తాడేపల్లి (ప్రజా అమరావతి); వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేంద్ర కార్యాలయం
మున్సిపోల్స్ లోనూ వైయస్ఆర్సీపీ స్వీప్ చేస్తోందిః శ్రీ సజ్జల.
*వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి ప్రెస్ మీట్ పాయింట్స్..*
*- బెదిరిస్తున్నారంటూ టీడీపీ నేతలు ఇల్లు ఎక్కి అరిచినంతమాత్రాన అబద్ధాలు నిజాలు అయిపోవు*
*- మున్సిపోల్స్ లో వైయస్ఆర్సీపీ ప్రభుత్వంపై మరోసారి ప్రజలు విశ్వాసం చూపారు*
*- మున్సిపల్ ఎన్నికల్లో మెజార్టీ ఏకగ్రీవాలు వైయస్ఆర్సీపీ సొంతం*
*- ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైయస్ఆర్సీపీదే విజయం అని నిరూపణ అయ్యింది*
*- మొన్నటివరకూ ఎస్ఈసీని కీర్తించిందీ టీడీపీ వారే.. ఈరోజు విమర్శిస్తుందీ వారే*
*- ఏకగ్రీవాలను అడ్డుకోవాలని చూస్తే చివరికి ఏమైంది..?*
*- నామినేషన్లకు ఎస్ఈసీ మరో అవకాశం ఇచ్చినా.. టీడీపీపై నమ్మకం లేక ఎవరూ ముందుకు రాని పరిస్థితి*
*- నామినేషన్లు వేయడానికే టీడీపీకి మనుషులు దొరకటంలేదు.. మరి శిబిరాలు ఎందుకు..?*
*-ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అని టీడీపీ మేనిఫెస్టోలో రాశారు..ఆ తీర్మానం నాలిక గీచుకోవటానికా..?*
*- 2014 టీడీపీ మున్సిపల్ మేనిఫెస్టోలో పెట్టినట్టు రూ.2కే 20 లీటర్ల మినరల్ వాటర్, ఇంటికో ఉద్యోగం ఇచ్చారా..?*
*- 2014 జనరల్ ఎన్నికల్లో టీడీపీ మేనిఫెస్టోలో ఇచ్చిన 600 వాగ్దానాలకే దిక్కు లేదు*
*- అమలుకాని వాగ్దానాలను టీడీపీ మేనిఫెస్టోలో పెట్టి ప్రజల్ని మోసం చేయడంపై ఎన్నికల కమిషన్ కు ఫిర్యాదు చేస్తాం*
*- 20 నెలలుగా సంక్షేమ పరిపాలన ద్వారా ప్రజల జీవన ప్రమాణాలను పెంచిన సీఎం శ్రీ జగన్.. పన్నులు పెంచుతారంటే ఎవరైనా నమ్ముతారా..?*
*- పన్నులు బాదేస్తున్నారని చంద్రబాబు ఎన్ని అబద్ధాలు చెప్పినా ప్రజలు నమ్మరు*
*- కుప్పంలో ఎప్పుడైతే అడ్రస్ గల్లంతైందో.. ఇక టీడీపీ పనైపోయినట్టే..*
*శ్రీ సజ్జల రామకృష్ణా రెడ్డి మాట్లాడుతూ.. ఇంకా ఏమన్నారంటే..*
1. స్థానిక ఎన్నికల్లో భాగంగా పార్టీ గుర్తుల మీద జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల విత్డ్రాయల్స్ ముగిశాయి. మేం అనుకున్నట్లుగానే ఈ ప్రభుత్వం మీద, శ్రీ జగన్ గారి పాలన మీద విశ్వాసం ఉందని పంచాయతీ ఎన్నికల్లోనూ, అలాగే పార్టీ గుర్తులపై జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో కూడా ఏకగ్రీవాలు దానికంటే హెచ్చుగా ఉన్నట్లు మాకు ప్రాథమిక సమాచారం వచ్చింది. దీనికంటే ముందు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు జరిగినా ఇవే ఫలితాలు వచ్చి ఉండేవి. ఇందులో అసహజం ఏమీ లేదు. ఎక్కడైతే ప్రజల ఆకాంక్షలను తీర్చేవిధంగా పాలకులు పనిచేస్తే.. అంతకు రెండింతలు ప్రజలు ఆశీస్సులు ఇస్తారని ఎప్పుడూ రుజువు అవుతోంది. అది ఈ ఎన్నికల్లో కూడా ప్రతిబింబిస్తోంది.
