అమరావతి (ప్రజా అమరావతి);
రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి శ్రీరామ నవమి శుభాకాంక్షలు
శ్రీరామ నవమి సందర్భంగా రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. సీతారాముల దీవెనలతో రాష్ట్ర ప్రజలందరికీ సకల శుభాలు కలగాలని ఆయన అభిలషించారు. భద్రాద్రి, ఒంటిమిట్ట ఆలయాలతో పాటు, రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఇంటింటా శ్రీరామనవమి పర్వదినాన్ని, రాములవారి కళ్యాణాన్ని వేడుకగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. ప్రజలందరికీ శ్రీ సీతారాముల అనుగ్రహం లభించాలని ముఖ్యమంత్రి అభిలషించారు.
addComments
Post a Comment