దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి.




 విజయవాడ (ప్రజా అమరావతి);


*దుర్గమ్మను దర్శించుకున్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి*



 నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కొత్త సంవత్సరం లో మొట్టమొదటి సారిగా దేవాదాయ శాఖ మంత్రి శ్రీ అనం రామనారాయణ రెడ్డి గారు ఈ రోజు విజయవాడలోని ప్రఖ్యాత శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవాలయాన్ని సందర్శించారు. దేవాలయ అధికారులు, సిబ్బంది ఆలయ మర్యాదలతో మంత్రి కి ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


ఈ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి మాట్లాడుతూ "రాష్ట్ర ప్రజలందరూ ఆనందం, ఆరోగ్యం, శ్రేయస్సుతో ఉల్లాసంగా జీవించాలని దుర్గమ్మను ప్రార్థిస్తున్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం దేవాలయాల ఆధునీకరణకు మరియు అభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తాం," అని తెలిపారు.

అనంతరం ఆలయ అధికారులతో సమావేశమై ఆలయ అభివృద్ధి పై చర్చించి, రోజు వారి జరిగే కార్యక్రమాలపై చర్చించారు. భక్తులకు మరింత సౌకర్యాలు అందించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా క్యూ లైన్ లో భక్తులు ఇబ్బంది పడకుండా తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.క్యూ లైన్ లో ఉన్న భక్తులతో సెక్యూరిటీ సిబ్బంది మర్యాద పూర్వకంగా సమాధానం ఇస్తూ సజావుగా దర్శనం అయ్యేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.ఈ కార్యక్రమంలో మంత్రి తో పాటు, దేవాదాయ శాఖ అధికారులు, ఆలయ సిబ్బంది  పాల్గొన్నారు.

Comments