2. ఎన్నికల్లో వైయస్ఆర్సీపీ స్వీప్ చేస్తుందనే విషయం టీడీపీకి, చంద్రబాబుకు కూడా తెల్సు.. ఎస్ఈసీ, టీడీపీకి కుదిరిన అక్రమ సంబంధం కారణంగా ఎన్నికలు వాయిదా పడిన విషయం అందరూ గమనించారు. ఎస్ఈసీ ద్వారా ఎన్నికలను టీడీపీనే వాయిదా వేయించుకుని మేమేదో (వైయస్ఆర్సీపీ) భయపడుతున్నామని ఆరోపణలు చేశారు. అలా వాయిదా వేయటం ద్వారా వాళ్ళు సాధించింది ఏమీ లేకపోగా, అప్పటికంటే మరింత మెరుగ్గా వైయస్ఆర్సీపీకి అనుకూలంగా ఫలితాలు రావటానికి అవకాశం కల్పించారని భావిస్తున్నా.
3. కోవిడ్ సంక్షోభ సమయంలోనూ ప్రజలకు భరోసా ఇస్తూ.. ప్రభుత్వం సంక్షేమ పథకాలను గడప గడపకు అందించాం. దానివల్ల వచ్చే ఫలితాలు ఇలాగే ఉంటాయి. గతం నుంచి టీడీపీ మొదలు పెట్టిన డ్రామాలు.. అబద్ధాలను ఇప్పుడు జరిగే ఎన్నికల్లోనూ ప్రచారం చేస్తోంది. ఎస్ఈసీని ముందు పెట్టుకొని, అడ్డంగా ఎక్కడికక్కడ ఘోరాలు జరిగిపోతున్నాయనే భావన ప్రజల్లో సృష్టించాలని టీడీపీ, చంద్రబాబు ప్రయత్నించారు. ఇప్పుడు కూడా టీడీపీ ఎస్ఈసీతో లాలూచీ వ్యవహారం చేస్తోంది. ఆరోజుకు, ఈరోజుకూ ప్రభుత్వ పాలనలో కానీ, వైయస్ఆర్సీపీ దీమాలో ఎలాంటి తేడా లేదు. ప్రభుత్వం నిష్పాక్షకంగా వ్యవహరిస్తోంది.
4. టీడీపీ నేతలే రోజుకో మాట మారుస్తున్నారు. మొన్నటివరకూ ఎస్ఈసీని కీర్తించారు.. ప్రపంచంలో ఎస్ఈసీని మించిన రాజ్యాంగం లేదని టీడీపీ నేతలు పొగిడారు. ఇవాళ ఎస్ఈసీ నీరుగారిపోయారు, మారిపోయారిని టీడీపీ నేతలే అంటున్నారు. ఇప్పటికీ టీడీపీతో ఎస్ఈసీ లాలూచీ అలాగే కనపడుతోంది. ఒక్కొక్క రోజు ఒక్కోమాట మాట్లాడతారు.. నిన్న కూడా వాలంటీర్ల విషయంలోనూ ఎస్ఈసీ అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఏ ఫోన్ల ద్వారా ప్రజలకు సేవలు అందాలో వాటిని తీసుకోవాలని ఎస్ఈసీ ఆదేశించారు. టీడీపీ నేతలు కంప్లైంట్స్ ఇచ్చారో, లేదో తెలీదు కానీ.. కంప్లైంట్స్ వచ్చాయి. తాను సంతృప్తి చెందానని ఎస్ఈసీ అంటారు. అయితే వాలంటీర్ల ఫోన్లు సరెండర్ చేసే అంశాన్ని ఈరోజు కోర్టు కొట్టివేసింది.
