పంటల సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు ప్రక్రియకు వేదికగా నిలిచిన కార్యశాలలు - .వర్క్ షాప్ లు.


        


    పంటల సాగులో నూతన సాంకేతిక పరిజ్ఞాన బదలాయింపు ప్రక్రియకు వేదికగా నిలిచిన కార్యశాలలు - .వర్క్ షాప్ లు.


నేటితో ముగిసిన పంటల వారి కార్యశాలలు* 

డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు.

   అమరావతి (ప్రజా అమరావతి);

 ముఖ్యమంత్రి వారి ఆదేశాల మేరకు గత నెల నుండి ప్రారంభమై ఈ నాటితో 10 పంటలలో ముగిసిన *పంటల వారీ కార్యశాలలు* 

 వరి ,మినుము ,కంది , పుల్ల శనగ ,ఆముదం ,మొక్కజొన్న ,పత్తి ,చిరుధాన్యాలు ,వేరుశనగ ,నువ్వుల పంటలలో జరుపుకున్న కార్యశాలలు 

వినియోగదారుని ప్రాధాన్యత ,నిరంతర మార్కెట్ రేటు , అధిక దిగుబడులు,వాతావరణమునకు  తట్టుకుని నిలిచే రకాల ప్రాతిపదికగా సీజన్ కు ముందునుంచే పంటల వారీగా కార్యశాలలు

తొలకరి సాగుకు పంటలు విత్తబోయే ముందే ఈ ప్రక్రియ పూర్తి చేసాము .

పంటల సాగు విధానములో వివిధ భాగస్వామ్యులు అయిన శాస్త్రవేత్తలు ,రైతులు ,ఎగుమతిదారులు ,మిల్లుల యజమానులు మరియు వ్యవసాయ అధికారులను ఒకే వేదికపై సాగు పద్ధతులు,నూతన ఆవిష్కరణల పై పరస్పర అవగాహన,చర్చా కార్యక్రమమునకు అవకాశం కల్పించిన కార్యశాలలు . 

ఇప్పటివరకు జరిగిన అన్ని కార్యశాలలో ప్రత్యక్షముగా పాల్గొని ,పర్యవేక్షించిన వ్యవసాయ సంచాలకులు  డిల్లీ రావు ఐఏఎస్.


     ఈరోజు 20/03/25  గురు వారం  *వేరుశనగ ,నువ్వుల  పంటల  సాగులో* నూతన మేలైన సాంకేతిక పద్ధతులు & అధిక  దిగుబడులు ప్రాతిపదికగా పాటించవలసిన యాజమాన్య పద్ధతులు పై జరిగిన కార్యశాలలో పరిశోధన సంచాలకులు డాక్టర్ పి వి సత్యనారాయణ  తో పాటు శ్రీ డిల్లీ రావు ఐఏఎస్ వ్యవసాయ సంచాలకులు పాల్గొన్నారు . డిల్లీ రావు గారు ఈ కార్యక్రమ ప్రారంభ ఉపన్యాసం లో మాట్లాడుతూ గత నెలలో ముఖ్యమంత్రి వారి ప్రాథమిక రంగ మిషన్ సమీక్షలో ఆదేశాల మేరకు 

