కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధల్లో పరీక్షా ఫలితాలు రావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం.



*కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్ధల్లో పరీక్షా ఫలితాలు రావాలన్నదే సీఎం చంద్రబాబు నాయుడు లక్ష్యం*


 


*పేద విద్యార్థుల పట్ల సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్ ప్రత్యేక శ్రద్ధ* 


*వచ్చే విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు నాణ్యమైన బియ్యంతో భోజనం* 


*విద్యార్థులకు కూటమి ప్రభుత్వం అన్ని సౌకర్యాలు కల్పిస్తోంది* 


*వచ్చే ఏడాది గురుకులాలు, సంక్షేమ వసతి గృహాల్లో 100% ఉత్తీర్ణత సాధించాలి* 


*మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి* 


అమరావతి (ప్రజా అమరావతి):


కార్పొరేట్ విద్యాసంస్థలకు దీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావాలన్నదే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు లక్ష్యమని రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి అన్నారు. బుధవారం నాడు విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో  పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు మరియు వసతి గృహాల విద్యార్ధులకు ప్రోత్సాహకాలు అందించే కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డా.డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, గిరిజన సంక్షేమం మరియు స్త్రీ & శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణిలు ముఖ్య అతిధులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా  రాష్ట్ర వ్యాప్తంగా 315 మంది పదవ తరగతి, ఇంటర్మీడియెట్ లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్ధులకు మెమొంటో, సర్టిఫికెట్స్ అందించారు.  ఇందులో 34 మంది మెరిట్ విద్యార్ధులకు మొదటి ప్రైజ్ రూ.20 వేలు, రెండో ప్రైజ్ రూ. 15 వేలు, మూడో ప్రైజ్ రూ. 10,000 వేల నగదు పురస్కారాలు అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి డా. డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి మాట్లాడుతూ.....పదవ తరగతి, ఇంటర్ ఫలితాల్లో ఉత్తమ ప్రతిభ కనబరచిన సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్థులకు ప్రశంసా పత్రాలు నగదు ప్రోత్సాహకాలు అందించటం ఇదే తొలిసారన్నారు. కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ విద్యా సంస్థల్లో ఫలితాలు రావలన్నదే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు లక్ష్యం అన్నారు. పేద విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి, మరియు మానవవనరుల శాఖా మంత్రి నారా లోకేశ్ లు పత్యేక శ్రద్ధ తీసుకుని విద్యార్థులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో మరమ్మతులు, మౌలిక ఏర్పాట్లు కొరకు     రూ. 143 కోట్లు ఖర్చుచేసామన్నారు. నీట్  ఉచిత కోచింగ్ సెంటర్లను ఈ ఏడాది నుంచి 10 కి పెంచుతున్నామన్నారు. తద్వారా ఎక్కువ మంది ఐఐటీ, నీట్ తదితర విద్యా సంస్థల్లో ఎక్కువ సీట్లు దక్కే అవకాశం ఉందన్నారు. ప్రతిభ ఎవరి సొంతం కాదని, సాంఘిక సంక్షేమ, గిరిజన గురుకులాలు, వసతి గృహాల విద్యార్ధుల వల్ల ఆయా సంస్థలకు మంచి పేరు వచ్చిందన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా నిధి పథకాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు  చేపట్టామని తెలిపారు. సీనియర్ ఇంటర్ లో 94 శాతం ఉత్తీర్ణత సాధించడం విద్యార్ధుల, అధ్యాపకులు కృషికి నిదర్శనమన్నారు.  వచ్చే విద్యా  సంవత్సరం నుంచి విద్యార్థులకు కాస్మోటిక్ కిట్స్, నాణ్యమైన బియ్యంతో భోజనం అందిస్తామన్నారు.   గురుకులాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు ప్రత్యేక వైద్యుల్ని నియమించామని తెలిపారు.  సంరక్షకులు లేని విద్యార్థులకు వేసవి సెలవుల్లోనూ హాస్టళ్లలో వసతి కల్పిస్తున్నామన్నారు. విద్యలో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారిపట్ల టీచర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వచ్చే ఏడాది గురుకులాలు,  సంక్షేమ వసతి గృహాల్లో విద్యార్థులు 100 శాతం ఉత్తీర్ణత లక్ష్యంగా అధ్యాపకులు కృషి చేయాలని మంత్రి డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి అన్నారు. ఈ కార్యక్రమంలో సాంఘిక సంక్షేమ శాఖ కార్యదర్శి ఎం.ఎం. నాయక్, AP.SWREIS కార్యదర్శి  వి. ప్రసన్న వెంకటేష్, సాంఘిక సంక్షేమ శాఖ డిప్యూటీ డైరెక్టర్ లావణ్య వేణి, గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి జి. గౌతమి, సంచాలకులు ఎస్. భార్గవి, విద్యార్ధుల తల్లిదండ్రులు, అధ్యాపకులు, వార్డెన్లు, తదితరులు పాల్గొన్నారు.

Comments