రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ఆధార్-ఈ సంతకం
నేటి నుండి ఆర్మూర్, కూసుమంచి ఎస్ ఆర్ వో కార్యాలయాల్లో ప్రారంభం
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా అమలు
హైదరాబాద్ (ప్రజా అమరావతి);
అవినీతి రహితంగా, పారదర్శకంగా, సమయాన్ని ఆదా చేయాలనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా వచ్చే నెల 2వ తేదీ నుంచి స్లాట్ బుకింగ్ విధానాన్ని తీసుకువస్తున్న నేపధ్యంలో ఆధార్ -ఈ సంతకం కూడా వీలైనంత త్వరగా అమలులోకి తీసుకువరావాలని అధికారులను ఆదేశించడం జరిగింది. సోమవారం సచివాలయంలో స్టాంప్స్ & రిజిస్ట్రేషన్ ఐజీ తో కలిసి స్లాట్ బుకింగ్ విధానం, పని భారం అధికంగా ఉన్న సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు రిజిస్ట్రార్ల పోస్టింగ్, పదోన్నతి పొందిన ఉద్యోగులకు పోస్టింగ్లపై సమీక్షించడం జరిగింది.
స్లాట్ బుకింగ్తోపాటు రిజిస్ట్రేషన్ ప్రక్రియను మరింత వేగవంతం చేయడంలో భాగంగా ఆధార్-ఈ సంతకం ప్రవేశపెడుతున్నాం. ముందుగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్, ఖమ్మం జిల్లా కూసుమంచి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తక్షణమే అమల్లోకి తీసుకువస్తున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా స్లాట్ బుకింగ్ తీసుకువస్తున్న నేపధ్యంలో ఎలాంటి సాంకేతిక సమస్యలు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులకు సూచించడం జరిగింది.
పఠాన్చెరువు, యాదగిరి గుట్ట, గండిపేట, సూర్యాపేట, జడ్చర్ల, మహబూబ్నగర్, వనపర్తి, గద్వాల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు అదనంగా ఎస్ ఆర్ వోలను నియమించడం జరిగింది.
అవినీతికి దూరంగా ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ ప్రభుత్వ పేరు ప్రతిష్టలు పెంచేవిధంగా సబ్ రిజిస్ట్రార్ల పనితీరు ఉండాలని సూచించాము.
addComments
Post a Comment