రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదు


నెల్లూరు, జూలై 5 (ప్రజా అమరావతి) : రాష్ట్రంలో ఏ ఒక్క విద్యార్థి కూడా ఆర్థిక ఇబ్బందులతో చదువుకు దూరం కాకూడదని


, విద్యార్థులందరూ బాగా చదువుకుని ఉన్నతంగా స్థిరపడాలని ఆలోచన చేస్తూ అనేక సంక్షేమ పథకాల ద్వారా విద్యాభివృద్ధికి శ్రీకారం చుట్టిన శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండడం విద్యార్థులకు ఓ వరం లాంటిదని రాష్ట్ర వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. 

 మంగళవారం ఉదయం పొదలకూరు డిఎన్ఆర్ జడ్పీ ఉన్నత పాఠశాలలో  నాడు నేడు పథకం పనుల ప్రారంభోత్సవం, శంకుస్థాపనలు, మూడో విడత జగనన్న విద్యా కానుక పంపిణీ కార్యక్రమాలకు మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేశారు. 

 తొలుత పొదలకూరు కు విచ్చేసిన మంత్రికి విద్యార్థులు, ప్రజా ప్రతినిధులు పూలజల్లులతో ఘన స్వాగతం పలుకగా, రూ. 4.38 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను మంత్రి ఆవిష్కరించారు. తదుపరి పాఠశాలలోని సరస్వతి దేవి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి అదనపు తరగతి గదుల నిర్మాణానికి భూమి పూజ చేశారు. 

 అనంతరం జగనన్న విద్యా కానుక మూడో విడత పంపిణీ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో మంత్రి శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ చిన్నచిన్న సమస్యలతో విద్యార్థులు విద్యకు దూరం కాకూడదని, గతంలో ఎన్నడూ ఏ ప్రభుత్వాలు చేయలేని విధంగా ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి జగనన్న విద్యావ్యవస్థలో విప్లవాత్మకమైన మార్పులు తీసుకొచ్చారన్నారు. సాధారణంగా ముఖ్యమంత్రులు చాలా బిజీగా ఉంటారని, అంత బిజీ అయినా కూడా మన ముఖ్యమంత్రి విద్యార్థుల బాగోగుల కోసం ఆలోచిస్తూ ఉంటారని చెప్పారు. తల్లిదండ్రులకు విద్యార్థుల పుస్తక సామగ్రి కొనుగోలు చేయడం భారం కాకూడదనే గొప్ప ఉద్దేశంతో జగనన్న విద్యా కానుక ప్రవేశపెట్టారని, ఈ విద్య కానుక కిట్ లో మూడు జతల యూనిఫామ్, స్కూల్ బ్యాగ్, నోట్ బుక్స్, టెక్స్ట్ బుక్స్, బూట్లు, రెండు జత సాక్స్ లు,బెల్ట్, డిక్షనరీలు ఉంటాయని, ఇవి విద్యార్థులకు ఎంతో ఉపయోగపడతాయన్నారు. ఇప్పటికే రెండు విడతలు విజయవంతంగా జగనన్న విద్యా కానుక కిట్లు అందజేశామని, జిల్లాలో మూడో విడత  42 కోట్ల రూపాయల వ్యయంతో 262436 మంది విద్యార్థులకు  నేటి నుంచి పంపిణీ చేయనున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో గడిచిన మూడేళ్లలో 2368 కోట్ల రూపాయలను ఒక విద్యా కానుక పథకానికి ముఖ్యమంత్రి ఖర్చు చేశారన్నారు. విద్యావ్యవస్థలో ముఖ్యమంత్రి అమలు చేస్తున్న అమ్మ ఒడి, నాడు నేడు, జగనన్న విద్యా కానుక వంటి అనేక సంక్షేమ పథకాలతో 2020-21 సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలల్లో  42 లక్షలు ఉన్న విద్యార్థుల సంఖ్య, ప్రస్తుతం 47 లక్షల 40 వేలకు చేరిందని, అంటే సుమారు 5 లక్షల పైగా విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిందన్నారు. రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య గతంకంటే గణనీయంగా పెరుగుతోందని, ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని మంత్రి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి అధికారంలోకి వచ్చిన తర్వాత అనేక సంక్షేమ పథకాలను పారదర్శకంగా, ఎటువంటి అవినీతికి తావులేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంతృప్తికర స్థాయిలో అందజేస్తున్నారని చెప్పారు.  విదేశీ విద్య తమ ప్రభుత్వం అందించడం లేదని, బైజుస్ తో ఒప్పందం చేసుకోవడంపై ప్రతిపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తున్నాయని మండిపడ్డారు. వాస్తవంగా విచారిస్తే గత ప్రభుత్వం అమలు చేసిన విదేశీ విద్య ఓ బూటకమని, గతంలో విదేశీ విద్య అభ్యసించినట్లు జాబితాలో ఉన్న విద్యార్థులు అసలు ఇప్పుడు ఎక్కడున్నారో తెలియడం లేదని, దొంగ పేర్లతో ప్రభుత్వ డబ్బును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ఇలా కొంతమందికే పరిమితం కాకుండా విదేశాల్లో ఉన్న యూనివర్సిటీల్లో ఎవరైతే ప్రవేశ పరీక్షల్లో ఉత్తీర్ణులై, చదువుకునేందుకు ఆసక్తి చూపుతారు వారందరికీ విదేశీ విద్యను అందించేందుకు ముఖ్యమంత్రి ముందుకు వచ్చినట్లు చెప్పారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని లక్ష్యంతోనే బైజుస్ తో ఒప్పందం చేసుకున్నట్లు చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి అన్ని సంక్షేమ పథకాలు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి పనిచేస్తున్నారని కొనియాడారు. త్వరలోనే మండలానికి 2 జూనియర్ కళాశాలలు, ఒక డిగ్రీ కళాశాలను ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారని, ఈ క్రమంలో పొదలకూరు జడ్పీ బాలికల ఉన్నత పాఠశాలను జూనియర్ కళాశాల గా, పొదలకూరు జూనియర్ కళాశాలను డిగ్రీ కళాశాల గా అప్ గ్రేడ్ చేసేందుకు చర్యలు చేపట్టినట్లు చెప్పారు. 

