రాష్ట్ర ముఖ్యమంత్రికి... కడప ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం !*



*రాష్ట్ర ముఖ్యమంత్రికి... కడప ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం !*



కడప, సెప్టెంబర్ 1 (ప్రజా అమరావతి) : రెండు రోజుల జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం సాయంత్రం కడప విమానాశ్రయం చేరుకున్న గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధుల నుండి ఘన స్వాగతం లభించింది.  


ఈ నెల 2వ తేదీన దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం.. బుధవారం సాయంత్రం గన్నవరం విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సా. 5.10 గంటలకు కడప విమానాశ్రయం చేరుకున్నారు. ముఖ్యమంత్రితో పాటుతో పాటు ఆయన సతీమణి వైఎస్ భారతి, ముఖ్య కార్యదర్శి ధనుంజయ రెడ్డి, కృష్ణ మోహన్, సహాయ వ్యక్తిగత కార్యదర్శి నాగేశ్వర రెడ్డి వున్నారు.


ఈ సందర్భంగా.. రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా ఇన్చార్జి మంత్రి వర్యులు ఆదిమూలపు సురేష్, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు, కర్నూల్ డిఐజి వెంకట్రామిరెడ్డి, జిల్లా ఎస్పీ అన్బురాజన్ లు ముఖ్యమంత్రికి.. పుష్ప గృచ్చం అందజేసి స్వాగతం పలికారు.


అనంతరం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాయంత్రం 5.35 గంటలకు హెలికాప్టర్ లో ఇడుపులపాయ ఎస్టేట్ కు బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రి తోపాటు రాష్ట్ర ఉపముఖ్యమంత్రి ఎస్.బి.అంజాద్ బాషా, జిల్లా కలెక్టర్ వి.విజయ్ రామరాజు లు ఇడుపులపాయకు హెలికాప్టర్ లో బయలుదేరి వెళ్లారు.


ముఖ్యమంత్రిని కలిసిన వారిలో.. ఎమ్మెల్సీలు సి.రామచంద్రయ్య, కత్తి నరసింహారెడ్డి, రమేష్ యాదవ్, కమలాపురం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి,  జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి మాజీ ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి, దివంగత బద్వేలు ఎమ్మెల్యే డా.వెంకట సుబ్బయ్య సతీమణి డా.సుధా, తదితర నాయకులు వున్నారు.


ముఖ్యమంత్రికి స్వాగతం పలికిన వారిలో.. పద్మశాలీ కార్పొరేష న్ చైర్మెన్ విజయలక్ష్మి, దేకుల కార్పొరేష న్ చైర్మెన్ ఫకుర్బిన్, సగర ఉప్పర కార్పొరేష న్ చైర్మెన్ గానుగపెంట రమణమ్మ, యాదవ కార్పొరేష న్ చైర్మెన్ హరీష్, సోషల్ వెల్ఫేర్ కార్పొరేష న్ చైర్మెన్ పులి సునీల్, నాయీబ్రాహ్మణ కార్పొరేష న్ చైర్మెన్ యానాదయ్య, అడా ఛైర్మెన్ గురుమోహన్ తదితర రాష్ట్ర ప్రభుత్వ నామినేటెడ్ కార్పొరేషన్ల చైర్మన్లు వున్నారు.


ఈ కార్యక్రమంలో.. జాయింట్ కలెక్టర్ గౌతమి, సబ్ కలెక్టర్లు పృద్వితేజ్, కేతన్ గార్గ్, సహాయ కలెక్టర్ కార్తీక్, కడప నగరపాలక సంస్థ కమీషనర్ రంగస్వామి తదితర జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.*


------///---------

సహాయ సంచాలకులు, స.పౌ.శాఖ, కడప వారిచే విడుదల

Comments