దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆర్థిక సలహాదారుగా
బాధ్యతలు స్వీకరించిన శ్రీ ఎ.వెంకట రెడ్డి
శ్రీ ఎ. వెంకట రెడ్డి దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా నేడు అనగా 30 నవంబర్ 2021 తేదీన బాధ్యతలు చేపట్టారు. ఆయన 1987 ఐఆర్ఏఎస్ (ఇండియన్ రైల్వేస్ అకౌంట్స్ సర్వీస్) బ్యాచ్కు చెందిన అధికారి. ఆయన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఎమ్ఎస్సీ స్టాటిస్టిక్స్ పూర్తి చేశారు.
శ్రీ ఎ.వెంకట రెడ్డి 1989లో భారతీయ రైల్వేలో చేరారు. పిమ్మట ఆయన ఆగ్నేయ రైల్వే పరిధిలోని విశాఖపట్నంలో మరియు దక్షిణ మధ్య రైల్వే పరిధిలో వివిధ స్థాయిలలో విధులు నిర్వహించారు. ఆయన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో విద్యుత్ శాఖలో ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీఎస్పీడీసీఎల్) ఫైనాన్స్ డైరెక్టర్గా కూడా బాధ్యతలు నిర్వహించారు. అనంతరం ఆయన డెడికేటడ్ ఫ్రెయిట్ కారిడార్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్లో గ్రూప్ జనరల్ మేనేజర్/ఫైనాన్స్లో మరియు ఆగ్నేయ మధ్య రైల్వేలో ప్రిన్సిపల్ ఫైనాన్షియల్ అడ్వైజర్గా విధులు నిర్వహించారు.
ఆయన ఇంతకుపూర్వం దక్షిణ మధ్య రైల్వేలోని నిర్మాణ విభాగంలో ప్రధాన ఆర్థిక సలహాదారులుగా 2019 నవంబర్ 20 తేదీన బాధ్యతలు చేపట్టారు. ఇప్పుడు ఆయన దక్షిణ మధ్య రైల్వే ప్రధాన ఆర్థిక సలహాదారులుగా బాధ్యతలు స్వీకరించారు.
addComments
Post a Comment