 అనంతరం విద్యార్థులకు విద్యా కానుక కిట్లను మంత్రి చేతుల మీదుగా పంపిణీ చేశారు. 

తొలుత విద్యార్థులు ప్రదర్శించిన నృత్య ప్రదర్శనలు ఆహుతులను అలరించగా, ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు మంత్రిని ఘనంగా సత్కరించారు. చివరిగా పదో తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులను మంత్రి జ్ఞాపిక అందజేసి ఘనంగా సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ఉదయగిరి శాసనసభ్యులు శ్రీ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి,డి ఆర్ ఓ శ్రీమతి వెంకట నారాయణమ్మ, జిల్లా విద్యాశాఖ అధికారి శ్రీ పి రమేష్, సమగ్ర శిక్ష అసిస్టెంట్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ శ్రీమతి ఉషారాణి,  ఆర్డిఓ  పి కొండయ్య, ఎంపీడీవో నగేష్ కుమారి, ఎంఈఓ సుధీర్ బాబు, జడ్పిటిసి తెనాలి నిర్మలమ్మ, కందుకూరు సుబ్బరాయుడు, సర్పంచ్ మల్లికా చిట్టెమ్మ, జడ్పీ హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు శ్రీ సనత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 


లబ్ధిదారుల అభిప్రాయాలు

.............................. 

1). నక్కాకరుణమ్మ భర్త తిరుపతయ్య

- నాకు ఇద్దరు ఆడ పిల్లలు. నేను పొదలకూరు పంచాయతీలో పారిశుద్ధ్య కార్మికురాలిని. నా భర్త కూలి పనులు చేస్తుంటాడు. మేము మాకు వచ్చే చాలీచాలని డబ్బులతో గతంలో మా పిల్లల చదువులకు అనేక ఇబ్బందులు పడేవారిమి. ఈరోజు ఆ పరిస్థితి లేదు. మేము మా ఇద్దరి ఆడపిల్లలను బాగా చదివించుకుంటున్నాము. మాకు జగనన్న అమ్మ ఒడి, విద్యా కానుక ఎంతో ఉపయోగపడుతున్నాయి. 


