• *వివిధ సమస్యలపై గ్రీవన్స్ కు తరలివచ్చిన అర్జీదారులు*
• *వినతులు స్వీకరించి పరిష్కారానికి కృషి చేసిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్రప్రసాద్
, అమలాపురం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామి నాయుడు*
అమరావతి (ప్రజా అమరావతి);
తూర్పు గోదావరి జిల్లా గోపాలపురం మండలం చిట్యాల గ్రామానికి చెందిన ఆదిలక్ష్మి అనే మహిళ నేడు టీడీపీ కేంద్రకార్యాలయలో నిర్వహించిన ప్రజా వినతుల స్వీకరణ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజా, అమలాపురం అర్బన్ డవలప్మెంట్ అథారిటీ చైర్మన్ స్వామి నాయుడులకు అర్జీ ఇచ్చి వాపోతూ.. తమ భూములను ఆక్రమించుకోవడమే కాకుండా తమను తమ సొంత భూముల్లోకి వెళితే చంపేస్తామని.. కరెడ్ల గంగాధర్, కరెడ్ల నీలిమ, తోట ఆదినారాయణ, సూరవరపు సూర్యనారాయణలు బెదిరిస్తున్నారని.. వారిపై చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు.
• గుంటూరుకు చెందిన ఎమ్. శ్రీనివాస్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. శ్రీ అపరాజిత అగ్రి బయోటెక్ సంస్థ నుండి ఉద్యానవనశాఖ వారికి 2019 -2020 మధ్య సమగ్ర సస్యరక్షణ ఉత్పత్తులను సరఫరా చేశామని.. దానికి సంబంధించిన బిల్లు 18 లక్షలు నేటికి ఇవ్వలేదని.. దయ చేసి తమకు రావాల్సిన బాకాయి డబ్బులు ఇప్పించాలని అతను విజ్ఞప్తి చేశాడు.
• ఎన్టీఆర్ జిల్లా విజయవాడకు చెందిన మాదురి విజ్ఞప్తి చేస్తూ.. గత 20 సంవత్సరాలుగా తాము విజయవాడలో ఉంటున్నామని.. తమకు సొంత ఇల్లు లేక అద్దె ఇంట్లో ఉంటున్నామని.. అద్దె కట్టుకోలేక ఇబ్బంది పడుతున్నామని.. దయ చేసి తమకు ఇల్లు మంజూరు చేసి ఆదుకోవాలని ఆమె అర్జీ ఇచ్చి అభ్యర్థించింది.
• తూర్పు గోదావరి జిల్లా చాగళ్లుకు చెందిన తాళ్లూరి శ్రీనివాస్ విజ్ఞప్తి చేస్తూ.. తన నానమ్మ తనకు 85 సెంట్ల భూమి రాసి ఇచ్చిందని.. దాని ప్రకారం భూమి ఉన్నా.. ఆన్ లైన్ లో తక్కుగా నమోదు చేసి చూపుతున్నారని.. దయ చేసి ఆన్ లైన్ లో దొర్లిన తప్పును సరిచేసి 85 సెంట్ల భూమి ఉండేలా ఎక్కించాలని విజ్ఞప్తి చేశాడు.
• వైసీపీ నేతలు ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తుంటే.. అధికారులు వారిపై చర్యలు తీసుకోకుండా వారి వద్ద నుండి లంచాలు తీసుకొని పట్టించుకోవడంలేదని.. దీనిపై ఎంక్వైరీ వేసి ప్రభుత్వ స్థలంలోని అక్రమ నిర్మాణాలను తొలగించడంతో పాటు.. అక్రమార్కులకు సహకరిస్తున్న అధికారులపై చర్యలు తీసుకోవాలని కడప జిల్లా ఉప్పరపల్లి గ్రామానికి చెందిన పొట్ట శివప్రసాద్ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేశాడు.
• తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం కంచరపాలెం గ్రామానికి చెందిన దశరధన్ గ్రీవెన్స్ లో విజ్ఞప్తి చేస్తూ.. తమ గ్రామంలో బందిలి బాలయ్య, బందిలి సురేష్, బందిలి కుమార్ అనే వ్యక్తులు ప్రభుత్వ భూమిని ఆక్రమించి అంగన్ వాడీ కేంద్రానికి దారి లేకుండా చేశారని.. వారు ఆక్రమించుకున్న భూమిని విడిపించి అంగన్ వాడీ కేంద్రానికి దారి ఏర్పాటు చేయాలని విన్నవించారు.
addComments
Post a Comment