'శ్రీ దుర్గామల్లేశ్వరస్వామి వార్ల దేవస్థానం,ఇంద్రకీలాద్రి, విజయవాడ' 30 మార్చి 2025. (ప్రజా అమరావతి);
"ఇంద్రకీలాద్రి పై ఉగాది వేడుకలు
"
శ్రీ విశ్వావసు నామ సంవత్సర ఉగాది వేడుకలు ఇంద్రకీలాద్రిపై వైభవంగా జరిగాయి.
శ్రీ దుర్గామల్లేశ్వరులకు, పరివార దేవతలకు స్నపనాభిషేకం నిర్వహించిన అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వసంత నవరాత్రులు సందర్బంగా
దేవస్థానం లో నటరాజ స్వామి వారి ఆలయం ప్రక్కన నిర్మించిన పూజా మండపం లో ఉదయం పుష్పార్చన ప్రారంభం అయింది.
మొదటి రోజైన ఉగాది సందర్బంగా శ్రీ అమ్మవారికి మల్లెపూలు, మరువము తో అర్చన జరిగింది.
మధ్యాహ్నం 3 గంటల నుండి ఉగాది పంచాంగ శ్రవణం కార్యక్రమం పుష్పార్చన ప్రదేశం లో జరిగింది. దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి శ్రీ చల్లా శ్రీనివాస శర్మ పంచాంగ వివరాలు వెల్లడించారు.
ఈ సంవత్సరం రాజ్యాధిపతి, మంత్రి, సేనాధిపతి అనుకూలురవ్వటం వలన అమ్మవారి అనుగ్రహంతో సకాలంలో వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని,అభివృద్ధి బాగుంటుందని, ధార్మిక కార్యకలాపాలు విస్తృతంగా జరుగుతాయని వివరించారు.
అనంతరం పంచాంగ కర్త శ్రీనివాసశర్మ ను ఆలయ కార్యనిర్వహణాధికారి శ్రీ కె. రామచంద్ర మోహన్ సత్కరించారు. ఈ కార్యక్రమం లో స్థానాచార్య శ్రీ శివ ప్రసాద్ శర్మ తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment