అక్టోబరు 20న రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన



ఏలూరు / కొవ్వూరు / జంగారెడ్డిగూడెం (ప్రజా అమరావతి); 

 


అక్టోబరు 20న రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటన



ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎస్సి కమిషన్ ఛైర్మన్ ఎమ్. విక్టర్ ప్రసాద్ గారు అక్టోబర్ 20 వ తేదీ బుధవారం  ఉదయం 10 గంటలకు విజయవాడ నుంచి బయలుదేరి మ. 12.30 కి కొవ్వూరు చేరుకుంటారని ఏపీరాష్ట్ర  షెడ్యూల్డ్ తరగతుల కమిషన్ కార్యాలయం మంగళవారం పర్యటన సమాచారాన్ని తెలియపరిచారు.  అనంతరం మ.2.00 గంటల వరకు అధికారులతో సమావేశం నిర్వహించి, స్థానికంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొననున్నారు. 



తదుపరి కొవ్వూరు నుంచి బయలుదేరి జంగారెడ్డిగూడెం మండలం లోని  శ్రీనివాసపురం గ్రామం కి మ.3 కి చేరుకుంటారు. మ 3 నుంచి 6 గంటల వరకు శ్రీనివాసపురం గ్రామంలో ని ఎమ్. రాజు మృతి కి నివాళులు అర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించడం జరుగుతుంది. అక్కడ నుండి సా.6 కి బయలుదేరి రాత్రి 8 గంటలకు మచిలీపట్నం చేరుకుంటారు. 





.

Comments