జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి.



*జగన్ 5 ఏళ్ల పాలనలో రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి*



*నా పేరు చెప్తే కియా, పట్టిసీమ, ఉద్యోగాలు గుర్తొస్తాయి...నీ పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక్కటి చెప్పు జగన్*


*కలియుగం అంటే హత్యలు చేసి నీలా నిస్సుగ్గుగా అబద్ధాలు చెప్పడమే*


*సునీతారెడ్డికి న్యాయం చేయకపోగా వేధిస్తావా.?*


*వైసీపీ ఇంటికి పోవాలి...యువతకు ఉద్యోగాలు రావాలి*


*ప్రజలు ఓటు వేసేటప్పుడు జగన్ బాదుడు ప్రతి ఒక్కరికీ గుర్తుండాలి*


*ప్రజల కోసమే మూడు పార్టీల పొత్తు-ఫ్యాన్ ను చిత్తు చేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు*


*ఉదయగిరి ఎమ్మెల్యేగా సురేష్ ను, నెల్లూరు ఎంపీగా వేమిరెడ్డిని గెలిపించండి*


*ఉదయగిరి నియోజకవర్గం, వింజమూరు ప్రజాగళం సభలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు*


*బహిరంగ సభలో పలువురు వైసీపీ నేతల చేరిక...కండువా కప్పి ఆహ్వానించిన చంద్రబాబు*


వింజమూరు/ఉదయగిరి (ప్రజా అమరావతి):- వింజమూరు దద్దరిల్లుతోంది. ఉదయగిరిలో సైకిల్ దూసుకుపోతోంది. ఎవరన్నా అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళ్లిపోండి. ప్రజల్ని చైతన్యం చేయడం కోసం మీ అందరిలో ఉండే ఆవేదన, బాధ అర్థం చేసుకుని కార్యోన్ముకులను చేయడం కోసం నేను వచ్చాను. 

రాష్ట్ర దశ..దిశను వచ్చే ఎన్నికలు మార్చబోతున్నాయి. ఫ్యాన్ ను తుక్కు తుక్కు చేసి పడేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. 

ఒక్క ఛాన్స్ అన్నాడు...నెత్తి మీద చేయి పెట్టాడు...బుగ్గలు నిమిరాడు..ముద్దులు పెట్టాడు...ఇప్పుడు గుద్దులే గుద్దులు..ఎవరికీ మినహాయింపు లేదు. 

వచ్చిన రైతన్నలను చూస్తే ఉదయగిరి రైతాంగం వ్యధ ఎలా ఉందో తెలుస్తోంది. జగన్ వచ్చాక ఒక్క సాగునీటి పథకం పూర్తైందా.? విత్తనాలు ఇచ్చారా.? బిందు సేద్యానికి సబ్సీడీలు ఇచ్చారా.? 

యువతకు ఉద్యోగాలు లేవు. రానున్న ఎన్నికల్లో ఫ్యాన్ ను ముక్కలు చేసేది యువతే. మీ జీవితాలతో జగన్ ఆడుకున్నారు. మెగా డీస్సీ, జాబ్ కేలండర్ ఇచ్చాడా...ఉద్యోగాలు ఇచ్చాడా..మీ తడాఖా చూపించాలి. 

బాదుడుకు గురైన ఆడబిడ్డల్లో తిరుగుబాటు కనిపిస్తోంది. 

వైసీపీ హింసకు ప్రాధాన్యం ఇస్తోంది. కేసులు పెట్టడం, వేధించడం, బెదిరించడం తప్ప అభివృద్ధి చేతకాని దద్దమ్మ జగన్. తడిగుడ్డతో గొంతు కోసే ప్రభుత్వ మేదో..మీ కోసం ఆలోచించే ప్రభుత్వమేదో ఆలోచించాలి.

ఐదేళ్ల జగన్ నరకానికి, సంక్షేమానికి చెక్ పెట్టే రోజు మే 13. ఇక 45 రోజులు మాత్రమే ఉంది. 

టీడీపీ, జనసే, బీజేపీ ఆలోచన ఒక్కటే...వైసీపీ ఇంటికి పోవాలి...యువతకు ఉద్యోగాలు రావాలి.

