పిహెచ్ సి,సిహెఎచ్ సిల్లోనే ఆసుపత్రి ప్రసవాలు జరగాలి.

 పిహెచ్ సి,సిహెఎచ్ సిల్లోనే ఆసుపత్రి ప్రసవాలు జరగాలి



* ప్రభుత్వాసుపత్రుల్లో ఆరోగ్య శ్రీ ప్రి ఆథరైజేషన్లు మెరుగు పడాలి


* తలసేమియా వ్యాధి నిర్థారణ కు పెద్ద ఎత్తున స్క్రీనింగ్ టెస్ట్లు చేపట్టండి


* అక్టోబరు 2 నుండి క్యాన్సర్ వ్యాధి నిర్థారణకు స్క్రీనింగ్ టెస్ట్లుకు ఏర్పాట్లు చేయండి


* ఫ్యామిలీ డాక్టర్ విధానంతో గ్రామాల్లో ప్రజారోగ్యం మెరుగు పడాలి, వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రజల్లో అవగాహన పెరగాలి.


ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.



విజయవాడ,24 జూలై (ప్రజా అమరావతి): రాష్ట్రం లో సాధ్యమైనంత వరకు ఆసుపత్రి ప్రసవాలన్నీ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలోనే జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులను ఆదేశించారు.వైద్య ఆరోగ్య శాఖపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.


ఈసందర్భంగా సిఎస్ మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, కమ్యూనిటీ హెల్త్ కేంద్రాల్లోనే వీలైనంత వరకు ఆసుపత్రి ప్రసవాలు జరగాలని,కేవలం హైరిస్క్ కేసులను మాత్రమే జిల్లా ఆసుపత్రిలకు రిఫర్ చేయాలని స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి ఆయా ఆసుపత్రుల డాక్టర్లు,ఎఎన్ఎం, ఆశావర్కర్లకు లక్ష్యాలను నిర్దేశించి నిరంతరం మానిటర్ చేయాలని సిఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు.


ఆరోగ్య శ్రీ పథకం అమలుపై మాట్లాడుతూ ప్రస్తుతం ఆరోగ్య శ్రీ పథకంలో 3257 వివిధ ప్రొసీజర్లు ఉండగా వాటిలోని సింపుల్ ప్రొసీజర్లన్నీ ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేసేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ ప్రీఆథరైజేషన్లు పెరిగి ఎక్కువ కేసుల్లో వైద్య సేవలు అందే విధంగా చూడాలని అన్నారు. ఆరోగ్యశ్రీకి సంబంధించి ఒక్క కేసుకూడా ప్రీఆథరైజేషన్ స్థాయిలో తిరస్కరణకు గురి కాకుండా ఉండేలా చూడాలని స్పష్టం చేశారు.ఇందుకుగాను డియంఇ,ఎపివైద్య విధాన పరిషత్ హెచ్ఓడిలు పూర్తి బాధ్యత తీసుకోవాలని ఆదేశించారు.


ఫ్యామిలీ డాక్టర్ విధానం గురించి మాట్లాడుతూ ఈవిధానంతో గ్రామాల్లో వ్యక్తిగత ఆరోగ్యం పట్ల ప్రజల్లో పూర్తి అవగాహన రావాలని, అదే విధంగా కమ్యూనిటీ హెల్త్ పరిస్థితుల్లో మార్పులు రావాలని సిఎస్ జవహర్ రెడ్డి చెప్పారు.అంతేగాక ఆయా గ్రామాల్లో వాటర్ బోర్న్,వెక్టర్ బోర్న్ సంబంధిత వ్యాధులు బాగా తగ్గాలని అన్నారు. వర్షాకాలంలో ప్రతి ఒక్కరూ కాచి చల్లార్చిన నీటిని తాగాలని,మరుగు దొడ్లను వినియోగించాలనే అవగాహనను కలిగించాలని చెప్పారు.మాతా శిశు మరణాల సంఖ్య తగ్గాలని,అందరికీ వ్యాథి నిరోధక టీకాలు వేయించి ఉండాలని అన్నారు.


అనంతరం క్యాన్సర్ వ్యాధి నిరోధక చర్యలు, వైద్య కళాశాలలు తదితర అంశాలపై సిఎస్ డా.జవహర్ రెడ్డి వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సమీక్షించారు.


అంతకు ముందు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించిన పలు కార్యక్రమాల వివరాలను వివరించారు.


ఇంకా ఈసమావేశంలో ఎపి యంఎస్ఐడిసి విసి అండ్ యండి డి.మురళీధర్ రెడ్డి, వైద్య ఆరోగ్యం కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ జె.నివాస్,ఆరోగ్యశ్రీ సీఈఓ ఎంఎన్.హరీంద్ర ప్రసాద్, కమీషనర్ ఎపి వైద్య విధాన పరిషత్ డా.వెంకటేశ్వర్,డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డా.డిఎస్.విఎల్ నర్సింహం పాల్గొనగా వీడియో లింక్ ద్వారా ఆర్థిక కార్యదర్శి ఎన్.గుల్జార్ పాల్గొన్నారు.



Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image