చిత్తూరు (ప్రజా అమరావతీ);
*వి.కోట మండలం నందు జరిగిన దారి దోపిడీ కేసును చేదించి
, 4 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి వద్ద నుండి సుమారు 3.2 కోట్ల రూపాయలు విలువ గల 3.5 కిలోల 5 బంగారు బిస్కెట్లను స్వాధీనం చేసుకున్న వి.కోట పోలీసులు.*
*02-04-25న రాత్రి జరిగిన దారి దోపిడీని కేవలం 2 రోజులలో ఛేదించి చోరీ కాబడిన పూర్తి సొత్తును స్వాధీనం చేసుకున్న పోలీసులు.*
*కేసులో కీలకమైన 4 గురు ముద్దాయిలను అరెస్ట్ చేసి సుమారు 3.2 కోట్ల రూపాయలు విలువ గల 3.5 కిలోల 5 బంగారు బిస్కెట్లు మరియు ఒక వాహనము స్వాధీనం.*
*ఫిర్యాదు అందిన వెంటనే చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, IPS గారి ఆదేశాల మేరకు 4 ప్రత్యేక బృందాలుగా ఏర్పడి కేసును త్వరితగతిన ఛేదించిన పోలీసులు.*
*ఈ కేసులో కీలక సుత్రదారైన అయిన జయపాల్(A1), KGF పట్టణంలోని 4వ వార్డు కి చెందిన కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్గా బాధ్యతలు నిర్వహిస్తున్నాడు.*
*బంగారం పోగొట్టుకున్న బాధితులు చిత్తూరు జిల్లా పోలీసులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. తమ ఆనందాన్ని జిల్లా ఎస్పీ గారితో పంచుకుంటూ, ఎప్పటికీ చిత్తూరు జిల్లా పోలీసుల పట్ల రుణపడి ఉంటామని పేర్కొన్నారు.*
*కేసు వివరాలు:*
02-04-2025వ తేదీన రాత్రి 08.45 PM గం. ల సమయంలో బాదితుడు చేతన్ కుమార్ తన కారులో వి.కోట నుండి పేర్నంబట్టుకు నాయకనేరి ఘాట్ నందు ప్రయాణిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు కారులలో వచ్చి అతనిని బెదిరించి అతని వద్ద గల 3.5 కిలోల బంగారు బిస్కెట్లను దొంగలించుకొని పోయారు. దీనిపై ఫిర్యాదుదారుడు దీపక్ కుమార్ 03-04-2025 న వి.కోట పోలీస్ స్టేషన్ నందు ఫిర్యాదు చేయగా వి.కోట ఇన్స్పెక్టర్ శ్రీ సోమశేఖర్ రెడ్డి గారు Cr.No: 49/2025, U/Sec : 309 (4) BNS గా కేసును నమోదు చేసారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, IPS ఆదేశాల మేరకు పలమనేరు డి.ఎస్పీ శ్రీ డేగల ప్రభాకర్ ఆధ్వర్యంలో నాలుగు ప్రత్యేక బృందాలు (వి.కోట ఇన్స్పెక్టర్ శ్రీ సోమశేఖర్ రెడ్డి బృందం, గంగవరం రూరల్ ఇన్స్పెక్టర్ శ్రీ మురళి మోహన్, బైరెడ్డి పల్లి ఎస్.ఐ. శ్రీ పరశరాముడు బృందం, ఎస్.బి. ఇన్స్పెక్టర్ శ్రీ భాస్కర్ బృందం మరియు క్రైమ్ ఇన్స్పెక్టర్ శ్రీ ఉమా మహేశ్వర రావు బృందం) ఏర్పాటు చేసి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలలో గాలింపు చర్యలను చేపట్టారు. దర్యాప్తులో బాగంగా సాంకేతికతను ఉపయోగించి రాబడిన కచ్చితమైన సమాచారం మేరకు 05.04.2025 న మధ్యాహ్న సమయంలో వి.కోట మండలం రాఘవపల్లి గ్రామ సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్ ఎదుట వి.కోట - పలమనేరు జాతీయ రహదారిపై వాహన తనిఖీలు నిర్వహిస్తున్న వి.కోట అర్బన్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మరియు వారి సిబ్బంది, ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేయగా, ఆ కారులో ప్రయాణిస్తున్న KGF పట్టణానికి చెందిన A1-జయపాల్, A2-ముక్రమ్, A3-బాబు మరియు A4-షణ్ముగం వద్ద నుండి సుమారు 3.5 కిలోల బరువున్న 5 బంగారు బిస్కెట్లు స్వాధీనం చేసుకొని, నేరానికి ఉపయోగించిన ఇన్నోవా కారుతో పాటు నిందితులను అరెస్ట్ చేశారు.