కరెంట్ ఛార్జీలు తగ్గిస్తా అన్నాడు..తగ్గించాడా.? నేనున్నప్పుడు ఛార్జీలు పెరిగాయా.? రూ.200 వచ్చే కరెంట్ బిల్లు ఇప్పుడు రూ.1000 వస్తోంది.

ఇష్టానుసారంగా అవినీతి చేసి పేదలపై భారం వేసి మీ నడ్డి విరుస్తున్న జలగ జగన్.

ఓటింగ్ కు వెళ్లినప్పుడు పెరిగిన విద్యుత్ ఛార్జీలు గుర్తుకు రావాలి. 

ఈ ఐదేళ్లలో మీకు మంచి జరిగితే నేనేం మాట్లాడను..నష్టం జరిగితే చర్చించి జగన్ ను ఇంటికి పంపడానికి కంకణం కట్టుకోవాలి. 

జగన్ ఎడమ చేత్తో రూ.10 ఇస్తాడు..కుడి చేత్తో రూ.100 లాగుతాడు.

ఆర్టీసీ ఛార్జీలు, ఇంటిపన్ను, పెట్రోల్, డీజల్ ధరలు, చెత్త పన్ను పెంచాడు...అన్ని ధరలు పెరిగాయి. 

వంటనూనె, బియ్యం, పప్పులు, ఉప్పు, చింతపండు రేట్లు పెరిగాయి. చాలీచాలనీ ఆదాయంతో పేదలు బతుకులు చితికపోయాయి.

రూ.60 ఉన్న క్వార్టర్ ధర ఇప్పుడు రూ.200 అయింది. మిగతా రూ.140 ఎక్కడిపోతోంది.? జగన్ జేబులోకి వెళ్తోంది.

ఈ మద్యం తాగితే ఆరోగ్యం నాశనం అవుతుంది..బేజులన్నీ గుళ్లవుతాయి. రేట్లు ఎందుకు పెంచావో చెప్పే ధైర్యం ఉందా.?

ఎన్నికల ముందు మద్య నిషేధం చేశాకే ఓట్లు అడుగుతా అన్నాడు...చేశాడా మద్య నిషేధం.? ఓటు అడిగే హక్కు ఉందా.?

మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి అప్పులు తెచ్చాడు. వింజమూరులో కూడా గంజాయి ఉంది. గంజాయి లేని ప్రాంతమే లేదు.

విశాఖ పోర్టు ద్వారా డ్రగ్స్ దిగుమతి చేశారు...25 వేల కేజీలను యువతను సర్వనాశనం చేయడానికి తెచ్చారు. మత్తుకు ఒకసారి అలవాటు పడితే మన చేతల్లో ఉండదు. 

ఉద్యోగులు, పోలీసులకు జీతాలు వస్తున్నాయా మొదటి తేదీన.? నేను పీఆర్సీ పెట్టి జీతాలు సక్రమంగా ఇచ్చేవాన్ని. కానీ మీరు జీతాలు అడిగితే జగన్ జైళ్లో పెడుతున్నారు. 

జీతాలు పెంచకపోయినా పర్వాలేదు ఒకటవ తేదీన జీతాలు ఇస్తే చాలు అనే పరిస్థితి. జగన్ మళ్లీ గెలిస్తే మీకు మళ్లీ రివర్స్ పీఆర్సీ వస్తుంది.

భవన నిర్మాణ కార్మికులకు పనుందా...ఇసుక దొరకుతుందా.? స్టీల్, భారతీ సిమెంట్ ధరలు బాగా పెరిగాయి. దీంతో కార్మికులకు ఉపాధి దొరకడం లేదు. 

1978 నుండి ఎమ్మెల్యేగా ఉన్నా...నా జీవితంలో ఇలాంటి వ్యక్తి సీఎం అవుతాడని అనుకోలేదు.

జగన్ ప్రభుత్వంలో అందరూ బాధితులే..ఎవరూ బతికే పరిస్థితిలో లేరు. ఉపాధి కల్పించే చిన్న కాంట్రాక్టర్లకు డబ్బులు చెల్లించకపోవడంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.

కాంట్రాక్టర్లకు లక్ష కోట్లు బకాయిలు పెట్టారు...సాక్షి పత్రిక మాత్రం ప్రకటనలకు కోట్లలో డబ్బులు ఇస్తున్నారు. అప్పుల బాధతో 43 మంది కాంట్రాక్టర్లు ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.

