ఇంద్రకీలాద్రి: సెప్టెంబర్ 29 (ప్రజా అమరావతి);
ద్వారకాతిరుమల ఆలయం నుండి అమ్మవారికి చీర, సారె అందజేసిన ద్వారకాతిరుమల ఈవో త్రినాధరావు.
ప్రతి ఏడాది శరన్నవరాత్రుల్లో అమ్మవారికి చీర, సారెలను అందజేయడం ఆనవాయితీగా వస్తున్నది. ఈ సంవత్సరం కూడా ద్వారకా తిరుమల దేవస్థానం నుండి గురువారం చీర, సారెలను ద్వారకాతిరుమల దేవస్థానం ఈవో త్రినాధరావు అమ్మవారి పేరున చీర,సారె లను అందచేయడం జరిగింది.
అమ్మవారికి చీర, సారె సమర్పించే కార్యక్రమంలో ద్వారకాతిరుమల ప్రధాన అర్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథచార్యులు, చైర్మన్ కుమారుడు ఎస్.వి వెంకట ముక్తేశ్వరరావు, వేదపండితులు పాల్గొన్నారు.
addComments
Post a Comment