2). కేశాని రజిని భర్త వెంకటేశ్వర్లు

- మాకు ఒకే ఒక పాప. నా భర్త వ్యవసాయ పనులు చేస్తుంటాడు. మాకు జగనన్న దయవల్ల అమ్మ ఒడి, విద్యా కానుక ప్రతి సంవత్సరం వస్తున్నాయి. దీంతో మాకు కాస్త భరోసాగా ఉంది. ఎటువంటి ఖర్చు లేకుండా పూర్తి ఉచితంగా పుస్తకాలు, బ్యాగు, యూనిఫామ్ అందించి మంచి చదువు చెబుతున్నారు. పాఠశాలలు కూడా చాలా పరిశుభ్రంగా ఉన్నాయి. 


Comments
Popular posts
2024లో గుడివాడను గెల్చుకోవడమే లక్ష్యంగా వెనిగండ్ల వ్యూహం.
Image
ఎమ్మెల్యే కొడాలి నానికి టిడ్కో గృహాలతో ఎటువంటి సంబంధం లేదు.
Image
రాష్ట్రంలో యువతకు జాబ్ రావాలంటే మళ్ళీ బాబు రావాలి.
Image
భవిష్యత్ గ్యారెంటీపై టీడీపీ మినీ మేనిఫెస్టోతో ప్రజల్లోకి వెళ్లిన వెనిగండ్ల.
Image
#దక్షిణదేశసంస్థానములచరిత్ర - 10 : #తెలుగువారిసంస్థానాలు - #జటప్రోలు (#కొల్లాపూరు) #సంస్థానము, మహబూబ్ నగర్ జిల్లా (తెలంగాణ రాష్ట్రం) - తెలంగాణ మైసూర్ ''కొల్లాపూర్" సంస్థాన ప్రభువులు (సంస్థానాధీశులు) పద్మనాయక రాచవెలమ వంశస్థులగు “#సురభివారు” (మొదటి భాగం)... కొల్లాపురం సంస్థానం పాలమూరు జిల్లాలో, నల్లమల అటవీ క్షేత్రంలో కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉంది. ఈ సంస్థానాధీశులు 'కొల్లాపూరును' రాజధానిగా చేసుకొని పరిపాలించడం వల్ల ఈ సంస్థానాన్ని "కొల్లాపూరు సంస్థానమని" కూడా వ్యవహరిస్తారు. వీరు మొదట #జటప్రోలు రాజధానిగా పాలించి, తర్వాత 'కొల్లాపూర్, పెంట్లవెల్లి' రాజధానులుగా పాలించారు. 'నల్లమల ప్రాంతంలో' రెండవ శతాబ్దానికి చెందిన 'సోమేశ్వర, సంగమేశ్వర, మల్లేశ్వర' ఆలయాలున్నాయి. వీటికి ఎంతో గణనీయమైన పురావస్తు ప్రాముఖ్యత ఉంది. ఈ ఆలయాలు పదిహేను వందల ఏళ్ల క్రితం నిర్మించారు. వెడల్పయిన రహదారులు, దట్టమైన చెట్లతో ఈ ప్రాంతం నిండి ఉండడంతో కొల్లాపూర్ ను ''#తెలంగాణమైసూర్'' గా కూడా ప్రజలు పిలుస్తారు. ఈ సంస్థానం మొదట "విజయనగర చక్రవర్తులకు, చివరి నిజాం ప్రభువుకు" సామంత రాజ్యముగా వ్యవహరించబడింది. భారత దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత, ‘తెలంగాణలోని సంస్థానాలు’ భారత్ లో విలీనం అయ్యేవరకు ఈ సంస్థానం సివిల్ మెజిస్ట్రేట్ అధికారాలతో ఉంది. ‘నిజాం ప్రభువులు’ తమ ఆధీనంలో ఉన్న సంస్థానాలకు సర్వాధికారాలు ఇవ్వటం వల్ల ఆయా సంస్థానాలు స్వేచ్ఛగా పరిపాలన సాగించినాయి. 