ఇరిగేషన్ రంగాన్ని హత్య చేసింది సిఎం.



*సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్ధభేరి కార్యక్రమంలో భాగంగా పాతపట్నం నియోజకవర్గంలో చంద్రబాబు నాయుడు పర్యటన*


*కొత్తూరులో నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో ప్రసంగం:-*

పాతపట్నం (ప్రజా అమరావతి)!

కొత్తూరు సభ నుంచి చెపుతున్నా...తెలుగు దేశం పార్టీ గెలుపును ఎవరూ ఆపలేరు.

ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. జగన్ ఓటమి ఖాయం అయ్యింది

వంశధార పనులు తెలుగు దేశం హయాంలోనే జరిగాయి. నిర్వాసిత కుటుంబానికి 5 లక్షలు ఇచ్చిన ప్రభుత్వం మాది.

జగన్ 2013 చట్టం ప్రకారం ప్యాకేజ్ ఇస్తాను అన్నాడు...ఎకరాకు జగన్ 19 లక్షలు ఇస్తాను అన్నాడు...ఇచ్చాడా...ఆర్ అండ్ ఆర్ 12 లక్షలు ఇవ్వాలి ఇచ్చాడా?

ప్రాజెక్టుల వల్ల లాభం పొందిన వారు ఎంత ఆనందంగా ఉంటారో...భూములు ఇచ్చినవారు అంతే ఆనందంగా ఉండాలి అనేది నా ఆలోచన

అధికారంలోకి వచ్చిన తరువాత వంశధార ప్రాజెక్టు నిర్వాసితులను ఆదుకుంటాం

నాలుగున్నరేళ్లలో ఒక్క ప్రాజెక్టు పూర్తి చేయలేదు...ఒక్క కాలువ పూర్తి చెయ్యలేదు.

నేను సవాల్ విసురుతున్నా....మా హయాంలో ఖర్చు...మీ హయాంలో ఖర్చు పై మీదగ్గర సమాధానం ఉందా?

తెలుగు దేశం ప్రభుత్వం వచ్చిన తరవాత వంశధార నాగావళి ప్రాజెక్టుల అనుసంధానం పూర్తి చేస్తా.

రాష్ట్రంలో ఒక్క వర్గమైనా ఆనందంగా ఉన్నారా...నిత్యావసర వస్తువుల ధరలు పెరిగాయా లేదా....టీడీపీ హయాంలో కరెంట్ చార్జీలు పెరగలేదు. మళ్లీ టీడీపీ వచ్చిన తరువాత కరెంట్ చార్జీలు పెంచను....కరెంట్ చార్జీలు తగ్గించి భారం లేకుండా చేస్తా.

సోలార్, హైడల్, విండ్ విద్యుత్ ద్వారా రెండు రూపాయలకే యూనిట్ విద్యుత్ వస్తుంది. అప్పుడు ధరలు పెంచాల్సిన అవసరం ఉండదు.

జగన్ వచ్చిన తరువాత ఒక్క ఉద్యోగం వచ్చిందా....ఒక్క డిఎస్సి ఇచ్చాడా...ఒక్క పరిశ్రమ తెచ్చాడా

తెలుగు దేశం వస్తే...పెట్టుబడులు వస్తాయి...పరిశ్రమలు వస్తాయి. యువగళం కింద 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాను. నిరుద్యోగులకు రూ. 3 వేల యువగళం బృతి ఇస్తా.

రాష్ట్రంలో యవత నాకు మద్దతు ఇవ్వండి...మీ భవిష్యత్ నాకు వదిలేయండి.

నేను జగన్ ను సైకో అన్నాను. ఎందుకు అన్నానో తెలుసా....కారణం మీరు తెలుసుకోవాలి.

ఈ సైకో ముఖ్యమంత్రి బాబాయిని చంపి నారసుర రక్త చరిత్ర అన్నాడు. 

కోడికత్తి డ్రామాలు ఆడాడు.కత్తి గుచ్చిన కుర్రాడు 6 ఏళ్లుగా జైలులో ఉన్నాడు. అతన్ని కూడా చంపేసి..అదీ నేను చేశాను అంటాడు.

నేను చిత్తూరుజిల్లాలో పర్యటనకు వెళితే నాపై హత్యాయత్నం చేసి నా పైనే హత్యాయత్నం కేసు పెట్టారు. 

అంటే నేను కేసులకు భయపడి ఇంట్లో ఉండాలా....సమస్యే లేదు...నేను పోరాడుతా. ప్రజల చైతన్యంతో ప్రభుత్వంపై తిరుగుబాటు చేయాలి.

ఒక చెంపమీద కొడితే ఇంకో చెంప చూపించేందుకు నేను సిద్దంగా లేను.

పోలీసుల వైసీపీ నేతలు చేస్తున్న నేరాల్లో భాగస్వాములు కావొద్దు. 