ఇన్వెస్టిగేషన్ లో భాగంగా A1 జయపాల్ ను విచారించగా, ఫిర్యాదు దారుడు దీపక్ కుమార్ ఒక నగల వ్యాపారి అని, ఒకరోజు చెన్నై నుండి KGF కు వెళుతుండగా, ఓ సేటు వద్ద బంగారు బిస్కెట్లు తీసుకొని వస్తున్న సమయంలో దోపిడీకి పాల్పడినట్లు వెల్లడించాడు. ఆ సేటు దగ్గర డ్రైవర్గా పనిచేస్తున్న ముక్రమ్(A2) అనే వ్యక్తి ఈ సమాచారాన్ని జమిల్ కు తెలిపాడు. జమిల్ కు జయపాల్ పరిచయం ఉండటంతో, ఇద్దరూ కలిసి జయపాల్ను కలిసి విషయం వివరించారు. దీంతో జయపాల్, తమిళనాడు రాష్ట్రం పేర్నంబట్టు కు చెందిన మరో 12 మందితో కలిసి దీపక్ కుమార్ వెళ్తున్న మార్గాన్ని గుర్తించి, ముందుగానే ప్లాన్ చేసుకుని దారి దోపిడీకి పాల్పడ్డామని నిందితుడు తన విచారణలో పేర్కొన్నాడు. ఈ ఘటనలో వారు బంగారు బిస్కెట్లను అపహరించినట్లు తెలిపాడు.
కేసు విచారణలో భాగంగా నలుగురు ముద్దాయిలను అరెస్ట్ చేసి, వారి వద్ద నుండి సుమారు 3.5 కిలోల బంగారు బిస్కెట్లు అలాగే దోపిడీకి ఉపయోగించిన ఇన్నోవా వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ దోపిడీ కేసులో పాల్గొన్న మరియు సహకరించిన మిగిలిన 09 మంది నిందితులను కూడా త్వరలోనే అరెస్ట్ చేసి రిమాండ్కు తరలిస్తామని పోలీసులు తెలిపారు.
దారి దోపిడీ కేసును 2 రోజులలో ఛేదించి బాధితుడు పోగొట్టుకున్న మొత్తం సొత్తును రికవరీ చేసిన వి.కోట పోలీసులను మరియు దర్యాప్తులో పాల్గొన్న అధికారులు మరియు సిబ్బందిని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ వి.ఎన్.మణికంఠ చందోలు, IPS గారు సర్టిఫికెట్స్ ఇచ్చి అభినందించారు.
*ముద్దాయిల వివరాలు:*
1) A1 - డి.జయపాల్, వయస్సు: 67, తండ్రి – ధనపాల్, ఉరిగం రైల్వే స్టేషన్ రోడ్, కె.జి.ఎఫ్.
2) A2 - ఎం.ముక్రామ్, వయస్సు: 42, తండ్రి – బాషా, రాబర్ట్ సన్ పేట్, కె.జి.ఎఫ్.
3) A3 – కె.ఆర్.బాబు, వయస్సు: 61, తండ్రి – రాజన్న, మారికుప్పం పోస్ట్, కె.జి.ఎఫ్.
4) A4 – షణ్ముగం, వయస్సు: 59, తండ్రి – వడమాలై, కోరమాండల్ పోస్ట్, కె.జి.ఎఫ్.
addComments
Post a Comment