జరిగేది కురుక్షేత్ర.....వైసీపీ కౌరవులను ఓడించాలి.



శ్రీకాళహస్తి (ప్రజా అమరావతి);


*సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో భాగంగా  శ్రీకాళహస్తిలో నారా చంద్రబాబునాయుడు రోడ్ షో*


*గోదావరి నీళ్ళు రాయల సీమకు తీసుకు వెళ్ళడమే నా లక్ష్యం*


*పెద్దిరెడ్డి దోపిడీ కోసమే కొత్త ప్రాజెక్ట్ ల రూపకల్పన*


*జరిగేది కురుక్షేత్ర.....వైసీపీ కౌరవులను ఓడించాలి


*


*రోడ్ షోలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రసంగం :-*


•శ్రీకాళహస్తి రాగానే నాకు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గుర్తుకువచ్చారు. ఉన్నతమైన రాజకీయాలు చేసిన వ్యక్తి బొజ్జల. ఆయన ఒకటి అనుకుంటే అయిపోవాల్సిందే.

బొజ్జల కుటుంబం మూడుతరాలుగా ప్రజల్లో ఉన్నారు. బొజ్జల కుటుంబానికి....బియ్యపు మధుసూదన్ రెడ్డికి పోలిక ఉందా.

సైకో అని పోస్టర్ పెడితే ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి ఎందుకు భుజాలు తడుముకుంటున్నాడు?

సైకో పాలన చేస్తున్న వాళ్లని ప్రజలు సైకోలని పిలుస్తుంటే, అధికారులకు వచ్చిన నష్టం ఏంటి?

గత ఎన్నికల్లో సైకోకి సహకరించడం వల్లే రాష్ట్రంలో భూముల ధరలు పడిపోయాయి

హైదరాబాద్ అభివృద్ధి తరహాలోనే రాయలసీమలో పారిశ్రామికాభివృద్ధికి నాంది పలికి ఎన్నో పరిశ్రమలు తెచ్చా

కమీషన్ల కోసం ఎమ్మెల్యే బియ్యపు రెడ్డి చేస్తున్న కక్కుర్తి పనులకు ఉన్న పరిశ్రమలు పోయే పరిస్థితి

సాగునీటి ప్రాజెక్టుల విధ్వంసంపై యుద్దభేరి కార్యక్రమంలో పాల్గొనేందుకు కాళహస్తికి వచ్చాను. 

దేశంలో నీటి కోసం యుద్దాలు జరుగుతున్నాయి. నీటికి అంత ప్రాధాన్యత ఉంది.

రాయలసీమ ఎడారిగా మారిపోకుండా ఉండాలని నాడు ఎన్టీఆర్ సీమలో సాగునీటి ప్రాజెక్టులు చేపట్టారు.

తెలుగు గంగ, నగిరి గాలేరు, హంద్రీనీవా ప్రాజెక్టులు ప్రారంభించింది అన్న ఎన్టీఆర్

నీటి ప్రాధాన్యతను గుర్తించి 2014 తరువాత సాగునీటి ప్రాజెక్టులకు అత్యధిక ప్రాధాన్యం ఇచ్చాం.

నేడు కనీసం కాలువలకు నీళ్లు కూడా ఇవ్వని పరిస్థితి.

నాడు హైదరాబాద్ ను ముందుచూపుతో అభివృద్ది చేశాను. దీంతో ఇప్పుడు అక్కడ ఎకరా భూమి 100 కోట్లు అయ్యింది.

అదే విధంగా ఏపీని కూడా అభివృద్ది చేద్దాం అనుకున్నా...కానీ ఎన్నికల్లో ఓటమితో ఆ కల నెరవేరలేదు.

2014 తరువాత చిత్తూరు జిల్లాలో పెద్ద ఎత్తున తయారీ పరిశ్రమలు తెచ్చాను. 

రేణిగుంట ఎయిర్ పోర్ట్ ను అభివృద్ది చేశాను.

ఐఐటి, ఐఐఎస్ఇఆర్,ఐఐడిటి వంటి సంస్ధలు మన హయాంలో ఇక్కడికి వచ్చాయి.

జగన్ వచ్చిన తరువాత ఒక్క సంస్థ వచ్చిందా....ఒక్క కంపెనీ వచ్చిందా?

రాష్ట్రాన్ని అభివృద్దిలో పెట్టి ప్రజల జీవితాలు బంగారు జీవితాలు చేయాలి అనుకున్నా.

కానీ జగన్ ఒక్క చాన్స్ కు, ముద్దులకు మీరు మోసపోయారు.

సాగునీటి ప్రాజెక్టులపై ప్రశ్నించేందుకు నేను జిల్లాకువస్తే నన్ను అడ్డుకునే ప్రయత్నం చేశారు. మన మీటింగ్ కి వచ్చిన కార్యకర్తలపై దాడులు చేశారు.

డబ్బుల కోసం అవసరం లేని ప్రాజెక్టులు చేపట్టి పెద్దిరెడ్డి అక్రమాలు చేస్తున్నాడు.

