కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్న సీఎం.


అమరావతి (ప్రజా అమరావతి);


*గృహనిర్మాణాశాఖపై క్యాంపు కార్యాలయంలో సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ సమీక్ష.*


*ఇళ్ల నిర్మాణం ప్రగతిపై వివరాలు అందించిన అధికారులు.*

–  ఇప్పటివరకూ 4,24,220 ఇళ్లు పూర్తయ్యాయని, ఆగస్టు 1 నాటికి 5 లక్షల ఇళ్లు పూర్తవుతాయని వెల్లడించిన అధికారులు. 

–  రూఫ్‌ లెవల్, ఆ పైస్థాయిలో నిర్మాణంలో ఉన్న ఇళ్లు 5,68,517 కాగా,  వివిధ స్థాయిల్లో 9,56,369 ఇళ్లు ఉన్నాయని తెలిపిన అధికారులు. 

– ఈ అర్థిక సంవత్సరంలో హౌసింగ్‌ కోసం రూ.2201 కోట్లు ఖర్చు చేశామని వెల్లడించిన అధికారులు. 

– కాలనీలు పూర్తవుతున్నకొద్దీ అన్నిరకాలుగా కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు కావాలన్న సీఎం.


– ఇళ్ల నిర్మాణవేగాన్ని ఇదే రీతిలో ముందుకు తీసుకెళ్లాలన్న సీఎం. 

– కోర్టు కేసులు కారణంగా ఇళ్లస్థలాలు పంపిణీ నిలిచిపోయిన చోట ప్రత్యామ్నాయ భూముల సేకరణపై దృష్టి పెట్టాలని, ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం ఆదేశం. 

– విశాఖలో ఇళ్ల నిర్మాణం నిర్దేశిత సమయంలోగా పూర్తికావాలని, ఈ మేరకు అధికారులు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశం. 

–వీలైనంత త్వరగా అక్కడ పేదలకు నివాసం కల్పించడానికి ∙చర్యలు  వేగవంతం చేయాలన్న సీఎం.

– డిసెంబరులోగా విశాఖలో ఇళ్లు పూర్తిచేయడానికి తగిన కార్యచరణ రూపొందించాలని, ఏం కావాలన్నా వెంటనే ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని పునరుద్ఘాటించిన సీఎం.


– కొత్తగా ఇళ్లకోసం దరఖాస్తు చేసుకున్నవారికి పట్టాలు ఇచ్చేందుకు భూములను సేకరించాలని ఆదేశించిన సీఎం.

– దీనిపై కార్యాచరణ సిద్ధం చేసుకోవాలన్న సీఎం.

– వీటికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని ఆదేశం. 


– సీఆర్‌డీఏ పరిధిలో ఇళ్ల నిర్మాణం పనులు, దీనికి సంబంధించిన అంశాలను సీఎంకు తెలిపిన అధికారులు.

– 45,101 మంది ఆప్షన్‌–3 ఎంపిక చేసుకున్నారని తెలిపిన అధికారులు.

– ఇప్పటికే కాంట్రాక్టర్ల ఎంపిక కూడా పూర్తయిందని తెలిపిన అధికారులు.

– అందరితోనూ బ్యాంకు ఖాతాలు తెరిచే ప్రక్రియ ప్రారంభమైందని తెలిపిన అధికారులు.

– నీటి సరఫరా, అప్రోచ్‌ రోడ్లు, విద్యుత్‌ సరఫరా తదితర పనులపై దృష్టిపెట్టామని తెలిపిన అధికారులు.


– సీఆర్‌డీఏ ప్రాంతంలో పేదలకు ఇళ్ల నిర్మాణంపై పిటిషన్లు, కోర్టు విచారణలో అంశాన్ని ప్రస్తావించిన అధికారులు.

– పేదలకు ఇళ్లు రానివ్వకూడదని నిరంతరం అడ్డంకులు సృష్టిస్తున్నారు: సీఎం.

– పేదవాళ్ల కడుపు కొట్టడానికి అంతమంది ఏకం అవుతున్నారు: సీఎం

– పేదలకు ఇళ్లు రాకూడదన్నది వారి ఆలోచన: సీఎం.

– గట్టి సంకల్పంతో ఇళ్ల నిర్మాణం పూర్తిచేయాలి: సీఎం

– దీనికోసం న్యాయపరమైన చర్యలన్నీ తీసుకోవాలి: సీఎం


*టిడ్కో ఇళ్లపైనా సీఎం సమీక్ష.*

– ఇప్పటివరకూ 71,452 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించిన ప్రభుత్వం.

– ఈనెలలో మరో 29,496 ఇళ్లను లబ్ధిదారులకు అప్పగించనున్న ప్రభుత్వం.

– ఆగస్టులో 49,604 ఇళ్లు ఇస్తామన్న అధికారులు.

– 300 చదరపు అడుగులు ప్లాట్లను ఉచితంగా ప్రభుత్వం ఇస్తున్నందున మిగిలిన కేటగిరీల్లోని (365, 430 చ.అ) లబ్ధిదారులకు బ్యాంకుల ద్వారా దాదాపు రూ.2వేల కోట్లు రుణాలుగా ఇప్పించామన్న అధికారులు.


– టిడ్కో గృహ సముదాయాలను స్వయం సమృద్ధి దిశగా నడిపించాలని సీఎం ఆదేశం.

– దీనికి సంబంధించి వివిధ ప్రతిపాదనలను పరిశీలించిన సీఎం.

– వందల, వేల సంఖ్యలో గృహాలు ఈ కాలనీల్లో ఉంటున్నందున వారి అవసరాలను తీర్చేలా వాణిజ్య సముదాయాలను ఏర్పాటు చేసేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్‌. 

– తొలిదశలో 15 టిడ్కో కాలనీల్లో ఇవి ఏర్పాటు.

– మహిళల ఆధ్వర్యంలో వ్యాపార, వాణిజ్య సముదాయాలు ఏర్పాటు అయ్యేలా చూడాలన్న సీఎం.

– దీనివల్ల అందుబాటు ధరలతో సరుకులు అక్కడి పేదలకూ అందుతాయని, అలాగే మహిళలకూ ఉపయోగం ఉంటుందన్న సీఎం.

– అలాగే  టిడ్కో గృహాలపై సోలార్‌ ప్యానెల్స్‌ ఏర్పాటుకూ సీఎం గ్రీన్‌ సిగ్నల్‌.

Comments