అమరావతి (ప్రజా అమరావతి);
*ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ అధ్యక్షతన క్యాంప్ కార్యాలయంలో వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ సమావేశం.*
*హాజరైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పార్లమెంటు సభ్యులు.*
*సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి విజయసాయిరెడ్డి.*
*పార్లమెంటరీ పార్టీ నేత శ్రీ వి విజయసాయిరెడ్డి ప్రెస్మీట్ పాయింట్స్.*
1, రాబోయే పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లో పార్టీ విధి,విధానాలు, వివిధ అంశాలపై పార్టీ ఎంపీలుగా మేం అనుసరించాల్సిన తీరుపై ముఖ్యమంత్రి శ్రీ వైయస్.జగన్ గారు దిశా నిర్దేశం చేసారు.
పోలవరంతో పాటు వివిధ అంశాలను ప్రస్తావించారు. పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి రూ.55,656 కోట్ల రివైజ్డ్ కాస్ట్ ఎస్టిమేషన్కు సంబంధించి పార్లమెంటులో ప్రస్తావిస్తాం. ఈ అంశం 29 నెలలుగా పెండింగ్లో ఉంది. గతంలో ఏదైనా ప్రాజెక్టును జాతీయ ప్రాజెక్టుగా ప్రకటిస్తే కేంద్రమే ఆ ఖర్చంతా భరించే పరిస్ధితులు ఉండేవి.
పోలవరం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసిన తర్వాత కేంద్రం రీయింబర్స్ చేసే విధానాన్ని అనుసరిస్తోంది. మిగిలిన ఏ జాతీయ ప్రాజెక్టుల విషయంలో కూడా ఇలాంటి విధానాన్ని అనుసరించడం లేదు.
ఆర్ అండ్ ఆర్కు సంబంధించి దాదాపు రూ.33 వేల కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంది. దీనికి సంబందించిన నిధులు కేంద్రం సత్వరమే విడుదల చేయాలి
.
2, రాయలసీమ ఎత్తిపోతల పథకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వాన్ని, మంత్రివర్యులని రిక్వెస్టు చేయడం జరిగింది. రాయలసీమ ఎత్తిపోతల పథకం కింద ఒక్క ఎకరం కూడా అదనపు ఆయుకట్టు లేదు. ఒక్క నీటిచుక్కనూ అదనంగా మేం తరలించడం లేదు. శ్రీశైలంలో 881 అడుగుల ఉంటేనే పోతిరెడ్డిపాడు నుంచి 44వేల క్యూసెక్కుల నీటిని తరలించడానికి వీలుంటుంది. గత రెండేళ్లు తప్ప గడిచిన 20 సంవత్సరాలలో సరాసరి ఏడాదికి 25 రోజులకి మించి ఈ స్ధాయిలో నీటిమట్టం రాలేదు. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకుని 800 అడుగులలోనే ఈ ఎత్తిపోతల పథకానికి అనుమతించాల్సిందిగా కేంద్రాన్ని కోరడం జరిగింది.
3, ఈ సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సింది తెలంగాణాలో పెట్టిన అన్ని లిప్టులు కూడా 800 అడుగుల లోపలే నీటిని తీసుకునేలా ఉన్నాయి. చంద్రబాబు హయాంలో తెలంగాణాలో 5 ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టారు. 50 టీఎంసీల నీటిని నిల్వచేసేలా తెలంగాణాలో రిజర్వాయర్లును ఏర్పాటు చేసుకున్నారు. ఇది చట్టానికి పూర్తి భిన్నంగా జరిగింది. కల్వకుర్తి కెపాసిటీనీ పెంచి కడుతున్నారు. పాలమూరు రంగారెడ్డి, దిండి, కల్వకుర్తిని కానీ, ఎస్ఎల్బీసీని కానీ విస్తరిస్తున్నారు. ఇవన్నీ కూడా 800 అడుగుల లోపలే ఉన్నాయి. 796 అడుగుల వద్దే విద్యుత్ ఉత్పత్తి చేసే అవకాశం తెలంగాణాకు ఉంది. ఈ పరిస్ధితుల్లో 881 అడుగుల నీటిమట్టం కొనసాగే పరిస్దితి లేదు కాబట్టి, మన రాష్ట్ర ప్రభుత్వానికి కూడా 800 అడుగుల్లోనే ఎత్తిపోతల పథకానికి అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడం జరిగింది. మన వాటా నీటిని పోతిరెడ్డిపాడు ద్వారా తీసుకెళ్లాలనేది ఆలోచన.
4, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణా, రాయలసీమ, ఆంధ్ర అన్ని ప్రాంతాలకు నీటిని కేటాయించారు. అప్పట్లో రాయలసీమకు 144.7 టీఎంసి, కోస్తాంధ్రాకు 367.34 టీఎంసీ, తెలంగాణాకు 298.96 టీఎంసీలు కేటాయించారు. దీనికి సంబంధించి 2015న తెలంగాణా, ఏపీ జలవనరులశాఖ కార్యదర్శులు, కేంద్ర ప్రభుత్వ కార్యదర్శి ఒప్పందాలపై సంతకాలు కూడా చేశారు. దానికి పూర్తి భిన్నంగా ఈరోజు తెలంగాణా ప్రభుత్వం వ్యవహరిస్తోంది. దీనిపై సుప్రీం కోర్టుకు కూడా వెళ్లాం.
5, శ్రీశైలం కాని, నాగార్జునసాగర్ కాని, పులిచింతల కాని వీటన్నింటినీ కేంద్రం పరిధిలోకి తీసుకోవాలని కోరుతున్నాం. సిఐఎస్ఎఫ్ వంటి కేంద్ర బలగాలతో భద్రత కల్పించి, వాటిని నిర్వహంచాలని కేంద్రానికి నివేదించాం.
ఈ అంశాలన్నింటినీ రాబోయే వర్షాకాల సమావేశాల్లో మేం ప్రస్తావించబోతున్నాం.
6, వంశధార ప్రాజెక్టుకు సంబంధించి ట్రిబ్యునల్లో ఆంధ్రరాష్ట్రానికి అనుకూలంగా జడ్డిమెంట్ వచ్చింది. దాన్ని నోటిఫై చేయాల్సిందిగా కేంద్రాన్ని రానున్న సమావేశాల్లో కేంద్రప్రభుత్వాన్ని అడుగుతాం.
7, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను మేం పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. దీనికి సంబందించి మూడు ఆప్షన్స్ను వైయస్సార్సీపీ ఇచ్చింది. నష్టాల్లో ఉంది కాబట్టి ప్రైవేటీకరణ చేయాలని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. నష్టాల నుంచి లాభాల్లోకి రావాలంటే దీనికి కేపిటివ్ మైన్స్ కేటాయించాలని కోరాం. దీంతో పాటు రూ.14వేల కోట్ల రుణాన్ని ఈక్విటీ కింద పరిగణిస్తే వడ్డీ భారం తగ్గుతుందని చెప్పాం. అలా చేస్తే నష్టాల నుంచి లాభాల్లోకి వస్తుంది, ప్రైవేటీకరణ చేయాల్సిన అవసరం లేదన్నాం. ప్రైవేటీకరణ చేసే బదులుగా, దీన్ని స్టీల్ అధారిటీ ఆఫ్ ఇండియా(సెయిల్)కో, ఎన్ఎండీసీలోనే విలీనం చేస్తే బాగుంటుందన్న విషయాన్ని నొక్కి వక్కాణించి కేంద్రానికి తెలియజేశాం. పార్లమెంటులో ఇదే విషయాన్ని లేవనెత్తుతాం.
