ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు: వెంకయ్య నాయుడు

  ప్రజాస్వామ్యంలో పార్టీలు మారడం మంచి పద్ధతి కాదు: వెంకయ్య నాయుడు



గుంటూరు (ప్రజా అమరావతి): ప్రపంచం అంతా భారత్‌ వైపు చూడటానికి కారణం ప్రధాని నరేంద్రమోదీ అని మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు అన్నారు. భారత్‌ స్నేహం కోసం ప్రపంచదేశాలు ఎదురుచూస్తున్నాయని తెలిపారు.గుంటూరులోని విజ్ఞాన్ వర్సిటీలో ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనానికి వెంకయ్యనాయుడు హాజరయ్యారు. ఈ ఆత్మీయ సమావేశంలో చిరకాల మిత్రులు, శ్రేయోభిలాషులు, ఆత్మీయులను కలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు. చక్కని కార్యక్రమాన్ని నిర్వహించిన మిత్రులకు అభినందనలు తెలిపారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''దేశ యువత ఉత్సాహం, ఉత్తేజంతో ఉండాలి. యువతే దేశానికి అసలైన సంపద. యువత లక్ష్యాలను నిర్దేశించుకోవాలి. యువత రాజకీయాల్లోకి రావాలి. అమెరికా, రష్యా, బ్రిటన్‌ అభివృద్ధిలో భారతీయుల పాత్ర ఉంది. నాయకులు ఎప్పుడు ఏ పార్టీలో ఉంటున్నారో అర్థం కావడం లేదు. పార్టీలు మారడం ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు. రాజకీయాల్లో వ్యక్తిగత విమర్శలకు పోవడం.. కులమతాల ఆధారంగా నాయకులను ఎన్నుకోవడం సరైన పద్ధతి కాదు'' అని వెంకయ్యనాయుడు అన్నారు.

Comments