భూ కబ్జాలు, దోపిడీలతో పాటు పలు సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు.




*భూ కబ్జాలు, దోపిడీలతో పాటు పలు సమస్యలపై టీడీపీ కేంద్ర కార్యాలయానికి పోటెత్తిన అర్జీదారులు


*

*వినతులు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన నేతలు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే బడేటి చంటి*

 అమరావతి (ప్రజా అమరావతి),

విజయనగరం జిల్లా భోగాపురం మండలం తూడెం గ్రామానికి చెందిన డెక్కలి చిట్టితల్లి విజ్ఞప్తి చేస్తూ.. అన్నవరం పంచాయతీలో ఉన్న తమ భూమిని 40 సంవత్సరాలకు పైగా సాగు చేసుకుంటున్నామని.. అయితే గత ప్రభుత్వంలో వైసీపీకి చెందిన వారు అక్రమంగా తప్పుడు పత్రాలతో తమ భూమిని కొట్టెయాలని చూశారని.. దీనిపై ప్రశ్నిస్తే తమపై రౌడీలతో దాడులకు వస్తున్నారని వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నేడు టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో నేతలు మంత్రి వాసంశెట్టి సుభాష్, ఎమ్మెల్సీ అశోక్ బాబు, ఎమ్మెల్యే బడేటి చంటిలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. 

 


పల్నాడు జిల్లా నరసరావుపేట పట్టణం నందు రజకులకు కేటాయించిన స్థలంలో మాజీ సభాపతి  కోడెల శిప్రసాదరావు సహకారంతో కళ్యాణ మండపాన్ని నిర్మించుకోవడం జరిగిందని.. ఆ కళ్యాణమండపానికి అవసరమైన ఫర్నీచర్ తాము సమకూర్చుకున్నాక.. రజకులందరూ ఐక్యంగా ఉండాలని అమరావతి రజక ఐక్యవేదికను ఏర్పాటు చేసుకోవడం జరిగిందని.. అయితే అందులో అందరూ టీడీపీకి సానుకూలంగా ఉండటంతో వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కళ్యాణ మండపం తళాలు పగలకొట్టి  రాత్రికి రాత్రే కళ్యాణమండపంలోని ఫర్నీచర్ ను దొంగిలించుకుపోయారని  అందులో చెరుకూరి వెంకటగిరి, మర్రిపూడి రాంబాబు, దావులూరి శ్రీనివాసరావు, కురిచేటి కోటేశ్వరరావు, ఇంకొల్లు మల్లిఖార్జునలు ఉన్నారని వారిపై చర్యలు తీసుకొని పోయిన ఫర్నీచర్ తీరిగి ఏర్పాటు చేసేలా చూడాలని అమరావతి రజక ఐక్యవేదిక నాయకులు నేతలకు విజ్ఞప్తి చేశారు. 

గుంటూరు జిల్లా తాడికొండ మండలం  రావెల గ్రామానికి చెందిన షేక్ మౌలాలి విజ్ఞప్తి చేస్తూ.. తన మనవరాలైన అమిరున్ ను సత్తెనపల్లికి చెందిన సయ్యద్ సుభాని కుమారుడు సయ్యద్ రఫికి ఇచ్చి వివాహం చేయగా.. ఆరునెలల గడవకుండానే అదనపు కట్నం కోసం తన మనవరాల్ని హతమార్చారని నింధితులపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని నేడు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.

గుంటూరు జిల్లా గూంటూరులోని రెడ్డిపాలెంకు చెందిన చింతమనేని శ్రీనివాసరావు విజ్ఞప్తి చేస్తూ.. తనకు అమ్మిన స్థలాన్ని మళ్లీ మరోకరికి అమ్మిన వ్యక్తులపై కేసు పెడితే పోలీసు అధికారులు పట్టించుకోవడంలేదని.. అక్రమార్కులను అరెస్ట్ చేసేలా చర్యలు తీసుకోవాలని గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేశాడు. 

కర్నూలు జిల్లా ఆదోని మండలం సంతెకుడ్లూరు గ్రామానికి చెందిన  ఈరన్న విజ్ఞప్తి చేస్తూ..  గత 50 సంవత్సరాల నుండి తాము సాగుచేసుకుంటున్న భూమిని తమ పేరు పై ఆన్ లైన్ చేయమంటే అధికారులు పట్టించుకోవడంలేదని.. దయ చేసి తాము సాగు చేసుకుంటున్న భూమి ఆన్ లైన్  అయ్యేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. 

భూమి ఆక్రమణపై కోర్టులో కేసు నడుస్తున్నా.. తమ భూమిని ఆక్రమణదారుడు చదును చేసుకుంటున్నాడని.. అతనిపై చర్యలు తీసుకొని తమ భూమి కబ్జాకు గురికాకుండా చూడాలని అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం శేక్షానపల్లి గ్రామానికి చెందిన కె. తేజోనాథ్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి  వేడుకున్నాడు. 

కేంద్ర ప్రభుత్వం పూసల కులాన్ని ఎస్టీ జాబితాలో చేర్చేందుకు సుముఖంగా ఉన్నందున ఏపీ ప్రభుత్వం పుసల కులంపై బీసీ (ఏ) నుండి ఎస్టీగా మర్చేలా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించాలని సంచార జాతుల సెల్ కన్వీనర్ అరబోలు చంద్రశేఖర్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు. 

అన్నమయ్య జిల్లా కలికిరి మండలం మర్రికుంటపల్లి గ్రామానికి చెందిన ఏ. శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తూ.. తాము ఎస్సీలమని తమ పూర్వికుల నుండి తాము సాగు చేసుకుంటున్న భూమిపై అగ్ర కూలాలకు చెందిన వ్యక్తుల కన్ను పడిందని.. తమ కుటుంబాన్ని చంపి భూమిని కొట్టేయాలని వారు యత్నిస్తున్నారని గ్రీవెన్స్ లో ఫిర్యాదు చేశాడు.

గత ప్రభుత్వానికి తొత్తులుగా ఉండి టీడీపీ కార్యకర్తలను తీవ్రంగా ఇబ్బంది పెట్టి అక్రమ కేసులు పెట్టిన సీఐలు బీమానాయక్, రామకోటలపై విచారణ జరిపించి చర్యలు తీసుకోవాలని ప్రకాశం జిల్లా దర్శికి చెందిన నాలి మధు గ్రీవెన్స్ లో నేతలకు అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశారు.

Comments