5. ఏకగ్రీవాలు అంశంలో ఎస్ఈసీ అయినా ఎవరైనా చట్టంలో రూల్స్, గైడ్లైన్స్ ప్రకారం వ్యవహరించాలి. ఇంతకు భిన్నంగా ఎక్కడా జరగదు. 2019లో చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు కూడా ఈ అధికారులే ఉన్నారు. ప్రతిపక్షాలు ఎవరైనా కంప్లైంట్స్ ఇస్తే సాక్ష్యాధారాలు ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఆధారాలు ప్రాతిపదికగా నిర్ణయం తీసుకోవాలి తప్ప వీళ్లు ఇచ్చిన రిపోర్ట్ సరిగ్గాలేదని ఎస్ఈసీనే అనుకొని తనకు వచ్చిన సమాచారం వేరేరకంగా ఉందని, తన విశేషాధికారాలు వాడుతాను అనటానికి వీల్లేదు. అలాంటి అధికారాలు కూడా ఎస్ఈసీకి లేవు. అయినా ఆయన నిర్ణయాలు తీసుకున్నారు. దానిపైన అంతిమంగా కోర్టు నిర్ణయం వెలువరించింది.
6. రీ నామినేషన్లను ఎస్ఈసీ నిర్ణయం తీసుకుంటే... ఒకరు వచ్చి నామినేషన్ వేసినట్లు ఉన్నారు. మిగిలిన వారు నామినేషన్లు వేయటానికి ఎందుకు రాలేదంటే టీడీపీపై నమ్మకం లేకనే. ఎక్కడెక్కడ అయితే నామినేషన్లు వేయమని ఎస్ఈసీ అవకాశాలు ఇచ్చినా, టీడీపీ అభ్యర్థులు రాలేదు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న పార్టీ, ఆర్గనైజేషన్, కేడర్ ఉన్న పార్టీ తరుపున నామినేషన్లు వేయటానికి అభ్యర్థులు ముందుకు రాలేదు. దీనికి టీడీపీ వేరే రంగును వేయటానికి ప్రయత్నించినా.. అభ్యర్థులు లేరన్నది వాస్తవం.
-టీడీపీ మీద, చంద్రబాబు మీద నమ్మకం ఎవ్వరికీ లేదు. టీడీపీ మీద ఆ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నమ్మకం పోయింది. కాబట్టే చంద్రబాబు ఎన్ని పిలుపులు ఇచ్చినా, ఎస్ఈసీ మరోసారి నామినేషన్లు వేసుకోవటానికి అవకాశం ఇచ్చినా.. అభ్యర్థులే దొరకలేదు. కార్యకర్తలు, సానుభూతిపరులు లేకపోగా నామినేషన్ వేసిన అభ్యర్థులతో క్యాంప్లు మెయింటైన్ చేస్తున్నారు. పార్టీ తరుపున నామినేషన్ వేసిన అభ్యర్థులు అంత సులభంగా లొంగిపోతే అదో పార్టీనా..?
7. టీడీపీకి నిజంగా కార్యకర్తలు ఉంటే.. ఇలా ఉండేదా? గతంలో వైయస్ఆర్సీపీ తరుపున పోటీకి నిలబెడితే మామూలుగా బెదిరించారా? టీడీపీ హయాంలో మూములు అక్రమ కేసులు పెట్టారా?