'నిజాం భూభాగం' బ్రిటిష్ రాజ్యంలో ఓ భాగమైతే 'సంస్థానాలు' నైజాం రాజ్యంలో చిన్న చిన్న 'రాజ్యాలుగా' వ్యవహరించబడ్డాయి. అలా వ్యవహరించబడిన సంస్థానాలలో #కొల్లాపురంసంస్థానం ఒకటి. ఇక్కడి సువిశాలమైన కోట ప్రాంగణంలో కొలువుదీరిన సుందరమైన రాజభవనాలు నాటి సంస్థానాధీశుల పాలనా వైభవాన్ని చాటు తున్నాయి. 'ఆలయాల అభివృద్ధి, ఆధ్యాత్మిక కృషికి' తోడు వివిధ రంగాల కవిపండిత సాహిత్య, కళాపోషణకూ వారు అధిక ప్రాధాన్యమిచ్చారు. అన్నింటికంటే ముఖ్యంగా ప్రజావసరాలకు అనుగుణమైన సౌకర్యాలను కల్పించడం ద్వారా ‘కొల్లాపూర్ సురభి సంస్థానాధీశులు’ జనరంజకమైన పాలన కొనసాగించారు. ఈ ప్రాంతాన్ని కేంద్రంగా చేసుకుని కొన్ని శతాబ్దాల పాటు తమ సంస్థానాన్ని ఏలారు ‘#సురభిరాజులవారసులు’. ఈ సంస్థానం వైశాల్యం 191 చ.మైళ్ళు. ఇందులో 30 వేల జనాభా దాదాపు 90 గ్రామాలు ఉండేవి. వార్షిక ఆదాయం ఇంచుమించుగా రెండు లక్షలు. ఈ సంస్థానం కృష్ణానది పరీవాహక ప్రాంతంలో ఉన్నది. పూర్వం జటప్రోలు సంస్థానానికి 'కొల్లాపురం' రాజధాని. ‘#సురభిలక్ష్మారాయబహద్దూర్’ వరకు అంటే సుమారు క్రీ.శ.1840 వరకు రాజధాని 'జటప్రోలు' గా ఉండేది. వీరి కాలం నుండి రాజధాని 'కొల్లాపూర్' కు మారింది. అప్పటి నుంచి 'కొల్లాపురం సంస్థానం' గా పేరొంది, ఈ ప్రాంతాన్ని పరిపాలించిన వారంతా 'కొల్లాపురం సంస్థాన ప్రభువులుగా' ప్రసిద్ధులయ్యారు. వీరు మొదట్లో 'పెంటవెల్లి' రాజధానిగా పాలన సాగించారు. #సురభివంశస్థులపూర్వీకులు 'దేవరకొండ' (నల్గొండ) ప్రాంతం నుంచి ఇక్కడికి వలస వచ్చారని చరిత్రకారుల అభిప్రాయం. ఈ సంస్థానాధీశులు మొదట జటప్రోలులో కోటను నిర్మించుకొని నిజాం ప్రభువులకు సామంతులుగా ఉన్నారు. ఇక్కడి సువిశాలమైన కోటలు, చక్కని భవనాలు సురభి సంస్థానాధీశుల కళాభిరుచిని చాటుతున్నాయి. నిజాం కాలంలో కొల్లాపూర్ పరిపాలన పరంగా ప్రముఖపాత్ర వహించింది. కొల్లాపూర్ రాజుకు మంత్రి లేదా సెక్రటరీగా వ్యవహరించిన 'కాట్ల వెంకట సుబ్బయ్య' ఇక్కడివారే. అనంతరం మంత్రిగా పని చేసిన 'మియాపురం రామకృష్ణారావు' కూడా ఇక్కడివారే. #జటప్రోలుసంస్థానస్థాపకులు - #సురభివంశచరిత్ర…. #పిల్లలమర్రిభేతాళనాయుడుమూలపురుషుడు!.... ఈ సంస్థానాన్ని స్థాపించిన పాలకులు విష్ణుపాదోధ్భవమగు పద్మనాయకశాఖలో డెబ్బది యేడు గోత్రములు గల #రాచవెలమతెగకు చెందిన "పద్మనాయక వంశ వెలమవీరులు". వీరిలో 'పది గోత్రములు గల 'ఆదివెలమలకు' సంస్థానములు లేవు. వీరు కాకతీయ రాజ్య కాలంలో రాజ్యరక్షణలో యుద్ధవీరులుగా చేరారు. ఒక దశలో వీరు స్వతంత్ర రాజ్యాలగు #రాచకొండ, #దేవరకొండ (క్రీ. శ. 1335 - 1475) కూడా స్థాపించారు. వీరు శాఖోపశాఖలుగా తెలుగు ప్రాంతంలో అనేక ప్రాంతాలలో పాలకులుగా అధికారాలు చెలాయించారు. 