అక్రమ మైనింగ్ వల్లే శాంతిపురం క్వారీలో పేలుళ్లు : తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు
అమరావతి (ప్రజా అమరావతి): చిత్తూరు జిల్లా శాంతిపురం మండలం సోమపురం క్వారీలో బుధవారం జరిగిన పేలుడు ఘటనను తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు తీవ్రంగా ఖండించారు. క్వారీల్లో భద్రతా ప్రమాణాలు పాటించకుండా అక్రమ క్వారీయింగ్ నిర్వహించడం వల్లే తరచూ ఇటువంటి ఘటనలు సంభవిస్తున్నాయని ఆయన అన్నారు. సోమవరం క్వారీలో నిబంధనలు పాటించకపోవడం వల్లే ఈ ప్రమాదం చోటుచేసుకుందని ఆరోపించారు.
రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో అక్రమ మైనింగ్ చేస్తున్న వైసీపీ నేతల ధన దాహానికి కార్మికులు బలవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సోమవరం పేలుళ్లలో మృతిచెందిన గోవిందప్పకు చంద్రబాబునాయుడు సంతాపం వ్యక్తం చేస్తూ... బాధిత కుటుంబానికి ప్రభుత్వం తక్షణమే రూ.50లక్షల రూపాయల నష్టపరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. పేలుళ్లలో గాయపడిన క్షతగాత్రులకు ప్రభుత్వం తరపున మెరుగైన వైద్య సహాయంతో పాటు పరిహారం అందించాలని విజ్జప్తి చేశారు.
addComments
Post a Comment