. భవిష్యత్తులో అలాంటి పరిస్థితి తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఎస్పీలందరినీ ఆదేశించింది.
కమిషన్ వారి స్థాయిలో కేసులను సమీక్షించింది మరియు చట్ట ప్రకారం, మోడల్ కోడ్ నియమావళి వ్యవధిలో, దోషులపై ఛార్జిషీట్ను సకాలంలో దాఖలు చేయడంపై తగిన నిర్ణయం తీసుకునేలా కఠినమైన పర్యవేక్షణ ఉండాలని CS మరియు DGPలను ఆదేశించింది.
బ్రీఫింగ్ సందర్భంగా, హింసాత్మక జిల్లాల్లో అధికారుల నిర్లక్ష్యం మరియు పర్యవేక్షణ లోపం పై సీఎస్ మరియు డీజీపీలు తమ అంచనాలను పంచుకున్నారు. ఈ క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ఈ క్రింది ప్రతిపాదనలను కమిషన్ ఆమోదించింది:
పల్నాడు జిల్లా కలెక్టర్ బదిలీ మరియు శాఖాపరమైన విచారణ ప్రారంభించాలి.
అనంతపురం జిల్లాల ఎస్పీ, పల్నాడు, ఎస్పీల సస్పెన్షన్, శాఖాపరమైన విచారణ.
తిరుపతి ఎస్పీని బదిలీ చేసి శాఖాపరమైన విచారణకు శ్రీకారం చుట్టారు.
ఈ మూడు జిల్లాల్లో (పల్నాడు, అనంతపురము మరియు తిరుపతి) 12 మంది కింది స్థాయి పోలీసు అధికారుల సస్పెన్షన్ మరియు శాఖాపరమైన విచారణ ప్రారంభించడం.
ప్రత్యేక దర్యాప్తు బృందం ఈ వ్యవహారం పై విచారణ జరిపి ఒక్కో కేసుకు సంబంధించి రెండు రోజుల్లో తీసుకున్న చర్యల నివేదికను కమిషన్కు సమర్పించనుంది. అదనపు సముచిత IPC సెక్షన్లు మరియు ఇతర సంబంధిత చట్టబద్ధమైన నిబంధనలతో FIRలు నవీకరించడం జరుగుతుంది.
ఫలితాల ప్రకటన తర్వాత తలెత్తే హింసను నియంత్రించడానికి కౌంటింగ్ తర్వాత 25 CAPF కంపెనీలను 15 రోజుల పాటు కొనసాగించాలని రాష్ట్రం అభ్యర్థించింది.
ఫలితాల ప్రకటన తర్వాత తలెత్తే ఎలాంటి హింసాకాండను అయినా నియంత్రించేందుకు, కౌంటింగ్ తర్వాత 15 రోజుల పాటు ఆంధ్రప్రదేశ్లోని 25 CAPF కంపెనీలను అలాగే ఉంచాలని హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖను ఆదేశించాలని కమిషన్ నిర్ణయించింది.
ఎన్నికల అనంతరం హింసను అరికట్టడంలో పరిపాలన వైఫల్యానికి గల కారణాలను వ్యక్తిగతంగా వివరించేందుకు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ మరియు డీజీపీని ECI న్యూఢిల్లీకి పిలిపించిన విషయం అందరికీ గుర్తుండే ఉంటుంది. అనంతపురం, పల్నాడు, తిరుపతి జిల్లాల్లో ఎన్నికల రోజున, అనంతర కాలంలో అనేక హింసాకాండలు చోటు చేసుకున్నాయి. ఎన్నికల ముందు దాడి, ఎదుటి పక్షాల ఆస్తులు/కార్యాలయానికి నిప్పు పెట్టడం, బెదిరింపులు, ప్రచార వాహనాలను ధ్వంసం చేయడం, రాళ్లదాడి మొదలైన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఈ ఘటనల్లో చాలా వరకు అన్నమయ, చిత్తూరు, పల్నాడు జిల్లాల్లో నమోదు కాగా; మరికొన్ని ఘటనలు గుంటూరు, అనంతపురం, నంద్యాలలో జిల్లాల్లో జరిగాయి.
addComments
Post a Comment