ఆర్డీవో కార్యాలయంలో మహాత్మునికి ఘన నివాళి:



కొవ్వూరు  (ప్రజా అమరావతి);


శనివారం స్థానిక  కొవ్వూరు పురపాలక సంఘం కార్యాలయంలో చైర్ పర్సన్ బావన రత్న కుమారి జాతిపిత మహాత్మా గాంధీ 153 వ జన్మదినాన్ని పురస్కరించుకుని ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అహింస, శాంతి మార్గాలను ప్రపంచానికి చాటిన మహోన్నత వ్యక్తి, ఆయన జన్మదినాన్ని స్ఫూర్తి గా తీసుకుని స్వచ్ఛ కొవ్వూరు ద్వారా పరిశుభ్రంగా తీర్చిదిద్దుతామని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ కమిషనర్ కేటి సుధాకర్, కౌన్సిలర్లు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు.


ఆర్డీవో కార్యాలయంలో మహాత్మునికి ఘన నివాళి: 



శనివారం కొవ్వూరు రెవెన్యూ డివిజనల్ కార్యాలయంలోజాతిపిత  మహాత్మా గాంధీ విగ్రహానికి కార్యాలయ పరిపాలనాధికారి జి ఎస్ ఎస్ జవహర్ బాజీ,  ఇతర సిబ్బంది పూలమాలలు వేసి నివాళులర్పించారు.






Comments