- 2013 పంచాయితీ ఎన్నికలు గుర్తులేదా? 2014 సాధారణ ఎన్నికలతో పాటు, ఇవీ వస్తే.. ఢీ అంటే ఢీ అని మేం పోటీ చేశాం. శ్రీ జగన్ మోహన్ రెడ్డి కుటుంబ సభ్యులైన వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఒక్కరైనా మీ బెదిరింపులకు వెనక్కి తగ్గారా? అలాంటి వారు మీకు ఎందుకు లేదు. 40 ఏళ్ల రాజకీయ చరిత్ర ఉన్న చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలి. పైగా బెదిరిస్తున్నారని చంద్రబాబు ఇళ్లు ఎక్కి అరిస్తే మాత్రం అది నిజమైపోదు.
8. నామినేషన్లు వేయాటానికి అభ్యర్థులు దొరక్క, వేసిన వారితో శిబిరాలు పెట్టే దౌర్భాగ్య పరిస్థితికి టీడీపీ వస్తే.. దానికి బదులు టీడీపీ దుకాణం కట్టేసుకుంటే బావుంటుంది. దీనికోసం మళ్లీ మేనిఫెస్టో... దౌర్జన్యాలు జరిగిపోతున్నాయంటూ తిరుపతిలో ధర్నా, దీక్ష అంటూ చంద్రబాబు హడావుడి చేస్తున్నారు. పైగా చంద్రబాబును అడ్డగించారని ఎయిర్పోర్టులో 10 గంటల డ్రామా. ఎన్నికల కోడ్ ఉన్నప్పుడు ధర్నాలు చేయటానికి ఎవ్వరినీ అనుమతించరు అన్న సంగతి చంద్రబాబుకు తెల్సు. రెండు, మూడు రోజుల ముందే కుప్పం వెళ్లి సంబరాలు చేసుకున్నారు కూడా. అంత దారుణమైన ఓటమిని కూడా సంబరాలు చేసుకోవటం ఎక్కడా చూడం. ఆరోజు ఏ అధికారి కూడా మిమ్మల్ని ఆపలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ ఉందని ఆపారు. దాన్ని అధికారులు చంద్రబాబుకు వివరించారు కూడా. అయినా సరే.. మీ అనుకూల టీవీ ఛానల్స్లో 10 గంటల పాటు డ్రామా నడిపారు. ఇది నిరంకుశ రాజ్యం అన్నట్లు.. ఏదో జరుగుతోందన్నట్లు ప్రొజెక్ట్ చేయాలని టీడీపీ, చంద్రబాబు చూశారు.
9. రేపటి నుంచి మున్సిపల్ ఎన్నికల ప్రచారానికి బయల్దేరుతున్నానని చంద్రబాబు అంటున్నారు. పైగా మున్సిపల్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేశారు.
-పంచాయితీ ఎన్నికల మేనిఫెస్టో విడుదల చేసినప్పుడు గుర్తింపు రద్దు చేయమని ఎన్నికల సంఘాన్ని కోరాం. మున్సిపల్ ఎన్నికలకు కూడా మేనిఫెస్టో విడుదల చేశారు. ప్రభుత్వం మాత్రమే చేసేవి కూడా టీడీపీ మున్సిపల్ మేనిఫెస్టోలో చంద్రబాబు పెట్టేశారు. బకాయిలు రద్దు చేస్తామని, 50% పన్ను తగ్గిస్తామని ఏవేవో చెప్పారు. ఒకటి రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో అంశాలు అని తెల్సి.. పాలనా అనుభవం ఉన్న చంద్రబాబు వాటిని మున్సిపల్ మేనిఫెస్టోలో పెట్టడమంటే ప్రజల్ని మోసం చేయటమే. దీనిపై కూడా ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తున్నాం. రెండోది తను చేయలేనివి కూడా మేనిఫెస్టోలో పెట్టడం. 2014 జనరల్ ఎన్నికల్లో నూ మేనిఫెస్టో ఇచ్చారు. అప్పుడు సాధారణ, మున్సిపల్ ఎన్నికలు రెండూ కలిసి వచ్చాయి. వచ్చేది మా ప్రభుత్వమే కాబట్టి ఇచ్చామని అనుకోవచ్చు. కానీ ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు జరుగుతున్నాయి. వచ్చే మూడేళ్ల పాటు వైయస్ఆర్సీపీ అధికారంలో ఉంటుంది. ఇప్పుడు సాధ్యం కానివి ఇవ్వటం అంటేచంద్రబాబు 420 పనిచేశారని అనిపిస్తోంది.