నేను పోలీసులను గౌరవిస్తా.....నాడు ఈ పోలీసులు సమర్థవంతంగా పనిచేశారు. ఇప్పుడు ఆ పోలీసులే అక్రమ కేసులు పెడుతున్నారు. ప్రజలను వేధిస్తున్నారు.

నాడు ముద్దులు పెట్టిన జగన్....ముద్దులు పెట్టిన జగన్ ఇప్పుడు పిడిగుద్దులు గుద్దుతున్నాడు.

మన అచ్చెన్నాయుడును ఎంత దారుణంగా అరెస్టు చేశారో చూశారు కదా. ఇదీ జగన తీరు.

అధికారంలోకి వచ్చిన తరువాత మళ్లీ రైతును ఆదుకుంటా....అన్నదాత పథకం కింద రైతుకు రూ. 20 వేల ఇచ్చే బాధ్యత నాది.

ఎంత మంది పిల్లలు ఉంటే అంతమందికి తల్లి కి వందనం కింద రూ. 15 వేలు ఇస్తా.

ఆడబిడ్డ నిధ కింద ప్రతి మహిళకు రూ.1500 ఇస్తా. ధరలు పెరిగాయి....అందుకే ఉచితంగా మూడు సిలిండర్లు ఇస్తా. మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తా.

ఆడబిడ్డలను అన్ని రకాలుగా పైకి తెచ్చే బాధ్యత నాది. వారికి చేయూతనిస్తా.

గిరిజనులకు నాడు 18 ప్రత్యేక పథకాలు తీసుకువచ్చాను. ఐదేళ్లలో 15 వేల కోట్లు గిరిజనుల కోసం ఖర్చు పెట్టాను.

ఏకలవ్య స్కూల్ తెచ్చాను, 95 కోట్లతో సెల్ టవర్లు ఏర్పాటు చేశాం, బెస్ట్ అవెయిలబుల్ స్కూళ్ల పథకం ఇచ్చాం, గోరుముద్దపథకం ఇచ్చా....నాడు ఉన్న పథకాలు అన్నీ ఇప్పుడు రద్దు అయ్యాయి. జగన్ ఒక్క పథకం కూడా గిరిజనుల కోసం అమలు చేయడం లేదు.

రాష్ట్రంలో జగన్ హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తున్నాడు...అలాంటి వారిని భూ స్థాపితం చేస్తా.

రాష్ట్రంలో ఇప్పుడు గంజాయి బ్యాచ్ వచ్చింది. జిల్లా అంతా గంజాయి దొరుకుతుంది. సిఎం ఎప్పుడైనా సమీక్ష చేశాడా.

ఇరిగేషన్ రంగాన్ని హత్య చేసింది సిఎం.


పోలవరం ప్రాజెక్టును చంపేసింది ఈ ముఖ్యమంత్రి

యువత భవిష్యత్ ను చంపేసింది ఈ ముఖ్యమంత్రి

వ్యవసాయాన్ని చంపేసిన వ్యక్తి ఈ ముఖ్యమంత్రి

రాష్ట్ర భవిష్యత్ ను హత్య చేసింది ఈ ముఖ్యమంత్రి

అలాంటి ముఖ్యమంత్రి నాపై హత్యాయత్నం కేసు పెడతావా?

ప్రజలు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి తెచ్చిన సిఎం నాపై హత్యాయత్నం కేసు పెడతాడా?

సాగునీటి ప్రాజెక్టులపై మంచి సక్సెస్ అయ్యింది.