వివేకా కూతురు సునీతారెడ్డికి జరిగిన అన్యాయం చూశారా.? ఐదేళ్ల క్రితం వివేకాను గొడ్డలితో చంపి సానుభూతి తెచ్చుకుని గెలిచారు..కోడికత్తి డ్రామాలాడాడు.

నేను జగన్ చెళ్లెల్లను మ్యానేజ్ చేశానని  చెప్పాడు. నీ బతకు భయంకరంగా ఉంటుంది జగన్...ఎల్లప్పుడూ జనాన్ని మోసం చేయలేవు.

తండ్రి హత్య కేసులో న్యాయం కోసం పోరాడుతుంటే ఆమెపైనే కేసులు పెడుతున్నారు. చంపిన వ్యక్తే ఎవరు చంపించారో చెప్పాడు...హంతకున్ని పక్కన పెట్టుకని ఓటేయాలని అడుగుతున్నావ్ మనసెక్కడ ఒప్పిందని సునీతారెడ్డి ప్రశ్నించారు. 

బాబాయిని ఎవరు చంపారో చెప్పి ఓట్లు అడుగు జగన్. వివేకాను ఎవరు చంపారో అందరికీ తెలుసు. హత్య చేయించిన వారిని అరెస్టు చేయడానికి సీబీఐ వస్తే అడ్డుకున్నారు. ఎదుటువారిపై విమర్శలు చేసి బతకాలని చూస్తున్నారు.

కలియుగం గురించి మాట్లాడుతున్నాడు జగన్....గొడ్డలితో నరికిన వాన్ని కాపాడి...బాధితులపై నేరం మోపుతున్నావు చూడు అదే కలియుగం. 

చెల్లికి న్యాయం చేయకపోగా వేధిస్తున్నావు చూడు అది కలియుగం. 

హత్య చేసిన వారిని అరెస్టు చేయడానికి వచ్చిన సీబీఐపై కేసు పెడితే కోర్టుకు వెళ్లి స్టే తెచ్చుకున్నారు చూడు అది కలియుగం.  

హత్యలు చేసి నిస్సిగ్గుగా అబద్ధాలు చెప్పేవాళ్లు సీఎంగా ఉండటమే కలియుగం.

ఆయనకు ఎవరూ లేరంట..పేపరు, టీవీ లేవు అంట ఒంటరి వాడంట..దాడి చేస్తున్నారంట. నువ్వు చేసిన పాపానికి చేస్తున్న దాడికి అందరూ ఒకటయ్యారు జగన్.

మీ ఇంట్లో దొంగపడతాడు...ఏం చేస్తారు.? ఇంటికొక మనిషి కర్రతీసుకుని దొంగను తరుముతారు..ఇక్కడ కులం, మతం చూసుకుంటారా.?

ఒక దోపిడీ దారుడు, విధ్వంసకారుడు, అహంబావి రాష్ట్రాన్ని నాశనం చేస్తుంటే అందరూ ఒకటి కావాలి. 

సంపద సృష్టించడం, ఉద్యోగాలు ఇవ్వడం, బంగారు భవిష్యత్తు చేయడం తెలిసిన పార్టీ టీడీపీ.

రాష్ట్రం కోసం పవన్ కళ్యాణ్ ముందుకు వచ్చారు. వైసీపీ విముక్త రాష్ట్రం కోసం ముందుకు వచ్చారు. బీజేపీ కూడా ముందుకు వచ్చింది.

రూ.10 లక్షల కోట్లు జగన్ అప్పులు చేశాడు. వాటిని తీర్చి అభివృద్ధి చేయాలి. ఉదయగిరి నుండి బయటకు వెళ్లారు...వారు బాగుపడ్డారు..ఇక్కడున్న వాళ్లు బాధపడుతున్నారు.

రాష్ట్రంలోని అందరూ బాధపడేవాళ్లే...టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి మీ జీవితాల్లో వెలుగులు నింపాలని కలిశాయి.

కేంద్రంలో ఉండే ప్రభుత్వం వస్తే నిధులు వస్తాయి...పనులకు అనుమతులు వస్తాయి.