10. 2014 మున్సిపల్ ఎన్నికల్లో రూ.2లకే 20 లీటర్ల మినిరల్ వాటర్ క్యాన్ అని టీడీపీ మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. ప్రతి ఇంటికీ ఉద్యోగం, ప్రతి కుటుంబానికి సొంతిల్లు, మహిళ భద్రత, పచ్చదనం-పరిశుభ్రత వంటివి జనరల్ హామీలు అనుకోవచ్చు. మరి, రూ.2లకే 20 లీటర్లు మినరల్ క్యాన్ కానీ, ప్రతి ఇంటికీ ఉద్యోగం, ప్రతి కుటుంబానికీ ఇళ్లు వచ్చిందా అని రాష్ట్ర ప్రజల్ని అడుగుతున్నాం. ఆరోజున 2014 లో టీడీపీనే అధికారంలో ఉంది.
2014లో టీడీపీ విడుదల చేసిన మేనిఫెస్టోకే దిక్కులేదు. ఎప్పటికప్పుడు టీడీపీ మేనిఫెస్టోపై శ్రీ జగన్ గారు ప్రశ్నలు సంధిస్తుంటే దాన్ని ఎత్తేశారు. అన్నింటికంటే పెద్ద మోసం రుణమాఫీ. ఇంటికే మీ బంగారం వస్తుందని మోసం చేశారు. ఆ రుణమాఫీని నమ్ముకొని కట్టనివారు నట్టేట మునిగారు.
11. అబద్దాలు చెబితే.. మీడియా అయినా, వైయస్ఆర్సీపీ వాళ్లు అయినా నిలదీస్తారనే భయం చంద్రబాబుకు ఉండాలి కదా. రూ.2లకు 20 లీటర్లు ఇస్తారని చెప్పి... కనీసం గ్లాసు నీరు ఇవ్వలేదన్న భయం కూడా చంద్రబాబు ఒంట్లో లేదు. అలాంటి వారిని ఏమీ చేయలేం. ఆయన సాధారణ మనుషుల్లో వ్యక్తి కాదని అర్థం చేసుకోవాలి. పైగా ఎలాంటి సిగ్గులేకుండా 2021కి మున్సిపల్ మేనిఫెస్టో విడుదల చేశారు. ఇవాళ ఆస్తి పన్ను తగ్గిస్తూ తొలి తీర్మానం అని మేనిఫెస్టోలో రాశారు. ఆ తీర్మానం నాలిక గీచుకోవటానికా? మున్సిపల్ తీర్మానం చేస్తే సరిపోతుందా అని అధికారులను విచారిస్తే.. కుదరదు అని చెప్పారు. కానీ, చంద్రబాబు మేనిఫెస్టోలో హామీగా ఇచ్చేశారు. మొన్న పంచాయితీ ముఖ్యమంత్రి, రేపు మున్సిపల్ ముఖ్యమంత్రి, ఎల్లుండి మండల ముఖ్యమంత్రిగా కేంద్ర ప్రభుత్వం కంటే అపరిమిత అధికారాలు ఉన్న నేతగా చంద్రబాబు ఇలాంటివి చేస్తారని భావించాల్సి వస్తుంది. కేంద్ర ప్రభుత్వం చేయలేని పనులు చంద్రబాబు చేస్తారని భావించాలి. చంద్రబాబు మోసానికి ఒక హద్దు లేదు. కన్ను ఆర్పకుండా చంద్రబాబు అబద్ధాలు. చిన్నపాటి బెరుకు కూడా లేకుండా మోసం. ఎవరైనా అసలు ఎలా ఉండకూడదో చంద్రబాబు నుంచి నేర్చుకోవాలి.