అవులాపల్లి ప్రాజెక్టు కు ఎన్జీటీ ఫైన్ వేసింది....దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆ ఫైన్ చెల్లించింది. పెద్దిరెడ్డి కోసం ప్రజల సొమ్ము ప్రభుత్వం ఎందుకు చెల్లించాలి.

అససరంలేని ప్రాజెక్టులు చేపట్టి పెద్దిరెడ్డి ప్రభుత్వ సొమ్ముకాజేస్తున్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత గోదావరి నీరు రాయలసీమకు తీసుకువచ్చి ఇక్కడ ప్రజల కష్టాలు తీర్చుతాను.

పీఎల్ఆర్ కంపెనీ పెట్టిన పెద్దిరెడ్డి కాంట్రాక్టర్ గా వేల కోట్లు దోచుకుంటున్నాడు

రాష్ట్రంలో ఇప్పుడు ఎక్కడ చూసినా గంజాయి వాడకం పెరిగిపోయింది. శ్రీకాళహస్తిలో కూడా గంజాయి లభిస్తుంది. దీంతో పిల్లల జీవితాలు నాశనం అవుతున్నాయి. నేను ఐటీ ఉద్యోగాలు ఇచ్చి మన బిడ్డలను దేశ విదేశాలకు పంపాను. వీళ్లు గంజాయి పంచుతున్నారు.

ప్రజల సమస్యలపై నేను మాట్లాడితే నాపై పోలీసులతో దాడి చేయిస్తున్నారు. అయితే ఆ పోలీసుల సమస్యలు కూడా నేనే ప్రస్తావించాలి. పోలీసులకు టీఏ, డీఏలు వస్తున్నాయా? 

మాపై దాడులు చేసే వారు గుర్తుపెట్టుకోవాలి...ఇవాళ ఉంటుంది..రేపు ఉంటుంది అని గుర్తుపెట్టుకోవాలి

ప్రజాహితం కోసం పోలీసుల్లోనూ తిరుగుబాటు రావాలి

పోలీసుల్ని నేరాల్లో భాగస్వాముల్ని చేద్దామని వైసీపీ చూస్తోంది

ఒకరిద్దరు చెడిపోయిన పోలీసు ఉన్నతాధికారులు వల్ల మంచి పోలీసులకు చెడ్డపేరు వస్తోంది

పోలీసులకు ప్రభుత్వం టీఏ, డీఏలు కూడా ఇవ్వకుండా, తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టమని మాత్రం లాఠీలు ఇస్తున్నారు

ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ప్రజాహితం కోసం పోలీసులు పనిచేయాలి

తప్పు చేసిన ఏఒకరినీ వదలను....రాయలసీమకు మీరు నీళ్లు ఇవ్వలేదు అంటే నాపై దాడి చేశారు.

నేను రాయలసీమలో నీళ్లు పారించాలి అని చూశాను...జగన్ రక్తం పారించాలి అని చూస్తున్నాడు

ఎన్నిఇబ్బందులు పెట్టినా తెలుగు జాతి కోసం పారాడుతా....భారత దేశంలో తెలుగు వారిని నెంబర్ 1 చేస్తా.

చిత్తూరు జిల్లాలో అమర రాజా సంస్ధ వేల మందికి ఉద్యోగాలు ఇస్తే వారిపైనా దాడులు చేశారు. వేధించారు. దీంతో వాళ్లు తెలంగాణకు వెళ్లి సంస్థను ఏర్పాటు చేశారు.

జగన్ రెడ్డి పాలన వల్ల ఉన్నవీ పోతున్నాయి...కొత్తవీ రావడం లేదు.

రాష్ట్రంలో నిత్యావసర ధరలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. పన్నులు పెరిగాయి, కరెంట్ బిల్లులు పెరిగాయి.

అందుకే సూపర్ సిక్స్ అని పథకాలు ప్రకటించాను.మహాశక్తి పథకం కింద మహిళలకు చేయూతనిస్తాను.

స్థానిక ఎమ్మెల్యే సహా అక్రమాల ద్వారా తిన్న వైసీపీ ఎమ్మెల్యేలను తిన్నది అంతా కక్కిస్తా.

రాష్ట్రంలో కురుక్షేత్ర యద్దం ప్రారంభం అయ్యింది. ధర్మాన్ని కాపాడడానికిజరిగిన యుద్దం కురుక్షేత్రం. ఆ కురుక్షేత్ర యుద్దంలో వైసీపీ కౌరవులను ఓడించాలి.

శాసన సభను కౌరవ సభ ను చేసిన వారిని ఓడించాలి...సభను గౌరవ సభ చేస్తాను అని నేను ప్రకటించాను. దీని కోసం మీ మద్దతు కోరుతున్నా.

రాష్ట్రం బాగుండాలి అని భావిచే వారంతా వైసీపీ నుంచి బయటకు రావాలి.

Comments