'వేంకటగిరి, పిఠాపురం, బొబ్బిలి, జటప్రోలు' సంస్థానాధీశులకు మూలపురుషుడు ఒక్కడే. “రేచర్ల గోత్రికుడైన పిల్లలమర్రి చెవిరెడ్డి (లేదా) భేతాళ నాయుడు” వీరికి మూలపురుషుడు. వెంకటగిరి, నూజివీడు, బొబ్బిలి సంస్థాన పాలకులకు ఇతడే మూలపురుషుడు (ఈ చరిత్ర గతంలో వెంకటగిరి సంస్థానములో వివరించాను). ఈ 'భేతాళనాయుడు / చెవిరెడ్డి' కాకతీయ చక్రవర్తి గణపతి దేవుని (క్రీ. శ. 1199 - 1262) పరిపాలన కాలం వాడు. 'భేతాళనాయునికి' తొమ్మిదవ తరం వాడైన 'రేచర్ల సింగమ నాయుడు (1291 -1361)' వంశస్థుడు 'రేచర్ల అనపోతనాయుడు (1331 -1384)' క్రీ.శ. 1243 లో "#కాకతీయసామ్రాజ్యవిస్తరణమునకు" ఎంతో దోహదం చేశాడు. సాహితీ రంగమునకు, సమరాంగణమునకు సవ్యసాచిత్వము నెఱపిన #సర్వజ్ఞసింగభూపాలుడు (1405 - 1475) ఈ కుదురుకు చెందినవాడు. ఈ సింగభూపాలాన్వయుడు #పెద్దమహీపతి. ఈయనే "సురభి" వారికి కూటస్థుడు. 'సురభి' అనునది జటప్రోలు పాలకుల గృహనామము, గోత్రము 'రేచర్ల'. పెద్దమహీపతికి అయిదవ తరమువాడు #సురభిమాధవరాయలు. ఈతడు ప్రసిద్ధమగు "చంద్రికా పరిణయం" ప్రబంధ కర్త. ఈ వంశం వారికి ‘కంచి కవాట చూరకార, పంచపాండ్య దళవిభాళ, ఖడ్గనారాయణ’ అనే బిరుదులున్నాయి. సుమారు రెండువందల సంవత్సరాల క్రితం ప్రస్తుతమున్న 'కొల్లాపురం' రాజధానిగా చేసుకొని పరిపాలన సాగించారు. ఈ వంశాన్ని '30 మంది రాజులు' దాదాపు 700 ఏళ్లు పరిపాలించారు. జటప్రోలు సంస్థాన స్థాపకుడు, రేచర్ల అనపోతనాయుడు వంశస్థుడు "రేచర్ల కుమార మదానాయుడు" జటప్రోలు సంస్థానాన్ని అభివృద్ధి చేశాడు. 36 వంశాలకు మూల పురుషుడైన భేతాళరాజు తర్వాత సామంతరాజులుగా కొల్లాపూర్ సంస్థానాన్ని 26 మంది 'సురభి వంశ రాజులు' పరిపాలించినట్టు చారిత్రక, సాహిత్య ఆధారాలు వెల్లడిస్తున్నాయి. 12వ శతాబ్ధం చివరి భాగంలో, 13వ శతాబ్ధం ఆరంభంలో అంటే 1195 నుంచి 1208 ఏండ్ల మధ్యకాలంలో 'భేతాళరాజు' పరిపాలన కొనసాగించినట్టు శాసన ఆధారాలున్నట్టు 'శ్రీ వేదాంతం మధుసూదన శర్మ' తాను స్వయంగా రచించిన #కొల్లాపూర్ #సాహితీవైభవం పుస్తకంలో పేర్కొన్నారు. ఆయన తరువాత మాదానాయుడు, వెన్నమనాయుడు, దాచానాయుడు, సింగమనాయుడు, అనపోతానాయుడు, ధర్మానాయుడు, తిమ్మానాయుడు, చిట్టి ఆచానాయుడు, రెండో అనపోతానాయుడు, చిన్న మాదానాయుడు, ఎర్ర సూరానాయుడు, చిన్న మాదానాయుడు, మల్లానాయుడు, పెద్దినాయుడు, మల్లభూపతి, పెద్ద