జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు



కొవ్వూరు (ప్రజా అమరావతి);  



కొవ్వూరు డివిజన్ పరిధిలోని పంచాయతీ ఎన్నికల్లో భాగంగా కాపవరం, మల్లేశ్వరం గ్రామాల్లో రెండు వార్డు లకి నవంబర్ 14 ఉదయం 7 నుంచి మ. 1 గంట వరకు ఓటింగ్ ప్రక్రియ ప్రారంభం కానున్నదని  డివిజనల్ పంచాయతీ అధికారి భమిడి శివ మూర్తి మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు. జిల్లా కలెక్టర్ వారి ఆదేశాల మేరకు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. పోలింగ్ సిబ్బంది శనివారం ఆయా పోలింగ్ కేంద్రాల కు చేరుకుంటారని తెలిపారు.



కొవ్వూరు లో కాపవరం గ్రామంలో 9వ వార్డుకి ఇద్దరు అభ్యర్థులు  గోతం మేరీ ఝాన్సీభాయ్, మొహమ్మద్ ఫసి ఉల్లా బేగ్ లు పోటీ లో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 213 కాగా పురుషులు 111, మహిళలు 102 మంది ఉన్నారు. ఎంపిపి స్కూల్ లో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. 


పెరవలి మండలం మల్లేశ్వరం గ్రామం 8 వ వార్డు ఎన్నికకు ఇద్దరు అభ్యర్థులు కె.సాంబశివరావు, జీ. నాగార్జున పోటీలో ఉన్నారు. ఇక్కడ మొత్తం ఓట్లు 213 కాగా పురుషులు 108, మహిళలు 105 మంది ఉన్నారు. పోలింగ్ కేంద్రం గ్రామ పంచాయతీ కమ్యూనిటీ హాల్ ఉత్తరం గదిలో ఓటింగ్ ప్రక్రియ కి ఏర్పాట్లు పూర్తి చేశారు.


14 వ తేదీన ఓటింగ్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత మ. 2 గంటల నుంచి ఓట్లు లెక్కింపు నిర్వహించి ఫలితాలు వెల్లడించడం జరుగుతుందన్నారు.



Comments