విద్యుత్ షాక్ తో మరో ఎలక్ట్రీషియన్ ప్రాణం కోల్పోకూడదు.

 విద్యుత్ షాక్ తో మరో ఎలక్ట్రీషియన్ ప్రాణం కోల్పోకూడదు.



ఎలక్ట్రీషియన్ల ప్రాణాలకు రక్షణ కల్పించేలా సేఫ్టీ కిట్స్ అందించిన ఉప ముఖ్యమంత్రి  పవన్ కళ్యాణ్.

  

 అమరావతి (ప్రజా అమరావతి);


      ఈరోజు మధ్యాహ్నం మంగళగిరిలోని క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో పిఠాపురం నియోజకవర్గం పరిధిలో ఎలక్ట్రికల్ పనులు చేస్తూ ఉపాధి పొందుతున్న 325 మంది ఎలక్ట్రీషియన్లకు, పని ప్రదేశాల్లో వినియోగించాల్సిన రక్షణ పరికరాలను, టూల్ కిట్లను అందించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్. ఇటీవల పిఠాపురంలో ఒక ఎలక్ట్రీషియన్ పని చేస్తున్న సమయంలో కరెంట్ షాక్ తో మృతి చెందటంతో భవిష్యత్తులో మరొకరి ప్రాణాలు పోకూడదనే ఉద్దేశంతో ఈ కిట్లను అందించారు.

    గత ఏప్రియల్ నెలలో పిఠాపురం నియోజక వర్గంలోని మల్లం గ్రామంలో జరిగిన దుర్ఘటన నన్ను తీవ్రంగా కలిచివేసింది.  మల్లం గ్రామంలో ఎలక్ట్రీషియన్ పనులు చేసి జీవించే 38 సంవత్సరాల పేద దళిత యువకుడు పల్లపు సురేష్ బాబు  దురదృష్టవశాత్తు ఒకరి ఇంటిలో కరెంటు మరమ్మత్తు పని చేస్తూ విద్యుధాఘాతానికి గురై మృతి చెందాడు.   సురేష్ బాబు మృతితో అతని కుటుంబం పోషకుడిని కోల్పోయి నిరాధారంగా మారడమే కాకుండా, ఈ సంఘటన గ్రామంలో సాంఘికంగా అవాంఛనీయమైన అపోహలకు, స్పర్థలకు  దారి తీసింది. 

   ఈ పరిణామాలను నిశితంగా పరిశీలిస్తే, రెండు అంశాలు మనకు స్పష్టం అవుతున్నాయి.  ఒకటి పేదరికం కారణంగా సురేష్ బాబుకు విద్యుత్ పనులు చేసేపుడు వాడే రక్షణ పరికరాల లేక పోవడం, రెండవది ప్రమాదవశాత్తు అతడు చనిపోతే అతని కుటుంబానికి ఆదుకునేందుకు ఆర్థిక భద్రత లేకపోవడం. అందుకే ఇటువంటి సంఘటన పునరావృతం కాకూడదనే నిశ్చయంతో పిఠాపురం నియోజకవర్గంలో ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లుగా  పనిచేస్తున్న కార్మికులందరికి రక్షణ, భద్రత కల్పించాలని ఉప ముఖ్యమంత్రి, పిఠాపురం MLA పవన్ కళ్యాణ్ నిశ్చయించుకున్నారు.


       ఇందులో భాగంగా పిఠాపురం నియోజక వర్గంలో పనిచేస్తున్న 325 మంది ప్రైవేట్ ఎలక్ట్రీషియన్లకు ఒక్కక్కరికీ వార్రi ప్రాణాలకు రక్షణ కల్పించేలా ప్రత్యేక శ్రద్ధ తీసుకుని రక్షణ పరికరాల కిట్లను ఈరోజు క్యాంపు కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో ఆయన స్వయంగా పంపిణీ చేశారు. ఈ కిట్ లో ఎలక్ట్రికల్ పనులకు అవసరమైన టూల్స్ కిట్,  రబ్బర్ హాండ్ గ్లోవ్స్, సేఫ్టీ షూస్, జాకెట్ ఉండేలా చూడటం జరిగింది.  

     వృత్తిలో రక్షణ కల్పించడంతో బాటు,  ప్రయివేట్ ఎలక్ట్రీషియన్ల కుటుంబాలకు సాంఘిక, ఆర్థిక భద్రత కల్పించడం ఎంతో అవసరం anj భావించి, ఈ 325 మంది ప్రయివేట్ ఎలక్ట్రీషియన్లను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వశాఖ అమలు చేస్తున్న  ఈ-శ్రమ్ సంక్షేమ పోర్టల్ లో నమోదు చేసి యూనివర్సల్ అకౌంట్ నెంబరు (UAN) కార్డులు జారీ చేస్తున్నాం.  ఈ UAN Card కలిగిన కార్మికుడు ప్రమాద వశాత్తు మరణించినా లేదా పూర్తి అంగవైకల్యం సంభవిస్తే  2 లక్షల రూపాయలు, పాక్షిక  వైకల్యం సంభవిస్తే  లక్షరూపాయాలు ఎక్సేగ్రేషియా అతని కుటుంబానికి చెల్లించి ఆర్ధికంగా ఆదుకోనున్నట్లు తెలిపారు.

  కరెంటు పనులు చేసేటప్పుడు  ఈ రక్షణ పరికరాలను తప్పని సరిగా వాడాలని ఎలక్ట్రీషియన్లను ప్రత్యేకంగా కోరారు. అలాగే వాటి ఎలా వినియోగించాలో, విద్యుత్ పనులు చేసేపుడు పాటించవలసిన జాగ్రత్తలపై ఎలక్ట్రీషియన్లకు ఓరియెంటేషన్ నిర్వహించాలని విద్యుత్ శాఖ ఇంజనీర్లను కోరారు.



Comments