శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి

 శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల దేవస్దానము, ఇంద్రకీలాద్రి


, విజయవాడ (ప్రజా అమరావతి):

     ఈరోజు అనగా ది.10-02-2023 మధ్యాహ్నం  బ్రాహ్మణ వీధి లోని జమ్మిదొడ్డి మీటింగ్ హాలు నందు ఆలయ కార్యనిర్వాహణాధికారి దర్భముళ్ల భ్రమరాంబ గారు, పాలకమండలి చైర్మన్ శ్రీ కర్నాటి రాంబాబు గారు, పాలకమండలి సభ్యులు, ఆలయ అధికారులతో పరిచయ సమావేశం నిర్వహించడం జరిగినది. సమావేశం నందు పలు అంశములపై చర్చించారు. ది.07-02-2023 న గ్రామాంతరం ఉండటం చేత హాజరు కాలేకపోయిన శ్రీమతి కోలుకులూరి రామ సీత గారు ఈరోజు పాలకమండలి సభ్యురాలిగా ప్రమాణం స్వీకారం చేశారు.  అనంతరం పాలకమండలి చైర్మన్ గారు మాట్లాడుతూ ఆలయ పాలకమండలి సభ్యులుగా నియమింపబడటం ఎన్నో జన్మల పుణ్యఫలమని, తమకు శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వార్ల సేవకు అవకాశం కల్పించిన గౌరవ రాష్ట్రముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలిపి, భక్తులు మరియు ఆలయ అధికారులతో సమన్వయంతో ఆలయ అభివృద్ధికి తమ వంతు భాద్యతలను నిర్వహిస్తామన్నారు.


  ఈ కార్యక్రమంలో పాలకమండలి సభ్యులు

కేసరి నాగమణి గారు, కట్టా సత్తయ్య గారు, బుద్దా రాంబాబు గారు, దేవిశెట్టి బాలకృష్ణ గారు, చింతా సింహాచలం గారు, బచ్చు మాధవికృష్ణ గారు, అనుమోలు ఉదయలక్ష్మి గారు, నంబూరి రవి గారు, చింకా శ్రీనివాస రావు గారు, కొలుకులూరి  రామ సీత గారు, అల్లూరి కృష్ణవేణి గారు, తోట్టడి వేదకుమారి గారు, కార్యనిర్వాహక ఇంజినీర్లు కోటేశ్వర రావు గారు, ఎల్. రమాదేవి గారు, సహాయ కార్యనిర్వాహణాధికారులు మరియు సిబ్బంది పాల్గొన్నారు.

Comments