*పంటలవారీగా* వర్క్ షాప్ లను ఈ రోజుతో 10 పంటలలో  పూర్తిచే సుకుంటున్నామని  తెలిపారు .గౌరవ ముఖ్యమంత్రి వారు *రైతులకు ఆదాయం పెంచే మార్గం మరియు సారం కోల్పోతున్న నేలలను పరిరక్షించాల్సిన అవసరం* అనే ఈ రెండు విషయాలను  కొత్త కోణంలో ఆలోచించి ,ఆచరించే విధానాన్ని రూపొందించాల్సిన అవసరాన్ని తెలియ చేశారని చెప్పారు .వారి ఆదేశాల ప్రకారం ఒకే  పంటపై కేంద్రీకరించడం వల్ల లోతైన చర్చకు అవకాశం ఏర్పడి సమస్యకు పరిష్కారం ,ప్రత్యామ్నాయం, అవగాహన ఏర్పడే అవకాశం వుందని తెలిపారు .వినియోగ దారుల అవసరాల  ప్రాధాన్యత సంతరించుకున్న పంట రకాల సాగు ఎంపిక ,ఎగుమతుల కొరకు ప్రాంతీయంగా మరియు ఇతర ప్రాంతాలకు మార్కెట్ డిమాండ్ వున్న రకాల ఎంపిక ,పంటల సాగులో ఉత్తమ మేలైన యాజమాన్య పద్ధతులు ,నూతన సాంకేతిక ఆవిష్కరణలు ,రైతులు ,ఇతర భాగస్వామ్యులు పంట సాగులో తమ అనుభవాలను పంచుకునేలా ఈ కార్యశాల లు వేదికగా నిలిచాయని తెలిపారు.

        ఆచార్య ఎన్ జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిశోధన సంచాలకులు డాక్టర్ పి వి సత్యనారాయణ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల కాలంనుండి పంటల వారీ వివిధ రకాల భాగస్వాములతో ఇటువంటి కార్యశాలలు జరగలేదని ,డిల్లీ రావు గారు చూపిన ప్రత్యేక చొరవ అభినందనీయం అని తెలిపారు.క్షేత్ర స్థాయి అధికారులు ఈ కార్యశాలల అనుభవాల ద్వారా దీర్ఘకాలికంగా లాభదాయక ముగా వుండే దృష్టి కోణముతో చూడటానికి ఆస్కారం వుంటుందని తెలిపారు . 

     ఈ వేదికలలోని వివిధ భాగస్వాముల ద్వారా జరుపుకున్న చర్చా కార్యక్రమంలలో నిర్మాణాత్మక సూచనలు ,పరస్పర సాంకేతిక పరిజ్ఞాన బదిలీ ప్రక్రియ జరిగిందని తెలిపారు.సాగులో *విజయవంతమైన* వివిధ యాజమాన్య సాగుపద్ధతుల  

నమూనా *మోడల్ లను* సేకరించడం జరిగింది అని తెలిపారు.

 కార్యశాలల ద్వారా వివిధ పంటలలో సేకరించిన సమాచారంను ,మేలైన వాటిని *క్రోడీకరించి* ,ఏప్రిల్ మాసములో జరిపే ప్రాంతీయ వ్యవసాయ సాంకేతిక సదస్సులలో సిఫారసు చేస్తామని తెలిపారు. ఈ కార్యశాలను  జిల్లాస్థాయిలో కూడా ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు .రాబోవు ఖరీఫ్ సాగు తొలకరి లోపు ఈ ప్రక్రియ ముగుంచుకుని రైతులకు *నూతన మార్కెట్ ఆధారిత వ్యవసాయ పరిజ్ఞానమును అందించి* వారిని కార్యోన్ముఖులను చేసే దిశగా అడుగులు వేస్తున్నామని తెలిపారు.వీటినన్నటిని ఒక పుస్తక రూపములో ప్రచురించి క్షేత్ర స్థాయి అధికారులు ఇవ్వటం జరుగుతున్నదని తెలిపారు 

    ఈ కార్యక్రమములో కదిరి ,యలమంచిలి ,అనకాపల్లి,తిరుపతి,లామ్ కి చెందిన ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం శాస్త్రవేత్తలు  కిరణ్ కుమార్ రెడ్డి,కుమారి ,శిరీష ,ప్రతిభ శ్రీ , దేవకి,విశ్వనాథ్ ,జగన్నాథ రావు పాల్గొన్నారు .

 కార్యక్రమ నిర్వహణ లో సహకరించిన పరిశోధన సంచాలకులు డాక్టర్ పి వి సత్యనారాయణ ను డిల్లీ రావు శాలువాతో సత్కరించి సన్మానించారు .

      కమిషనర్ కార్యాలయ వ్యవసాయ ఉప సంచాలకులు బాలు నాయక్ వందన సమర్పణ చేశారు.





Comments