భారత్ వృద్ధి ప్రస్థానంపై నమో యాప్లోని సర్వేలో పాలుపంచుకోండి... ప్రజలకు ప్రధానమంత్రి విజ్ఞప్తి
09 JUN 2025 Hyderabad (prajaamaravati)
గత 11 సంవత్సరాలలో భారత్ వృద్ధి ప్రస్థానంపై నమో యాప్ (NaMo App)లో ఓ సర్వేలో పాలుపంచుకోవాల్సిందిగా ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఒక పోర్టల్ లింకును కూడా శ్రీ మోదీ షేర్ చేశారు. ఆ లింకు లోకి వెళ్లి ప్రతి ఒక్కరు గడచిన 11 సంవత్సరాల్లో భారత్ వృద్ధి ప్రస్థానానికి సంబంధించి ‘జన్ మన్ సర్వే’లో పాల్గొనవచ్చు.
ప్రధానమంత్రి ఎక్స్లో ఇలా పోస్టు చేశారు:
‘‘మీ ఆలోచనలు అన్నింటికంటే మిన్న. నమో యాప్లోని సర్వేలో పాల్గొని, గత 11 సంవత్సరాల్లో భారత్ వృద్ధి ప్రస్థానాన్ని మీరు ఎలా చూస్తున్నదీ మాకు తెలియజేయండి. 11YearsOfSeva.
addComments
Post a Comment