ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పరిశీలించారు.



గుంటూరు, 27  మార్చి , 2025 (ప్రజా అమరావతి):  రాష్ట్ర ప్రధాన  ఎన్నికల  అధికారి  ఆదేశాల  మేరకు త్రైమాసిక తనిఖీలలో భాగంగా గురువారం ఉదయం  గుంటూరు కలక్టరేట్ ఆవరణలోని ఇవియంలు భద్రపరిచిన గోడౌన్ ను జిల్లా కలెక్టర్ ఎస్.నాగలక్ష్మీ పరిశీలించారు.


  సిసిటీవి పనితీరు, అగ్నిమాపక పరికరాలను పరిశీలించారు. ఇవియంల భద్రత విషయంలో రాజీపడకుండా అవసరమైన అన్ని భద్రతా  చర్యలు పకడ్బందీగా చేపట్టాలని  అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. 


  ఈ కార్యక్రమంలో డిఆర్ఓ షేక్.ఖాజావలి ,  గుంటూరు ఆర్డిఓ కె.శ్రీనివాస రావు ,  అడిషనల్ ఫైర్ ఆఫీసర్ కృష్ణా రెడ్డి , ఆర్ అండ్ బి ఎలక్ట్రికల్ డి.ఈ ఏ. నాగేశ్వర రావు , కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బిల్లా సునీల్ , టిడిపి పార్టీ  తరపున ఓంకార్ , కంచర్ల శివరామయ్య,  బిజెపి పార్టీ తరపున చరక కుమార్ గౌడ్ , జనసేన పార్టీ తరపున త్రినాధ్ , వైయస్సార్ పార్టీ తరపున అత్తోట జోసఫ్ , బిఎస్పీ పార్టీ తరపున చిరతనగండ్ల వాసు , ఆమ్ ఆద్మీ పార్టీ తరపున డా. సేవా కుమార్,  గుంటూరు పశ్చిమ మండల తహశీల్దార్ వెంకటేశ్వర్లు,  ఎలెక్షన్ సెక్షన్ పర్యవేక్షకులు మల్లేశ్వరి , రెవెన్యూ సిబ్బంది  పాల్గొన్నారు.



Comments