మల్లానాయుడు, మాధవరాయలు, నరాసింగరావు, మాధవరావు, బారిగడపలరావు, పెద్ద రామారాయుడు, జగన్నాథరావు, వెంటలక్ష్మారావు, వేంకట జగన్నాథరావు, వేంకట లక్ష్మారావు, జగన్నాథరావులు కొల్లాపూర్ సంస్థానాన్ని పాలించారు. ప్రస్తుతం వారి వారసుడిగా వేంకట కుమారకృష్ణ, బాలాదిత్య, లక్ష్మారావులు సంస్థానాధీశులుగా ఉన్నారు. "#సురభిమాధవరాయలు" విజయనగర ప్రభువు #అరవీటివంశ #అళియరామరాయలు (ఈయన శ్రీకృష్ణదేవరాయల అల్లుడు, చాళుక్య సోమవంశ క్షత్రియులు, రాచవారైన 'అరవీటి రామరాజు') కాలమున 'జటప్రోలు సంస్థానమును' బహుమతుగా పొందెను. "అళియ రామరాయలు" ఇచ్చిన సన్నదులో "ఆనెగొంది తక్తుసింహాసనానికి అధిపతులయిన..." అని కలదు (సురభి మాధవరాయలు, సారస్వత సర్వస్వము). 'సురభి వారి పూర్వీకుల' నుండీ వచ్చుచున్న వారసత్వ హక్కును 'అళియ రామరాయలు' సురభి మాధవరాయలకు స్థిరపరిచెను. "విజయనగర సామ్రాజ్య పతనానంతరం", మాధవరాయల పుత్రులు గోల్కొండ నవాబు "అబ్దుల్ హసన్ కుతుబ్ షా (తానీషా)" వలన క్రీ.శ. 1650లో మరల సంస్థానమునకు కొత్త సనదును సంపాదించెనట. వీరి తరువాత "సురభి లక్ష్మారాయ బహద్దరు" గారి వరకూ (సుమారు క్రీ.శ. 1840) సురభి వారి రాజధాని 'జటప్రోలు'. వీరి కాలమునుండి రాజధాని 'కొల్లాపురము' నకు మారినది. అప్పటినుండి వీరు '#కొల్లాపురముప్రభువులు' గా ప్రసిద్ధులయ్యారు. #సురభివారిరాజవంశవృక్షము.... 'సర్వజ్ఞ సింగభూపాలుని' వంశజులగు ఈ సంస్థానాధీశులందరూ శారదామతల్లికి సమర్పించిన మణిహారాలు తెలుగు సాహితీలోకమునకు వెలలేనివి. నిత్యకళ్యాణము పచ్చతోరణముగ విలసిల్లిన వీరి సాహితీమండపము విశ్వవిఖ్యాతమై విలసిల్లినది. (1) సర్వజ్ఞ సింగభూపాలుడు (1405 - 1475) (2) ఎఱ్ఱ సూరానాయుడు (3) మాధవ నాయుడు (4) పెద్దమహీపతి (5) ముమ్మిడి మల్లభూపాలుడు (1610 - 1670) (6) చినమల్లనృపతి (7) రామరాయలు (8) మల్లభూపతి (9) మాధవ రాయలు (10) నరసింగరావు (11) సురభి లక్ష్మారాయ బహద్దరు (1840) (12) రావు బహద్దర్ సురభి లక్ష్మీ జగన్నాధ రావు (1851 - 1884) (13) శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు. "సురభి లక్ష్మారావు" గారి కుమారుడు 'సురభి లక్ష్మీ జగన్నాధరావు' క్రీ.