12. రేపటి నుంచి చంద్రబాబు ప్రచారానికి వచ్చి మళ్లీ అబద్ధాలు మొదలుపెడతారు. శ్రీ జగన్ మోహన్ రెడ్డి బాదుడు మొదలుపెడతారని.. అబద్ధాల్ని ప్రచారం చేస్తారు. మున్సిపల్ ఆస్తి పన్ను విషయంలో శ్రీ జగన్ గారు చట్టం తెచ్చారని చంద్రబాబుకు కూడా తెల్సు. వీటన్నింటికీ మించి గత 20 నెలలుగా శ్రీ జగన్ గారు పేదల కోసం పల్లెల్లో, పట్టణాల్లో సంక్షేమంతో పాటు నాడు-నేడు పేరుతో అభివృద్ధి పనులు చేశారు. ప్రజల జీవనప్రమాణాలు పెంచటానికి ప్రయత్నం చేసిన శ్రీ జగన్ గారు.. ప్రజలకు సంబంధించి చిన్న ఆస్తి పన్ను దగ్గర రహస్యంగానో, ఇంకోరకంగా బాదుతారా.. అని సజ్జల ప్రశ్నించారు. ఆ లక్షణం చంద్రబాబుకు ఉందని జనం ఆయన్ను చెత్తబుట్టలో పడేశారు. ప్రజలపై అతి తక్కువ భారం పెట్టి.. మాగ్జిమం జీరో వేస్టేజ్ మాత్రమే కలిగేలా సీఎం శ్రీ జగన్ చేశారు. ప్రజలకు మేలు కలిగేలా ప్రభుత్వం చేస్తోంది. ధర్మకర్తలాగా ప్రజలకు మేలు జరిగేలా ప్రభుత్వాలు చేస్తాయి. అలా అని ప్రజలపై ఎక్కువ భారాలు లేకుండా శ్రీ జగన్ చూస్తున్నారు. దోపిడీ అనేది చంద్రబాబు హయాంలో, అంతకుముందు జరిగింది. అద్దె ఆధారంగా వసూలు అన్నప్పుడు మున్సిపల్ అధికారులతో కొందరు లాలూచీ పడి సామాన్యులపై భారం వేసిన సందర్భాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఆధారంగా పన్ను వేస్తారు కాబట్టి.. ఒకరికి ఒకరకంగా మరొకరి మరోలా ఉండటం ఉండదు. దీనివల్ల అవినీతికి ఆస్కారం ఉండదు.
13. వైయస్ఆర్సీపీ పెట్టిన అభ్యర్థులు పంచాయతీల కంటే మిన్నగా మున్సిపాలిటీల్లో గెలుచుకోబోతున్నాం. సంక్షేమ పథకాలు వల్ల ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయి. ఇవిగాక ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు చాలా ఉన్నాయి. కొత్తగా ఇళ్లు రాబోతున్నాయి. మధ్యతరగతి ప్రజలకు మోడ్రన్ సౌకర్యాలతో ప్రైవేటు వెంచర్లా కాకుండా ప్రభుత్వమే ఇళ్ల స్థలాలు కేటాయించే చర్యలకు శ్రీకారం చుట్టింది. రాబోయే ఆరు నెలల్లో అవి కూడా సిద్ధం కాబోతున్నాయి. రైతులకు సంబంధించినవి తప్ప మిగిలినవి అన్నీ అర్బన్ ఏరియాలకు కూడా వర్తిస్తాయి. పట్టణ ప్రాంత ప్రజలంతా ప్రభుత్వ పథకాల వల్ల లబ్ది పొందుతున్నారు. దానివల్లే ఈ ఏకగ్రీవాలు సాధ్యం అవుతున్నాయి.