8, తెలంగాణా నుంచి 2014 నుంచి 2017 వరకు చంద్రబాబు టైంలో మన రాష్ట్రం నుంచి తెలంగాణాకు విద్యుత్ సరఫరా చేయడం జరిగంది. దాని విలువ రూ.6112 కోట్లు రూపాయలు. ఇప్పటివరకు తెలంగాణా ప్రభుత్వం ఇంతవరకు వారు వాడుకున్న విద్యుత్కు సంబందించిన బిల్లులు చెల్లించట్లేదు.
ఈ విషయాన్ని కూడా ప్రస్తావిస్తాం. గతంలో రెండు రాష్ట్రాల మధ్య ఇటువంటి వివాదం తలెత్తితే కేంద్రం జోక్యం చేసుకుని ఈ వివాదాన్ని పరిష్కరించిన సందర్భాలున్నాయి. హిమాచల్ప్రదేశ్, హర్యానా మధ్య, పశ్చిమబెంగాల్, జార్ఖండ్ మద్య తలెత్తిన వివాదాలను కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంది.
9, తెలంగాణా మనకు ఇవ్వాల్సిన ఈ రూ. 6112 కోట్లను ఇవ్వనట్లైతే.. కేంద్ర ప్రభుత్వం డివల్యూషన్లో తెలంగాణా రాష్ట్రానికి వెళ్లాల్సిన వాటి నుంచి మినహాయించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇచ్చే అవకాశం కేంద్రప్రభుత్వానికి ఉంది. అది కూడా పరిశీలించమని మేం కోరడం జరుగుతుంది.
10, జాతీయ ఆహార భద్రత చట్టంలో కొన్ని అసమానతలు ఉన్నాయి. రాష్ట్రం విడిపోయినప్పుడు ఆహారభద్రత చట్టంలో అసమానతల వల్ల తక్కువ రేషన్ కార్డులు వచ్చాయి.
రేషన్ కార్డులు కేంద్రం ఎన్నైతే ఆమోదించిందో అంతవరకు మాత్రమే రేషన్ సబ్సిడీ కేంద్రం ఇస్తుంది. మిగిలినది రాష్ట్రం భరిస్తుంది. దీనికి ప్రామాణికాలు రెండు తీసుకున్నారు. రాష్ట్ర విభజన సందర్భంలో తీసుకున్న పర్సెంటేజ్ ప్రాతిపదికన రేషన్ కార్డులు విడదీశారు.
దాని ఆధారంగానే సబ్సిడీ ఇస్తున్నారు. ఈ విషయంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు గతంలో ఢిల్లీకి వెళ్లినప్పుడు కేంద్రమంత్రి గోయల్గారిని కలిసి ఈ విషయాన్ని ప్రస్తావించారు.
మిగిలిన రాష్ట్రాలతో పోల్చి చూస్తే ఏపీకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుస్తుంది. రూరల్ ఏరియాలో కర్ణాటకలో 76.04 శాతం, గుజరాత్లో 76.64 శాతం, మహారాష్ట్రలో 76.32 శాతం కవర్అవుతున్నారు. మన రాష్ట్రానికి వచ్చేటప్పటికి కేవలం 60.96 శాతం మాత్రమే కవర్ అవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్కి వచ్చేటప్పటికి కేవలం 60 శాతానికి పరిమితం చేస్తుంది.ఈ అసమానతలను కేంద్రం దృష్టికి తీసుకొచ్చేలా ఈ సమావేశాల్లో ప్రస్తావించడం జరుగుతుంది. ఆంధ్రరాష్ట్రానికి జరుగుతున్న అన్యాయాన్ని అసమానతలను తొలగించడం ద్వారా న్యాయం చేయమని కోరుతాం.
11, రేషన్ బియ్యానికి సంబంధించి రూ.5056 కోట్ల రూపాయలు బకాయిలు ఉన్నాయి. ఈ బకాయిలు రాష్ట్రానికి చెల్లించాల్సిందిగా మేం పార్లమెంటులో డిమాండ్ చేస్తాం.