శ. 1851 - 84 వరకూ రాజ్యము చేసిరి. నిజాం ప్రభువు నుండి 'రాజా బహద్దరు, నిజాం నవాజ్ వంత్' బిరుదులు పొందారు. వీరు దేవబ్రాహ్మణ తత్పరులు. వీరికి సంతానం లేకపోవడంతో, 'వెంకటగిరి ప్రభువులగు మహారాజా శ్రీ సర్వజ్ఞకుమార యాచేంద్ర బహద్దరు' గారి చతుర్థ పుత్రులగు 'నవనీత కృష్ణ యాచేంద్రులను' దత్తపుత్రులుగా స్వీకరించారు. వీరే 'శ్రీ రాజా వేంకట లక్ష్మారావు బహద్దరు' అను పేరిట 1884 నుండి జటప్రోలు సంస్థానమును పాలించారు. వీరికి 'బొబ్బిలి సంస్థాన పాలకులగు మహారాజా సర్ రావు వెంకట శ్వేతాచలపతి రంగారావు' గారు అగ్రజులు. ఈయన 'వెంకటగిరి' నుండి 'బొబ్బిలి' సంస్థానమునకు దత్తు వచ్చెను. వీరికిద్దరు పుత్రికా సంతానము. లక్ష్మారాయ బహద్దరు వారి కుమార్తెను 'తేలప్రోలు రాజా' గారికిచ్చి వివాహం చేసెను. లక్ష్మారాయ బహద్దర్ వారి ప్రధమ కుమార్తె 'నూజివీడు సంస్థానమున' తేలప్రోలు రాజావారి ధర్మపత్ని 'రాణి రాజరాజేశ్వరీ దేవి' గారు. రెండవ కుమార్తె శ్రీ రాజా ఇనుగంటి వెంకట కృష్ణారావు గారి ధర్మపత్ని 'రాణి సరస్వతీ దేవి గారు'. శ్రీ రాజా సురభి లక్ష్మారాయ బహద్దర్ గారికి పురుష సంతతి లేదు. కావున, వీరు తమ వారసులుగా ప్రఖ్యాత 'బొబ్బిలి సంస్థానమునుండి శ్రీ రాజా వెంకటశ్వేతా చలపతి రామకృష్ణ రంగారావు బహద్దర్' వారి కుమారులను దత్తు చేసుకొనెను. వారిని 'శ్రీ రాజా సురభి వేంకట జగన్నాధరావు బహద్దర్' అను పేర సంస్థాన వారసులుగా నిర్ణయించెను. ప్రస్తుత 'కొల్లాపూర్ రాజవంశీయులు' వీరి అనువంశీకులే. శ్రీ రాజా వేంకట లక్ష్మారావు గారి అనంతరము వారి ధర్మపత్ని '#రాణివెంకటరత్నమాంబ' గారు సంస్థానమును కొంతకాలం పాలించారు. తరువాత వీరి దత్తపుత్రులు 'శ్రీ రాజా సురభి వెంకట జగన్నాధ రావు బహద్దరు' గారు సంస్థాన బాధ్యతలు నిర్వహించారు. వీరు 'తిరుపాచూరు' జమిందారులైన 'రాజా ఇనుగంటి వెంకట కృష్ణరావు (1899 - 1935)' కుమార్తె యగు 'ఇందిరాదేవిని' వివాహమాడెను. వీరి కాలముననే అన్ని సంస్థానములతో పాటుగా జటప్రోలు కూడా విశాలాంధ్రమున విలీనమైనది. లక్ష్మారావు 1928లో స్వర్గస్తులైనారు. ఆయన ధర్మపత్ని రాణిరత్నమాంబ జగన్నాథరావుకు సంరక్షకురాలిగా ఉంటూ రాజ్యభారం మోశారు. ఆమె సింగవట్నంలో #రత్నగిరికొండపై #రత్నలక్ష్మిఅమ్మవారిని ప్రతిష్టించి ఆలయాన్ని నిర్మించారు. 'పద్మనిలయం' పేరుతో విడిది కోసం ఒక బంగ్లాను కళాత్మకంగా కట్టించారు. ఆ కొండపై నుంచి దుర్భిణిలో చూస్తే 'జటప్రోలు, పెంట్లవెల్లి, కొల్లాపూర్' రాజసౌధాలేగాక ఆయా ప్రాంతాలు కళ్లముందున్నట్టుగా కనిపిస్తాయి. కొల్లాపూర్లోని బండయ్యగుట్ట సింగవట్నంలోని #లక్ష్మీనృసింహస్వామిఆలయం గుడి గోపురాలను కూడా ఆమె నిర్మించారు. 'జగన్నాథరావు' మేజర్ అయిన తర్వాత 1943లో పట్టాభిషేకం చేశారు. ఈయన తన పూర్వికుల మాదారిగానే పరిపాలన సాగించారు. 'రాజా జగన్నాథరావ
Image