ప్రజల కోసమే పొత్తు...వైసీపీని చిత్తు చేయడం కోసం నిండు మనసుతో దీవించాలి.

రాష్ట్రం విడిపోయాక పోలవరం, అమరావతి కోసం పని చేస్తే వాటిని విధ్వంసం చేశాడు జగన్.

3 రాజధానులతో మూడు ముక్కలాటలాడి చివరకు రాజధాని లేకుండా చేశాడు.

చిన్న పనికి కూడా పక్కరాష్ట్రాలకు వెళ్తున్నారు. పోలవరం పూర్తి చేస్తే గోదావరి నీళ్లను నదుల అనుసంధానంతో సీమకు, ఉదయగిరి వచ్చేవి...సస్యశ్యామలం అయ్యేది. 

సంపద సృష్టిస్తాం...ఆదాయం పెంచుతాం. సూపర్-6 పథకాలు జగన్ అసాధ్యం అంటున్నాడు...అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం టీడీపీ, ఎన్డీయేకే సాధ్యం.

నీ లాగా దోచుకుంటే అసాధ్యం అవుతుంది...కష్టపడితే ఏదైనా సాధ్యం అవుతుంది.

మహిళల్ని శక్తి వంతమైన మహిళలుగా తీర్చిదిద్దతా..అందుకోసం ఆడబిడ్డ నిధి కింద 18-59 ఏళ్ల మహిళలకు రూ.15 వందలు ప్రతినెలా అందిస్తాం. ఆంక్షలు, నిబంధనలు లేకుండా అందిస్తాం.

తల్లికి వందనం ద్వారా చదువుకునే ప్రతి బిడ్డకు రూ.15 వేలు ప్రతి యేటా ఇస్తాం. 

దీపం పథకం ద్వారా యేడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందిస్తాం. మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తాం. 

అన్నదాత కింద రూ.20 వేలు పెట్టుబడి నిధి అందిస్తాం. సబ్సీడీలు, డ్రిప్ అందించి రైతును రాజును చేస్తాం.

ఐదేళ్లలో యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం...ఉద్యోగం వచ్చే వరకూ నెలకు రూ.3 వేల భృతి అందిస్తా. 

మెగా డీఎస్సీ పైనే తొలి సంతకం. ప్రభుత్వ ఉద్యోగాలను వైసీపీలాగా అమ్ముకోకుండా అర్హత ఉన్నవాళ్లకు ఇస్తాం.

పోలీసు నియామకాలు చేపడతాం. వర్క్ స్టేషన్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఇంటికి సురక్షిత మంచి నీరు అందిస్తాం. బీసీలకు రక్షణ చట్టం తీసుకొస్తాం. 

జగన్ ఐదేళ్లలో ముక్కుతూ పెన్షన్ రూ.3 వేలు చేశాడు. మన ప్రభుత్వం వచ్చాక ప్రతి ఇంటికి వచ్చి పెన్షన్ ను నెలకు రూ.4 వేలు అందిస్తాం. ఒక నెల తీసుకోకపోయినా రెండో నెల, రెండో నెల తీసుకోకపోయినా 3వ నెల అందిస్తాం.

బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్ అందిస్తాం. టీడీపీకి బీసీలే వెన్నెముక. సబ్ ప్లాన్ తెచ్చి బీసీలకు న్యాయం చేస్తాం. మాదిగలకు న్యాయం చేస్తాం. సామాజిక న్యాయానికి పెద్దపీట టీడీపీ వేస్తే...సామాజిక అన్యాయం చేసిన పార్టీ వైసీపీ. 

సాగునీటి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తాం. నేను ఏం చేశానో చరిత్ర తిరగేస్తే 9 సార్లు డీఎస్సీ వేశాను, ఎన్టీఆర్ 2 సార్లు డీఎస్సీ ఇచ్చారు...ఐదేళ్లలో ఒక్క డీఎస్సీ కూడా జగన్ ఇవ్వలేదు.

నా పేరు చెప్తే హైటెక్ సిటీ, కియా పరిశ్రమ, పట్టిసీమ ప్రాజెక్టు, విమానాశ్రయం గుర్తొస్తాయి...నీ పేరు చెప్తే గుర్తొచ్చేది ఒక్క మంచి పని చెప్పు.? 