12, దిశ చట్టం చాలా కాలంగా కేంద్రం దగ్గర పెండింగ్లో ఉంది. దాన్ని క్లియర్ చేయాల్సిందిగా మేం విజ్ఞప్తి చేస్తాం.
13, రాష్ట్రంలో 17వేల లేఅవుట్లలో రాష్ట్ర ప్రభుత్వం ఇళ్ల నిర్మాణం చేపడుతుంది. ఈ లే అవుట్స్లో మౌలిక సదుపాయాలు కల్పించడం కోసం తగిన సహాయం చేయాల్సిందిగా సమావేశాల్లో విజ్ఞప్తి చేస్తాం.
14, ఉపాధిహామీ పథకం కింద రూ.6750 కోట్లు రావాల్సి ఉంది. దీనిపైన దృష్టి పెట్టి ఈ బకాయిలు ఇప్పించాల్సిందిగా మేం డిమాండ్ చేస్తాం.
15, ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ కింద ట్రైబల్ యూనివర్సిటీ మంజూరు చేయడం జరిగింది. దానికి భూమిని గత ప్రభుత్వం గిరిజనేతర ప్రాంతంలో కేటాయించింది. గిరిజన యూనివర్సిటీ గిరిజన ప్రాంతంలోనే ఉండాలన్న ఉద్దేశ్యంతో ఎస్.కోట నియోజకవర్గం నుంచి సాలూరు నియోజకవర్గానికి తరలించి అక్కడ రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయించింది. దాన్ని ఆమోదించి గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాల్సిందిగా ఈ సమావేశాల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తాం.
16, ఆంధ్రప్రదేశ్ విభజన చట్టానికి సంబంధించి గతంలో ఇచ్చిన హామీల్లో అమలుకు నోచుకోని వాటిని ప్రస్తావించి, వాటన్నింటిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి అమలయ్యేలా చేయాలని నిర్ణయించుకున్నాం.
17, కోవిడ్ సమయంలో ఏపీ ఏ విధంగా చర్యలు తీసుకున్నదీ, దేశంలోనే అత్యుత్తమ సేవలు ఎలా అందించిందీ, దేశంలో నమోదయిన మరణాల్లో అతి స్వల్పంగా నమోదయిన రాష్ట్రాలలో రెండో స్ధానంలో ఏపీ ఉందనే విషయాన్ని ప్రస్తావిస్తాం. 12 సార్లు డోర్ టూ డోర్ సర్వే చేసి ప్రతీ కుటుంబంలో ఎవరైనా ఫీవర్ కానీ ఏదైనా అనారోగ్య సూచనలు ఉన్నా వారందరికీ ఉచితంగా టెస్ట్లు చేయడం జరిగింది. వారికే కాకుండా ఎవరైనా టెస్ట్ చేయించుకోవాలంటే వారికీ టెస్ట్లు చేయడం జరిగింది. కరోనా పేషెంట్లను ఆరోగ్యశ్రీ కింద కవర్ చేసి ట్రీట్మెంట్ విషయంలో దేశంలోనే మొట్టమొదటి స్ధానంగా రాష్ట్రం అత్యున్నతమైన స్ధాయిలో ఉంది.
18, కేంద్రం 28 పీఎస్ఏ ప్లాంట్లు ఇస్తే మనం వీటితో కలుపుకుని 134 చోట్ల రాష్ట్ర ప్రభుత్వం పెడుతుంది. ఇవికాకుండా క్రయోజనిక్ ట్యాంకర్లు కూడా కొనుగోలు చేశాం. మొదటి వేవ్లో ఇంచుమించుగా ఏపీ రూ. 20 వేల కోట్లు నష్టపోయింది, కోవిడ్ నివారణకు రాష్ట్రప్రభుత్వం ఇంచుమించు రూ. 7 వేల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. ఇక మూడో వేవ్ వస్తుందంటున్నారు, వచ్చినా రాకపోయినా ప్రభుత్వం పూర్తిగా సమాయత్తమై ఎదుర్కునే పరిస్ధితి ఉంది.
