పురాతన కోనేరుల పునరుద్ధరణకు ప్రణాళిక
తాడేపల్లి (ప్రజా అమరావతి);
రాష్ట్రంలోని వివిధ గ్రామాల్లో బాటసారులు, భక్తుల దాహార్తిని తీర్చడానికి వందల సంవత్సరాల క్రితం నిర్మించిన కోనేర్లు అనేక సంవత్సరాలుగా మరమత్తులకు నోచుకోక శిధిలావస్థకు చేరి, నిరూపయోగంగా మారాయి.
ఈ నేపథ్యంలో ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ కోనేర్ల పునరుద్ధరణపై దృష్టి సారించి, ఉపాధి హామీ పథకంలో చేపట్టడానికి అవసరమైన కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ఉన్న 400 కోనేర్లను అధికారులు గుర్తించారు. వీటిని పునరుద్ధరించి జూన్, 2025 నాటికి పూర్తిస్థాయిలో వినియోగంలోకి తీసుకురావాలన్న ఉపముఖ్యమంత్రి, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కొణిదల పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు అధికారులు అన్ని చర్యలు తీసుకుంటున్నారు
addComments
Post a Comment