రాష్ట్రం బాగుపడాలి అంటే

సైకో పోవాలి...సైకిల్ రావాలి

Comments
Popular posts
దసరా నవరాత్రులు: కనకదుర్గమ్మ తొమ్మిది రోజులు అలంకరణ రూపాలు ... విజయవాడ, ఇంద్రకీలాద్రి (prajaamaravati), అక్టోబరు 18 :- దసరా శరన్నవరాత్రులు హిందువులకు ఒక ముఖ్యమైన పండుగ. ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుండి ఆశ్వయుజ శుద్ధ నవమి వరకు తొమ్మిది రోజులు దేవీ నవరాత్రులు పదవ రోజు విజయ దశమి కలసి దసరా అంటారు. ఇది ముఖ్యముగా శక్తి ఆరాధనకు ప్రాధాన్యత ఇచ్చే పండుగ. ఈ పండుగకు నవరాత్రి, శరన్నవరాత్రి అనీ కూడా అంటారు. శరదృతువు ఆరంభంలో వచ్చే పండుగ కనుక ఈ పేరు వచ్చింది. కొందరు ఈ పండుగకు మొదటి మూడు రోజులు పార్వతిదేవికి తరువాతి మూడు రోజుల లక్ష్మీ దేవికి తరువాతి మూడురోజులు సరస్వతి దేవికి పూజలు నిర్వహిస్తారు. ఈ సమయంలో పూజలో విద్యార్ధులు తమ పుస్తకాలను ఉంచుతారు. ఇలా చేస్తే విద్యాభ్యాసంలో విజయం లభిస్తుందని విశ్వసిస్తారు. సామాన్యులే కాక యోగులు నవరాత్రులలో అమ్మవారిని పూజిస్తారు. ముఖ్యముగా శాక్తేయులు దీనిని ఆచరిస్తారు. బొమ్మల కొలువు పెట్టడం ఒక ఆనవాయితీ. ఆలయాలలో అమ్మవారికి ఒక్కోరోజు ఒక్కో అలంకారం చేస్తారు. ఈ తొమ్మిది రోజుల్లో అమ్మవారిని తొమ్మిది రూపాల్లో పూజిస్తూ ఉంటారు. లోకకల్యాణం కోసం అమ్మవారు ఒక్కోరోజు ఒక్కో రూపాన్ని ధరించింది. అందువలన అలా అమ్మవారు అవతరించిన రోజున, ఆ రూపంతో అమ్మవారిని అలంకరించి ఆ నామంతో ఆరాధిస్తూ ఉంటారు. ఇంద్రకీలాద్రిపై వేంచేసి యున్న శ్రీ కనకదుర్గమ్మావారు మొదటి రోజు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా రెండవ రోజు బాలాత్రిపుర సుందరి మూడవ రోజు గాయత్రి దేవిగా, నాల్గవ రోజు అన్నపూర్ణ దేవిగా ఐదవరోజు శ్రీ సర్వస్వతి దేవిగా ఆరవ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరీ దేవిగా, ఏడవ రోజు శ్రీ మహలక్ష్మీదేవిగా, ఎనిమిదవ రోజు దుర్గాదేవి మరియు మహిషాసుర మర్థిని దేవిగా, తొమ్మిదవ రోజు శ్రీ రాజరాజేశ్వరి దేవి మొదలైన అవతార రూపాలతో దర్శనమిస్తూ భక్తులకు అమ్మవారు దర్శనమిస్తారు.ఇలా ఈ నవరాత్రుల సమయంలో ఒక్కో అమ్మవారిని ఆరాధించడం వలన ఒక్కో విశేష ఫలితం లభిస్తుందని ఆధ్యాత్మిక గ్రంధాలు చెబుతున్నాయి. నవరాత్రుల్లో బెడవాడ శ్రీకనకదుర్గమ్మ వారు వివిధ అలంకారాలతో భక్తుల కోర్కేలను తీర్చు చల్లని తల్లిగా దర్శనమిస్తారు.. 1. దుర్గాదేవి అలకారం ః శరన్నవరాత్రి మహోత్సవాల్లో శ్రీ కనకదుర్గమ్మవారు శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శినమిచ్చి భక్తులకు ఆయురారోగ్య ఐశ్వర్యాలను కలుగుజేస్తారు. 2. శ్రీ బాలాత్రిపుర సుందరి: ఫత్రిపురాత్రయంలో శ్రీ బాలాత్రి పుర సుందరీదేవి ప్రథమ స్థానంలో ఉంది. ఆమె ఎంతో మహిమాన్వితమైన ది. సమస్త దేవీ మంత్రాలలోకెల్లా శ్రీ బాలా మంత్రం గొప్పది. సకల శక్తి పూజలకు మూలమైన శ్రీ బాలాదేవి జగన్మోహనాకారాన్ని పవిత్రమైన శరన్నవరాత్రుల్లో దర్శించి, ఆమె అనుగ్రహాన్ని పొందితే, సంవత్సరం పొడుగునా అమ్మవారికి చేసే పూజలన్నీ సత్వర ఫలితాలనిస్తాయి. 3. శ్రీ గాయత్రి దేవి అలంకారం: ముక్తా విద్రుమ హేమనీల ధవల వర్థాలలతో ప్రకాశిస్తు, పంచ ముఖాలతో దర్శనమిస్తుంది. సంధ్యావందనం అధి దేవత . గాయత్రి మంత్రం రెండు రకాలు: 1. లఘు గాయత్రి మంత్రం 2. బ్రుహద్గాయత్రి మంత్రం. ప్రతి రోజూ త్రిసంధ్యా సమయంల్లో వేయి సార్లు గాయత్రి మంత్రంని పఠిస్తే వాక్సుద్ది కలుగుతుంది. 