జగన్ పిడిగుద్దలకు చివరి రోజులు వచ్చాయి. రూ.2 లకు కిలోబియ్యం, పక్కా ఇంటి నిర్మాణం, రూ.50లకే విద్యుత్ ఇచ్చింది ఎన్టీఆర్. 

విదేశీ విద్య, అన్న క్యాంటీన్, చంద్రన్నబీమా ఎవరు పెట్టారు..మేమే పెట్టాం. జగన్ పుట్టకముందే తిరుపతిలో ఎన్టీఆర్ అన్నదాన కార్యక్రమాన్ని తెచ్చారు. దాన్ని జగన్ ప్రభుత్వం భ్రష్టు పట్టించింది

అప్పులు చేసి బటన్ నొక్కుతున్నావ్..ట్యాంకులో నీళ్లు ఉంటేనే వస్తాయి...లేకుండా కుళాయి తిప్పితే బురద వస్తుంది...కాసేపు ఆగితే అది కూడా రాదు. 

వేమిరెడ్డికి పోటీగా ఏ2 వచ్చాడు. బిర్యానీ, క్వార్టర్ బాటిల్ ఇస్తాం రండి అంటే విజయసాయిరెడ్డి సభ నుండి జనం పారిపోయారు.

సిద్ధాంత పరంగా వస్తేనే సభల్లో ఉంటారు..అద్దెకు వస్తే నిలబడకుండా వెళ్లిపోతారు. దోపిడీ కోసం వచ్చిన వారిని కాదు...ప్రజాసేవ కోసం వచ్చిన వారిని ఆశీర్వదించండి.

ఫ్లోరైడ్ సమస్యను పరిస్కరించేందుకు కుళాయి ద్వారా మంచినీళ్లు అందిస్తాం. కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు శాశ్వత పరిష్కారం చూపిస్తాం. 

తాగు, సాగు నీరు అందించేందుకు వెలుగొండ ప్రాజెక్టు, సోమశిల నార్తె కెనాల్, పెద్దిరెడ్డి పల్లె రిజర్వాయర్ పనులు పూర్తి చేస్తాం. 

 

పాలిటెక్నిక్ కాలేజీ నిర్మాణం, షాదీ మంజిల్ అభివృద్ధికి నిధుల, ఉదయగిరి కోట అభివృద్ధి, వింజమూరులో సమ్మర్ స్టోరేజీ ఏర్పాటు చేస్తాం. ఉదయగిరికి పరిశ్రమలు తెచ్చి ఉద్యోగాలు ఇస్తాం. 

మాకు ఓటేస్తే పెట్టుబడులు వస్తాయి...మీ బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి. 

మాకు ఓటేస్తే మీ పంటలకు గిట్టుబాటు ధర వస్తుంది...మీ పొలాలకు నీళ్లు వస్తాయి.

మాకు ఓటేస్తే ఉపాధి దొరకుతుంది..మీ గ్రామాలకు మంచి రోడ్లు వస్తాయి.

మాకు ఓటేస్తే మహిళలకు భద్రత ఉంటుంది.

మాకు ఓటేస్తే ఉద్యోగులకు ప్రతినెలా జీతాలు వస్తాయి...ఉద్యోగ నోటిఫికేషన్లు వస్తాయి.

తోలుకొచ్చిన జనంతో రోజుకో మీటింగ్ పెడుతున్నాడు జగన్...కానీ నేను నేరుగా మీ ముందుకే వస్తున్నా.

కేంద్రంలో 400 పైగా ఎంపీ సీట్లు వస్తే రాష్ట్రంలో 160కి పైగా అసెంబ్లీ సీట్లు వస్తాయి. 

నన్ను ఎన్ని విధాలా బూతులు తిట్టి ఇబ్బంది పెట్టినా మీకోసం పని చేస్తున్నా. కో

రాష్ట్రాన్ని గాడిలో పెట్టి అన్ని రాష్ట్రాల కంటే ముందు వరుసలో నిలబెడతాం. 

14 ఏళ్లలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత చేశానో...రాబోయే 5 ఏళ్లలో అంతకంటే మిన్నుగా పని చేసి చూపిస్తా.

జగన్ ఐదేళ్లు పాలించి 30 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లాడు. అందరి బతుకులు అంధకారం అయ్యాయి. 


Comments