ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ రాష్ట్ర గౌరవ సలహా దారులుగా ప్రముఖ విద్యావేత్త శ్రీ బాలాజీ రెడ్డి

 ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్స్ యూనియన్ 

రాష్ట్ర గౌరవ సలహా దారులుగా ప్రముఖ విద్యావేత్త శ్రీ బాలాజీ రెడ్డి 


శనివారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. 

అమరావతి (ప్రజా అమరావతి);

గుంటూరు జిల్లా ఉండవల్లి గుహల వద్ద జరిగిన 

రాష్ట్ర కార్యవర్గ సమావేశం అనంతరం రాష్ట్ర అధ్యక్షులు చొప్పరపు సాంబశివ నాయుడు 

గౌరవాధ్యక్షులు,రాష్ట్ర ప్రభుత్వ నవరత్నాల ఎగ్జిక్యూటివ్ వైస్ చైర్మన్ 

శ్రీ అంకం రెడ్డి నారాయణమూర్తి మరియు రాష్ట్ర ప్రధాన న్యాయ సలహాదారులు నరహరిశెట్టి శ్రీహరి 

ల చేతుల మీదుగా నియామక పత్రాన్ని అందజేశారు. 


ఈ సందర్భంగా బాలాజీ రెడ్డి మాట్లాడుతూ పాత్రికేయుల సమస్యలను మరిముఖ్యంగా సంపాదకులు సమస్యలను 

రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి జర్నలిస్టులందరికీ మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు.


పత్రికా నిర్వహణ కష్ట సాధ్యంగా ఉన్న ఈ సమయంలో జర్నలిస్టులు ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి పత్రికలు నడపడటం ముదాహవమని అన్నారు తప్పని సరిగా సంపాదకులు అందరికీ మేలు జరిగేలా చూస్తానని హామీ ఇచ్చారు. 

కృష్ణ,గుంటూరు,ఉభయ గోదావరి జిల్లాలతో పాటు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి వచ్చిన ఆంధ్రప్రదేశ్ ఎడిటర్స్ అండ్ రిపోర్టర్ యూనియన్ సభ్యులు ముందుగా ఉండవల్లి గుహల్లో వేంచేసి ఉన్న అనంతశయ విష్ణు మూర్తిని దర్శించు కున్నారు.


ఈ సందర్భంగా బాలాజీ రెడ్డిని రాష్ట్ర నాయకులు సత్కరించి జ్ఞాపికలు అందజేశారు.

Comments