4. శ్రీ అన్నపూర్ణేశ్వరి దేవి: నాల్గవ రోజున నిత్యాన్నదానేశ్వరి శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారం అన్నం జీవుల మనుగడకు ఆదారం. జీవకోటి నశించకుండా వారణాసి క్షేత్రాన్ని నిజ క్షేత్రంగా, క్షేత్ర అధినాయకుడు విశ్వేశ్వరుడి ప్రియపత్నిగా శ్రీ అన్నపూర్ణా దేవి విరాజిల్లుతుంది. 5. శ్రీ మహా సరస్వతీ దేవి: ఐదవ రోజున చదువుల తల్లి సరస్వతీ దేవి అలంకారం త్రి శక్తులలో ఒక మహాశక్తి శ్రీ సరస్వతీ దేవి. సరస్వతీ దేవి సప్తరూపాలలో ఉంటుందని మేరు తంత్రంలో చెప్పబడింది . అవి చింతామని సరస్వతి, జ్ఝాన సరస్వతి, నిల సరస్వతి, ఘట సరస్వతి, కిణి సరస్వతి, అంతరిక్ష సరస్వతి, మరియు మహా సరస్వతి. మహా సరస్వతి దేవి శుంభని శుంభులనే రాక్షసులను వధించింది. ..2 ..2.. 6. శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవివేవి : 6వ రోజున త్రిపురాత్రయంలో రెండో శక్తి శ్రీ లలితా దేవి అలంకారం. త్రిమూర్తులకన్నా ముందు నుండి ఉన్నది కాబట్టి, త్రిపుర సుందరి అని పిలవబడుతుంది. శ్రీచక్ర ఆదిష్టాన శక్తి, పంచదశాక్షరి అదిష్టాన దేవత. ఆదిశంకరాచార్యులు శ్రీ చక్రయంత్రాన్ని ప్రతిష్టించక పూర్వం ఈ దేవి ఉగ్ర రూపిణిగా ‘చండీదేవి'గా పిలవబడేది. ఆది శంకరాచార్యలు శ్ీర చక్రయంత్రాన్ని ప్రతి ష్టించాక పరమశాతం రూపిణిగా లలితా దేవిగా పిలవబడుతున్నది. 7. శ్రీ మహాలక్ష్మి తేది : 7వ రోజున మంగళ ప్రద దేవత శ్రీ మహాలక్ష్మీ దేవి అలంకారం అష్టరూపాలతో అష్ట సిద్దులు ప్రసాదించే దేవత. రెండు చేతులలో కమలాలని ధరించి, వరదాభయ హస్తాల్ని ప్రదర్శిస్తూ, పద్మాసనిగా దర్శనిమిస్తుంది. ఆది పరాశక్తి మహాకాళీ, మహాలక్ష్మీ, మహా సరస్వతి రూపాలు ధరించింది. ఆ ఆదిపరాశక్తి రూపంగానే మహాలక్ష్మీ అలంకారం జరుగుతుంది. 8. శ్రీ దుర్గా దేవి అలంకారం: దుర్గతులను నాశనం చేసే శ్రీ దుర్గా దేవి అలంకరాం రురుకుమారుడైన ‘దుర్గముడు' అనే రాక్షసున్ని సంహరించింది అష్టమి రోజునే కనుక ఈ రోజును దుర్గాష్టమి అని, దుర్గమున్ని సంహరించిన అవతారం కనుక దేవిని ‘దుర్గా' అని పిలుస్తారు. శ్రీ మహిషాసుర మర్ధినీ దేవి అలంకారం: మహిశాసురున్ని చంపడానికి దేవతలందరూ తమ తమ శక్తులను ప్రదానం చేయగా ఏర్పడిన అవతారం ఇది. సింహాన్ని వాహనంగా ఈ దేవికి హిమవంతుడు బహుకరించాడు. సింహ వాహనంతో రాక్షస సంహారం చేసి అనంతరం ఇంద్ర కీలాద్రి పై వెలిసింది 9. శ్రీరాజరాజేశ్వరి దేవి అలంకారం: 9వరోజు అపజయం అంటే ఎరుగని శక్తి కాబట్టి ఈ మాతను ‘అపరాజిత' అంటారు. ఎల్లప్పుడు విజయాలను పొందుతుంది కాబట్టి‘విజయ' అని కూడా అంటారు. శ్రీ రాజరాజేశ్వరి దేవి ఎప్పుడూ శ్రీ మహా పరమేశ్వరుడి అంకముపై ఆసీనురాలై భక్తులకు దర్శనమిస్తుందని పురాణ ఇతి హాసారు వెల్లడిస్తున్నాయి. -
Image
గాజువాక జర్నలిస్టుల వినతిని సీఎం జగన్మోహనరెడ్డి దృష్టికి తీసుకువెళ్తా
Image
మహిళల ఆర్థిక స్వావలంబనే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం
Image
శ్రీ దుర్గామల్లేశ్వర స్వామివార్ల దేవస్థానం, ఇంద్రకీలాద్రి
Image
Kvik Fitness Arena " జిమ్ సెంటర్
Image