'శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి,
విజయవాడ 19 మార్చి 2025 (ప్రజా అమరావతి);
"హుండీ ఆదాయం వివరాలు
"
తేది. 19.03.2025 న ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం, మల్లేశ్వర మహా మండపం 6 వ అంతస్తులో నిర్వహించిన భక్తులు సమర్పించిన కానుకలు, మొక్కుబడుల హుండీ లెక్కింపు సందర్బంగా 15రోజులకు గానూ రూ.02,65,88,961/-(అక్షరాలా రెండు కోట్ల, అరవై ఐదు లక్షల, ఎనబై ఎనిమిది వేల, తొమ్మిది వందల అరవై ఒక రూపాయలు )నగదు రూపంలో, 500గ్రాముల బంగారం, 4 కేజిల 358గ్రాముల వెండి రూపంలో లభించాయి.
ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. రామచంద్ర మోహన్, ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ ఎం. రత్నరాజు హుండీల లెక్కింపు కార్యక్రమం పర్యవేక్షించారు.దేవదాయ శాఖసిబ్బంది,వన్ టౌన్ పోలీసులు, ఎస్.పి.ఎఫ్ పోలీసులు హుండీల కార్యక్రమం లో పాల్గొన్నారు.
addComments
Post a Comment