14. నిజమైన రాజకీయపక్షంగా ప్రజల పార్టీగా టీడీపీ ఉన్నట్లైతే ఈరోజు ఇంత దయనీయమైన పరిస్థితిలో ఉండేది కాదు. ఎప్పుడైతే ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి టీడీపీని లాక్కున్నాక దోపిడీ ముఠాగా తయారైంది. ముఠా వ్యక్తులు కంట్రోల్ చేస్తున్న పార్టీగా టీడీపీ తయారైంది. చివరకు తను, తన కుటుంబంలా ఆ పార్టీ తయారయింది.. 2014-19 మధ్య టీడీపీ అవినీతి, అరాచకాల్లో విశ్వరూపం చూపించిన తర్వాత రాష్ట్రం చంద్రబాబను, టీడీపీని చీదరించుకొంది. చంద్రబాబుకు ప్రజలు బైబై చెప్పారు. కుప్పం పరాభవంతో బాబు పరాభవవం సంపూర్ణమైంది. ఇప్పటికైనా చంద్రబాబు ఆత్మ విమర్శ చేసుకొని ప్రజల్లోకి వెళ్లి.. చెంపలు వేసుకోవాలి. చేసినవన్నీ తప్పులు అని ఇకముందు అవన్నీ సరిదిద్దుకుంటాను అని చంద్రబాబే ఒప్పుకోవాలి. పార్టీలో ఇతరులకు కూడా విలువ ఇస్తాను. కులాలు, ప్రాంతాలు కాకుండా ప్రజల సమస్యలపైన పోరాటం చేసే పార్టీగా టీడీపీని తీర్చుదిద్దుతానని చంద్రబాబు చెప్పాలి. సంబంధంలేని మాటలు చంద్రబాబు మాట్లాడితే ఏమీ లాభం లేదు.
15. సోషల్ మీడియాలో వైయస్ఆర్సీపీ కార్యకర్తలకు కావాల్సినంత పనిని చంద్రబాబు కల్పిస్తున్నారు. అసంబద్ధంగా చంద్రబాబు మాటలు, చేష్టలు ఉంటున్నాయి. దీంతో చంద్రబాబు వ్యవహారం అంటేనే కామెడీ పుడుతోంది. చంద్రబాబు కుమారుడు లోకేశ్ కూడా విశాఖపట్నం ప్రచారానికి వెళ్తున్నారట. ఐదేళ్లలో ఎంత బాదారో తెలియదు కానీ.. మళ్లీ అందంతా తెచ్చి పెట్టి ఎన్నికల్లో మేనేజ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు. మళ్లీ కుట్రలకు పాల్పడుతున్నారు. అది దురదృష్టకరం.
మొన్నటి మాదిరిగా 43.8% అంటూ పర్సంటేజీలు చంద్రబాబు చెప్పటానికి కుదరదు. మొన్న గుర్తు మీద కాదు కాబట్టి.. అలా చెప్పారు. ఈ ఎన్నికల్లో అలా అనటానికి చంద్రబాబుకు వీల్లేదు కనుక, ఓట్లు వేయటానికి ప్రజలను బూత్లకు రానివ్వలేదని కొత్త రాగం చంద్రబాబు అందుకుంటారేమో.
16. శ్రీ జగన్ గారి నాయకత్వంలో ప్రజలకు మంచి పాలన అందుతోంది. తేడా వచ్చిందల్లా.. ప్రజలకు దూరంగా చంద్రబాబు వెళ్లిపోవటమే. మిగతావన్నీ యథాతథంగా జరుగుతున్నాయి. చంద్రబాబు అప్పుడు ఒకటి ఇప్పుడు ఒకటి చెబుతారు. చంద్రబాబుకు ఉన్న మీడియాలో ఆయన చెప్పేవన్నీ కవర్ అవుతాయి తప్ప అంతకుమించి సాధించేవి ఏమీ ఉండవు.
addComments
Post a Comment