19, నెలకు రూ. 400 కోట్ల రేషన్ను ఉచితంగా ఇవ్వడానికి రాష్ట్రప్రభుత్వం ప్రతీ నెలా ఖర్చు చేస్తుంది.
కేంద్రం కలెక్ట్ చేసే పన్నుల్లో రాష్ట్రం వాటా 42 శాతం. డెవల్యూషన్ ఫండ్స్ ఏడాదికి ఏడాదికి తగ్గుతూ వస్తున్నాయి, దానిని ఎందుకు కేంద్రం ఈ రోజు అమలుచేసే పరిస్ధితుల్లో లేదు అన్నదానిపై కూలంకుషంగా విశ్లేషణ చేసి దానిపై కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయాలని నిర్ణయించుకున్నాం
ఈ వాస్తవాలు అన్నీ కూడా పార్లమెంట్ ముందు పెట్టి ప్రభుత్వాన్ని నిలదీయాలి అని మేం చర్చించుకున్నాం. ప్రతీ రోజూ పార్లమెంట్ సమావేశాలకు ముందే మేం సమావేశమై ఆ రోజు పార్లమెంట్లో ఏఏ అంశాలు ఎలా ప్రస్తావించాలి అని చర్చించుకుంటాం
*మీడియా ప్రశ్నలకు సమాధానంగా*...
పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు 4 వారాలు జరుగుతాయి. మాకు కేటాయించిన సమయంలోనే ఈ అంశాలన్నీ కూడా మేం ప్రస్తావిస్తాం. ప్రత్యేకహోదా కోసం మొదటి నుంచి హోదానే కావాలి తప్ప ప్రత్యామ్నాయం లేదని మేం మొదటి నుంచి చెబుతున్నాం. చంద్రబాబు హోదాని కేంద్రానికి అమ్మేశాడు, రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను తాకట్టు పెట్టాడు. ప్రత్యేక హోదా అవసరం లేదు తనకు ఒక ప్యాకేజి ఇస్తే చాలని అతను ముందుకెళ్ళాడు. కాబట్టే ప్రత్యేకహోదాని కేంద్రం జాప్యం చేస్తుంది.
సీఎంగారు ప్రతీ సారి ఢిల్లీకి వెళ్ళినప్పుడే కాదు ఇంచుమించుగా 12 సందర్భాల్లో ఈ విషయాన్ని ప్రధానమంత్రి గారికి, హోంమంత్రి గారి దృష్టికి తీసుకు వెళ్ళడం జరిగింది. ఎటువంటి పరిస్ధితుల్లో స్పెషల్ కేటగిరి స్టేటస్ విషయంలో రాష్ట్రప్రభుత్వం రాజీపడే సమస్య లేదు.
నరసాపురం ఎంపీ అనే ఒక వ్యక్తి గురించి సీఎం గారు చర్చించాల్సిన అంశమా అని భావిస్తున్నారా, ఒక విలువల్లేని వ్యక్తి ఏదో మాట్లాడితే అది మా స్ధాయిలో మేం చూసుకోగలం. సీఎంగారితో చర్చించాల్సినంత పెద్ద అంశం కాదు.
ఒకటి రెండు సందర్భాలలో కోవిడ్ కారణంగా ఏపీ సీఎంగారు తెలంగాణ సీఎం గారు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గారు వర్చువల్ కాన్ఫరెన్స్లో మాట్లాడుకోవడం జరిగింది. చర్చలు అయితే జరుగుతున్నాయి, ముగ్గురు కలిసి కూర్చుని మాట్లాడుకోకపోవచ్చు కానీ చర్చలు జరగడం లేదన్న విషయం వాస్తవం కాదు.
addComments
Post a Comment