ముద్రా యోజన పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా గల ముద్రా రుణ లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ.

 

ముద్రా యోజన పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో దేశవ్యాప్తంగా గల ముద్రా రుణ లబ్ధిదారులతో ముచ్చటించిన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ

 08 APR 2025  Hyderabad (prajaamaravati);

నేపథ్యం: కేంద్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ముద్రా యోజన పదేళ్ళు పూర్తి చేసుకున్న సందర్భంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దేశవ్యాప్తంగా గల ముద్రా రుణ లబ్ధిదారులతో ముచ్చటించారు. ఆంధ్ర ప్రదేశ్ లబ్ధిదారుతో ప్రధానమంత్రి సంభాషణ ఈ విధంగా సాగింది:
 
లబ్ధిదారు: సర్, నేను ఆంధ్ర ప్రదేశ్ నుంచి వచ్చాను. నాకు హిందీ రాదు, నేను తెలుగులోనే మాట్లాడతాను సర్..


ప్రధానమంత్రి: అలాగే, మీరు నిశ్చింతగా తెలుగులోనే మాట్లాడవచ్చు..

లబ్ధిదారు: చాలా సంతోషం సర్.. నాకు 2009లో పెళ్ళయింది. అప్పటి నుంచి 2019 వరకూ గృహిణి గానే ఉన్నాను. 2019లో నాకు కెనరా బ్యాంక్ ప్రాంతీయ శిక్షణ కేంద్రం వారు 13 రోజుల పాటు జ్యూట్ సంచుల తయారీలో శిక్షణనిచ్చారు. ముద్రా యోజన పథకం కింద బ్యాంక్ ద్వారా నాకు 2 లక్షల రూపాయల రుణం అందింది. దాంతో నవంబర్ 2019లో నేను నా వ్యాపారాన్ని మొదలుపెట్టాను. కెనరా బ్యాంకు వారు నా మీద పూర్తి నమ్మకంతో నాకు రెండు లక్షల రూపాయల రుణాన్ని మజూరు చేశారు. ఈ క్రమంలో వారు నన్ను ఎటువంటి పూచీకత్తు అడగలేదు. లోన్ పొందేందుకు నేను ఇతరత్రా ఎటువంటి ప్రయత్నమూ చేయవలసిన అవసరం రాలేదు. పూచీకత్తు లేకుండానే నాకు రెండు లక్షల రూపాయల రుణం అందింది. బ్యాంక్ అప్పుని నేను సకాలంలో తీర్చినందువల్ల 2022లో బ్యాంక్ వారు నాకు మరో 9.5 లక్షల రుణాన్ని మంజూరు చేశారు. ఇప్పుడు నా వద్ద 15 మంది పని చేస్తున్నారు.

ప్రధానమంత్రి: అయితే 2 లక్షల పెట్టుబడితో మొదలుపెట్టిన మీరు 9.5 లక్షల వరకు చేరుకున్నారు.. మీ వద్ద ఎంత మంది పని చేస్తున్నారన్నారు?

లబ్ధిదారు: 15 మంది సర్.. వీరంతా గృహిణులే.. అందరూ గ్రామీణ స్వయం ఉపాధి కేంద్రంలో (ఆర్సీటీ) శిక్షణ పొందిన వారే! ఒకప్పుడు నేను శిక్షణార్ధిగా ఉన్న నేను ఈరోజు నలుగురికి శిక్షణనిచ్చే బోధకురాలిగా మారాను. ఇటువంటి అద్భుతమైన అవకాశం నాకు దక్కినందుకు ఎంతో సంతోషిస్తున్నాను. థాంక్ యు సర్, థాంక్ యూ..  థాంక్ యు వెరీ మచ్ సర్!

ప్రధానమంత్రి: కృతజ్ఞతలు!

Comments