ప్రతి ఇంటిపై జాతీయ జెండా...ప్రతి వారి గుండెలో జాతీయ భావం రావాలి

 హైదరాబాద్ (ప్రజా అమరావతి);


*ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా టిడిపి కార్యాలయంలో జాతీయ జెండాను ఆవిష్కరించిన పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు*


*స్వాతంత్ర్య సమరయోధుల చిత్రపటాలకు పూలువేసి నివాళులు అర్పించిన టిడిపి అధినేత*


*చంద్రబాబు నాయుడు, టిడిపి అధినేత ప్రసంగం*


ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు, అభినందనలు

స్వాతంత్ర్య పోరాటంలో ప్రాణాలు అర్పించిన సమర యోధులకు నివాళి అర్పిద్దాం

హర్ ఘర్ తిరంగా ఒక మంచి కార్యక్రమం.

భారత దేశం ఎంతో గొప్ప చరిత్ర కలిగిన దేశం.

ఇప్పుడు గర్వంగా జెండా చేతపట్టుకుని తిరుగుతున్నాం అంటే ఎందరో చేసిన త్యాగాలే కారణం

జాతిపిత మహాత్మాగాంధీ నుంచి కొమరం భీం వరకు అందరినీ స్మరించుకుందా.

ప్రతి భారతీయుడు గర్వంగా జెండా పట్టుకుని తిరిగాల్సిన సమయం ఇది

ప్రతి ఇంటిపై జాతీయ జెండా...ప్రతి వారి గుండెలో జాతీయ భావం రావాలి


దేశం నాకు ఏమి ఇచ్చింది అని కాదు....నేను దేశానికి ఏమి ఇచ్చాను అనేది చూడాలి

ఈ 75 ఏళ్లలో దేశం ఎన్నో విజయాలు సాధించింది. 

విదేశీయుల దాడులు, పాలన కారణంగా దేశం చాలా కోల్పోయింది.

నాటి నెహ్రూ నుంచి నేటి మోదీ వరకు చేసిన పాలనను మనం గుర్తు చేసుకోవాలి.

రాజకీయ నాయకులు ప్రభుత్వాలలో ఉండి తీసుకువచ్చే పాలసీలు ప్రజల జీవితాలను మార్చాలి.

క్రీడల్లో విజయాలతో క్రీడాకారులు మన కీర్తి చాటుతున్నారు.

స్వాంతంత్ర్యం వచ్చిన తరువాత కూడా తిండి లేక ఆకలితో జనం చనిపోయారు. 

ఆ సమయంలో వచ్చిన హరత విప్లవం, పాల విప్లవంతో పెనుమార్పులు వచ్చాయి.

తెలుగు బిడ్డ పివి నరసింహారావు ప్రధానిగా ఆర్థిక సంస్కరణలు తీసుకువచ్చారు. 

తెలుగు బిడ్డ పింగళి వెంకయ్య జాతీయ జెండాను రూపొందించారు.

స్వాతంత్ర్యానికి ముందు...తరువాత తెలుగు వారు దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించారు.

75 ఏళ్ల ఉత్సవాల సందర్భంగా...వచ్చే 25 ఏళ్లు ఏం చెయ్యాలి అనే లక్ష్యాలు పెట్టుకోవాలి

ఒక వ్యక్తి కావచ్చు...ఒక వ్యవస్థ కావొచ్చు....వచ్చే 25 ఏళ్లు ఏమి చెయ్యాలి అని నిర్ధిష్టమైన లక్ష్యం పెట్టుకోవాలి.

పాలకులు తీసుకున్న నిర్ణయాలతో దేశంలో పెను మార్పులు వచ్చాయి.

విద్య, వ్యవసాయం, ఆరోగ్య విషయంలో మార్పులు వచ్చాయి.

హైదరాబాద్ నాలెడ్జ్ ఎకానమీకి అడ్రస్ గా ఉంది.

దేశంలో ఉన్న యువశక్తిని ఉపయోగించుకుంటే దేశం అత్యున్నత స్థితికి చేరుతుంది.

ఐటి రంగంలో, టెలికాం రంగంలో నాడు కీలక నిర్ణయాలు అమలు చేశాను. ఆ ఫలితాలు ఇప్పుడు కనిపిస్తున్నాయి.

ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా తెలుగు వారు ఉండడానికి నాడు చేసిన సంస్కరణలే కారణం.

ఇప్పుడున్న ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చెయ్యాలి. ప్రపంచంలో అగ్రగామి చెయ్యాలి.

ప్రాణ త్యాగాలు చేసిన సమర యోధుల కలలు నిజం చెయ్యాలి అంటే దేశం ఒక సంకల్పంతో పని చెయ్యాలి

విలువలతో కూడిన సమాజం ఆవిష్కృతం చెయ్యాలి.

ఎంతో అభివృద్ది చెందినా ఇప్పటికీ పేదరికం ఉంది...నిరుద్యోగం ఉంది.

ఆర్థిక అసమానతలను తొలగించే ఆర్థిక వ్యవస్థ రావాలి. పాలసీలు మార్చుకోవాలి

దేశంలో సంపద సృష్టించాలి. అందరికీ సమాన అవకాశాలు లభించేలా కార్యక్రమాలు చేపట్టాలి.

రైతులు ఇప్పటికీ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు...దీనికి చాలా బాధ పడాలి. ఆలోచించాలి.

దేశానికి అన్నంపెట్టే రైతు కుటుంబానికి అన్నం పెట్టలేకపోతున్నాడు.

దేశంలో 57 శాతం మంది రైతులు అప్పుల్లోనే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

సరైన దిశగా ప్రయాణం సాగిస్తే రానున్న రోజుల్లో అమెరికా, చైనాల కంటే భారత దేశం ముందు ఉంటుంది. ఆ సామర్థ్యం దేశానికి ఉంది.

రక్షణ రంగంలో మూడో స్థానంలో ఉన్నాం.....దేశానికి ఆహార ధాన్యాలు ఇవ్వగలుగుతున్నాం.

దేశ రక్షణలో ఉన్న సైనికులను, ఇక్కడ మనం కోసం పని చేస్తున్న పోలీసులను గౌరవించుకోవాలి.

ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమం సందర్భంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవెయ్యాలి

జెండా ఎగురవెయ్యడం ద్వారా ప్రజల్లో ఒక స్ఫూర్తి రావాలి.

తెలుగు దేశం దేశ అభివృద్దిలో భాగస్వామిగా ఉంది.

టిడిపి ప్రభుత్వాలు తీసుకున్న పాలసీలు దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నాయి.

నాడు వాజ్ పేయి నా మాట మేరకు స్వర్ణ చతుర్భుజి ప్రాజెక్ట్ చేపట్టారు. దేశంలో రోడ్ కనెక్టివీకి ఇదే కారణం.

మైక్రో ఇరిగేషన్ పై నాడు ఇచ్చిన సూచనలు ఇప్పుడు అమల్లోకి వచ్చాయి. 

దేశంలో నదుల అనుసంధానం జరగాలి. రైతులకు సాగు నీటి కరువు పోలవాలి.

Comments