శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
, విజయవాడ (ప్రజా అమరావతి): శ్రీ కలిదిండి కాశీ విశ్వేశ్వర రావు మరియు నాగజ్యోతి(కృష్ణా నగర్, విజయవాడ)గారి పేరు మీద ప్రతిరోజు అన్నదానం జరుపుటకు గాను నార్సింగి, హైదరాబాద్ లోని HD లాబ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు శ్రీ అమ్మవారి ఆలయము నందు ప్రతిరోజూ జరుగు నిత్య అన్నదానము నిమిత్తం రూ.1,00,000/-లు ఆలయ అధికారులను కలిసి దేవస్థానమునకు విరాలముగా అందజేసినారు. అనంతరం ఆలయ అధికారులు దాత కుటుంబంనకు శ్రీ అమ్మవారి దర్శనము కల్పించిన అనంతరము ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి శ్రీ అమ్మవారి ప్రసాదములు, చిత్రపటం అందజేసినారు.
addComments
Post a Comment