శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి


(ప్రజా అమరావతి):

        ఈ రోజు ది.06-11-2022న సాయంత్రం  గౌరవనీయులైన రాష్ట్ర డి.జి.పి శ్రీ కసిరెడ్డి వెంకట రాజేంద్రనాధ్ రెడ్డి, IPS గారు శ్రీ అమ్మవారి ఆలయమునకు విచ్చేయగా ఆలయ కార్యనిర్వహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం గౌరవ రాష్ట్ర డి.జి.పి గారు శ్రీ అమ్మవారి పంచహారతుల సేవలో పాల్గొన్నారు. శ్రీ అమ్మవారి పంచహారతుల సేవానంతరము వీరికి ఆలయ  ప్రధానార్చకులు మరియు వేదపండితులు వేద ఆశీర్వచనము చేయగా ఆలయ  కార్యనిర్వహణాధికారి గారు శ్రీ అమ్మవారి శేషవస్త్రము, ప్రసాదములు అందజేసినారు.

Comments